-
'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
డార్లింగ్ ప్రభాస్కి 'సలార్' స్పెషల్ మూవీ. ఎందుకంటే 'బాహుబలి' తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్న ఇతడికి.. ఈ మూవీ సక్సెస్ సరికొత్త ఎనర్జీ ఇచ్చింది. గతేడాది థియేటర్లలో రిలీజైనప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. కొన్నిరోజుల క్రితం టీవీలో వచ్చినప్పుడు మాత్రం ఊహించనంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'పుష్ప' విలన్ హిట్ సినిమా.. తెలుగులో డైరెక్ట్ రిలీజ్)ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన సినిమా 'సలార్'. 'కేజీఎఫ్' తర్వాత సెట్స్పైకి వెళ్లిన ఈ మూవీ.. చాలాసార్లు వాయిదాలు పడుతూ గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ తెచ్చుకుని, రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బిగ్ స్క్రీన్పై సక్సెస్ అందుకున్న ఈ చిత్రం.. బుల్లితెరపై మాత్రం ఫెయిలైంది. ఏప్రిల్ 21న ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారం చేయగా కేవలం 6.52 టీఆర్పీ వచ్చింది. తాజాగా ఈ విషయం బయటపడింది.థియేటర్లలో 'సలార్'ని బాగానే చూశారు. కానీ టీవీల్లోకి వచ్చేసరికి దీన్ని లైట్ తీసుకున్నారు. ఎందుకంటే థియేటర్లలో ఫ్లాప్ అయిన ఆదికేశ (10.47), స్కంద (8.11)తో పాటు ఓ మాదిరిగి ఆడిన నా సామి రంగ (8.08), మంగళవారం (7.21), బిచ్చగాడు 2 (7.12) చిత్రాలకు కూడా 'సలార్' కంటే ఎక్కువ టీఆర్పీ రావడం అవాక్కయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ హవా నడుస్తోంది. దీని వల్ల టీఆర్పీ తగ్గిందని తెలుస్తోంది. లేదంటే ఎక్కువ వచ్చేదేమో?(ఇదీ చదవండి: ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్) -
టీఆర్పీలో రికార్డు సృష్టించిన స్టార్ మా.. ఆ ఛానల్స్ను వెనక్కు నెట్టి..
స్టార్ మా చానల్స్ కొత్త చరిత్ర సృష్టించాయి. బార్క్ 13వ వారం రేటింగ్స్లో అత్యధిక రేటింగ్స్ సాధించింది స్టార్ మా. ప్రైమ్ టైమ్ తోపాటు నాన్ ప్రైమ్ ట్రైమ్లో కూడా ఇతర జీఈసీ ఛానెల్స్ రేటింగ్స్ దాటేసింది. 13వ వారం మొత్తమ్మీద స్టార్ మాకు 882 జీఆర్పీల రేటింగ్ వచ్చింది. స్టార్ మా ప్రైమ్టైమ్ జీఆర్పీ లలో 342 , నాన్ ప్రైమ్ టైమ్లో 510 సాధించింది. నూతన సీరియళ్ల లాంచ్ లోనూ స్టార్ మా తన ఆధిపత్యం చాటింది. తెలుగు ఛానెల్స్ లో మాత్రమే కాదు, దేశం మొత్తం మీద మరే ఇతర భాషలోని వినోద ఛానెల్స్ సాధించలేని అరుదైన రికార్డు సాధించింది. ఇటీవలే స్టార్ మాలో ప్రారంభమైన నాగపంచమి, బ్రహ్మముడి సీరియల్స్ గత రికార్డులన్నింటినీ తిరగరాశాయి. గత మూడేళ్లగా కొనసాగుతున్న రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ నాగపంచమి సీరియల్ 11556 ('000 ఏఎంఏ), బ్రహ్మముడి సీరియల్ 10372.2('000 ఏఎంఏ) సాధించింది. ఈ రికార్డులకు దూరంగా సన్టీవీలో ప్రారంభమైన వనథై పోలా 9661.2 ('000 ఏఎంఏ); స్టార్ ప్లస్లో ప్రారంభమైన ఇమ్లీ 8814.1 ('000 ఏఎంఏ), కలర్స్లో నాగిన్ - 5 సీజన్ 8700.5 ('000 ఏఎంఏ) తరువాత స్థానాలలో నిలిచాయి. ఇక స్టార్ మా మూవీస్ , జెమినీ టీవీని వెనక్కి నెట్టి 228 జీఆర్పీల రేటింగ్ సాధించింది. ఇండియాలో నెంబర్1 మ్యూజిక్ ఛానెల్గా స్టార్ మా మ్యూజిక్ స్పష్టమైన ఆధిక్యతను ఇతర మ్యూజిక్ ఛానెల్స్పై చూపింది. -
కార్తికేయ 2 ఫస్ట్ టైమ్ టీఆర్పీ ఎంతో తెలుసా?
బాక్సాఫీస్ వద్ద కార్తికేయ 2 సినిమా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే! అటు థియేటర్లు, ఇటు ఓటీటీలో రికార్డులు సృష్టించిన ఈ మూవీ ఇటీవల బుల్లితెరలోనూ ప్రసారమైంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటిసారిగా జీ తెలుగులో ప్రసారం కాగా 7.88 రేటింగ్ అందుకుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకుల్లో 'కార్తికేయ 2'కి ఉన్న క్రేజ్ ఏపాటిదో రుజువైంది. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన సూపర్నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’. ఇందులో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి, హర్ష అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. చదవండి: హీరోయిన్ ముఖం నిండా సూదులు, ఏమైంది? ఓటీటీలో ల్యాండయిన జిన్నా మూవీ -
చిరు 150..అక్కడ అట్టర్ ఫ్లాప్..!
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఖైదీ నంబర్ 150. ఆ అంచనాలను నిజం చేస్తూ ఈ సినిమా వెండితెర మీద సరికొత్త సంచలనాలను నమోదు చేసింది. కుర్ర హీరోలకు కూడా షాక్ ఇస్తూ మెగాస్టార్ 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మరోసారి సత్తా చాటాడు. నాన్ బాహుబలి రికార్డు లన్నింటినీ బద్ధలు కొట్టిన ఖైదీ నంబర్ 150, బుల్లి తెర మీద మాత్రం నిరాశపరిచింది. చిరు రీ ఎంట్రీ టెలివిజన్ ప్రీమియర్కు కూడా భారీ ప్రచారమే చేశారు. ముఖ్యంగా బుల్లితెరపై చిరు చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో చిరు సినిమాకు బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే మరోసారి బుల్లితెరపై మెగాస్టార్ నిరాశపరిచాడు. వెండితెరపై కనక వర్షం కురిపించిన ఖైదీ నంబర్ 150 బుల్లి తెర మీద మాత్రం ఆకట్టుకోలేదు. ఈ సినిమాను కనీసం రెండకెల టీఆర్పీ కూడా దక్కకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ సినిమాకు కూడా 7.52 టీఆర్పీ రాగా.. మెగా 150కి అంతకన్నా తక్కువగా 6.9 రేటింగ్ మాత్రమే వచ్చింది. గతంలో ఏ సినిమా ప్రీమియర్ విషయంలో లేని విధంగా హిట్ సాంగ్స్ను రెండు సార్లు ప్లే చేసినా కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ముఖ్యంగా అదే సమయంలో మరో ఛానల్లో సినీ వేడుక ప్రసారం కావటమే చిరు సినిమాకు టీఆర్పీ రేటింగ్ రాకపోవటానికి కారణం అన్న టాక్ వినిపిస్తోంది. -
సంచలనాలు వద్దు..సత్యానికి దగ్గరగా ఉండాలి
ప్రాంతీయ సంపాదకుల సదస్సులో వెంకయ్య నాయుడు సాక్షి, చెన్నై: మీడియా సంచలనాలకు దూరంగా, సత్యానికి దగ్గరగా ఉండే సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో గురువారం నుంచి చెన్నైలో రెండు రోజులపాటు జరుగుతున్న ప్రాంతీయ సంపాదకుల సదస్సును వెంకయ్య ప్రారంభించారు. వార్తను వార్తగానే చూడాలనీ, అందులో సొంత ఆలోచనల్ని రుద్దవద్దని మీడియా సంస్థలను ఆయన కోరారు. పోటీని తట్టుకునేందుకు, టీఆర్పీని పెంచుకునేందుకు మీడియా చిన్న వార్తలను సంచలనాలుగా చూపిస్తోందన్నారు. ప్రభుత్వ విధానాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రాంతీయ మీడియా కీలకపాత్ర పోషిస్తోందని కితాబునిచ్చారు. మానవ హక్కులు ఉన్నది మనుషుల కోసమనీ, తీవ్రవాదుల కోసం కాదన్నారు. స్మార్ట్సిటీ ప్రాజెక్టులో భాగంగా రెండో దశలో 40 నగరాలను ప్రభుత్వం ఎంపికచేసిందనీ, త్వరలో జాబితా విడుదల చేస్తామన్నారు. సమావేశంలో తమిళనాడు సమాచార శాఖ మంత్రి కడంబూరు రాజు, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్రెడ్డి, పీఐబీ డెరైక్టర్ జనరల్ ఫ్రాంక్ నొరోన్హా తదితరులు పాల్గొన్నారు. లెసైన్స్ రాజ్, కోటా రాజ్ల కారణంగా 1950 నుంచి మూడు దశాబ్దాలపాటు భారత్ వాణిజ్య, పారిశ్రామిక విప్లవాలను కోల్పోయిందని, డిజిటల్ విప్లవం విషయంలో అలా జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement