breaking news
Tribal teacher unions
-
ఉపాధ్యాయురాలిపై మృగాడి వికృత చేష్టలు
సాక్షి, పాడేరు: విశాఖ మన్యంలో ఓ మృగాడి వికృత చేష్టలకు గిరిజన ఉపాధ్యాయురాలు మానసిక క్షోభను అనుభవిస్తుంది. రోజు రోజుకు ఆగడాలు శృతిమించుతుండడంతో ఎట్టకేలకు ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పాడేరు ప్రాంతంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గిరిజన మహిళ భర్త 15 నెలల క్రితం మృతి చెందాడు. దీంతో ఆమె తన ఇద్దరి పిల్లలతో కలిసి నివసిస్తుంది. పొట్టకూటి కోసం వలస వచ్చిన తూర్పుగోదావరి జిల్లా దివిలీకి చెందిన ఆకుల అచ్యుత్కుమార్ చూపు ఆమెపై పడింది. తాను అండగా ఉంటానని, ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికాడు. ఆమెతో సన్నిహితంగా ఉంటూ రహస్యంగా ఉపాధ్యాయురాలి ఫొటోలు చిత్రీకరించాడు. ఏజెన్సీలో పనిచేస్తున్న సుమారు 250 మంది ఉపాధ్యాయుల ఫోన్ నంబర్లు సేకరించి వాట్సాఫ్ గ్రూపు తయారు చేశాడు. వాట్సాప్ గ్రూపుతో పాటు ఫేస్బుక్లో కూడా ఉపాధ్యాయురాలి అసభ్యకర ఫొటోలను అప్లోడ్ చేశాడు. ఈ సంఘటనపై ఆమె గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోజు రోజుకు అచ్యుత్ కుమార్ ఆగడాలు ఎక్కువ కావడంతో ఇటీవల ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చదవండి: మద్యం, మాంసం రుచిచూపి.. ప్రియుడితో కలిసి ఈ విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయులు ఆమెకు ధైర్య చెప్పి మరోసారి మహిళ ఉద్యోగ సంఘం తరఫున పోలీసులకు వాస్తవాలను వివరించి సాక్ష్యాలను అందజేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. ఈ సంఘటనపై పోలీసుల వాదన మరోలా ఉంది. ఉపాధ్యాయురాలి భర్త చనిపోయిన అనంతరం అచ్యుత్కుమార్, ఉపాధ్యాయురాలు అన్నవరం దేవస్థానంలో వివాహం చేసుకున్నారని, కుటుంబ కారణాల రీత్యా వీరిద్దరు దూరమయ్యారంటున్నారు. తన భార్యతో కలిసే ఉంటానని కోర్టును ఆశ్రయించగా భార్య పోలీసు స్టేషనులో వేధిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరు కలిసారని, అచ్యుత్కుమార్ వద్ద ఉంటున్న మొబైల్లో ఓ వీడియో బయటకు వచ్చిందన్నారు. ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు ఈ నెల 6న పాడేరులో అచ్యుత్కుమార్ను పట్టుకునే ప్రయత్నం చేయగా తమపై దాడికి ప్రయత్నించారన్నారు. దీంతో నిందితుడిపై రెండు కేసులు నమోదు చేసి 6న రాత్రి రిమాండ్కు పంపించామని చెప్పారు. ఉపాధ్యాయురాలు పోలీసులపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. -
పోలీస్ పహారా నడుమ ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్
ఖమ్మం, న్యూస్లైన్: రెండేళ్లుగా వాయిదా పడుతున్న గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ఎట్టకేలకు ఆదివారం పోలీసు పహారా నడుమ కొనసాగింది. ముందుగా ఊహించిన విధంగానే కౌన్సెలింగ్ను అడ్డుకునేందుకు ఏజెన్సీ ప్రాంత గిరిజన ఉపాధ్యాయ సంఘాలు విఫల యత్నం చేశాయి. ఆయా సంఘాల నాయకు లు డీఈవో కార్యాలయంలోకి దూసుకెళ్లేం దుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అనంతరం జిల్లాలోని వివిధ కేటగిరీల్లో ఎస్ఏ(స్కూల్ అసిస్టెంట్)లుగా పనిచేస్తున్న 38 మందికి గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కాగా జిల్లాను యూనిట్గా పదోన్నతులు చేపట్టవద్దని, దీంతో గిరిజనులకు నష్టం జరుగుతుందని ఆరోపిస్తూ కౌన్సెలింగ్ను అడ్డుకుంటామని ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్, ఇతర గిరిజన ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించా యి. ఈ క్రమం లో జిల్లా విద్యాశాఖ అధికారి కలెక్టర్ను ఆశ్రయించారు. ఆయన ఎస్పీతో మాట్లాడి డీఈవో కార్యాలయం ఎదుట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌన్సెలింగ్ ప్రారంభం కాగానే గిరిజన ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈవో కార్యాలయానికి చేరుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఉపాధ్యాయులకు తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో టీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారావు, తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, ఆది వాసీ గిరిజన ఉపాధ్యాయ సంఘం నాయకులు రామారావులతోపాటు పలువురిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. మెరిట్ లిస్ట్పై అభ్యంతరాలు జిల్లా విద్యాశాఖ అధికారులు తయారు చేసిన మెరిట్ లిస్టు గందరగోళంగా ఉందని, తక్కువ పాయింట్లు వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ పాయింట్లు ఉన్నవారిని విస్మరించారని ఉపాధ్యాయురాలు లక్ష్మీ సుజాత డీఈవోకు ఫిర్యాదు చేశారు. తనకంటే తక్కువ సీనియార్టి ఉన్న నాగేశ్వరరావును జాబితాలో ముందు ఉంచారని ప్రశ్నించారు. దీనిపై తర్జనభర్జన పడ్డ అధికారులు నాలుగో స్థానంలో నాగేశ్వరరావు పేరును 15వ స్థానానికి మార్చారు. జాబితా సరిచేసి కౌన్సెలింగ్ నిర్వహించారు. 38 మంది ఎస్ఏలకు గ్రేడ్-2 హెచ్ఎంలుగా పదోన్నతి స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో పనిచేస్తున్న వివిధ కేటగిరీలకు చెందిన 38 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు గ్రేడ్-2 హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 45 హెచ్ఎం పోస్టుల భర్తీకోసం ఉపాధ్యాయుల సీని యార్టి లిస్టును తయారుచేశారు. మొత్తం 70 మందితో కూడిన జాబితాను తయారు చేసి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించగా ఏడుగురు ఉపాధ్యాయులు హాజరు కాలేదు. హాజరైన 38 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి వారు కోరుకున్న పాఠశాలకు పదోన్నతిపై బదిలీ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. 58 మంది ఉపాధ్యాయుల బైండోవర్ ఖమ్మం క్రైం: కౌనెల్సింగ్ను అడ్డుకునేందుకు యత్నించిన ఉపాధ్యాయులను త్రీటౌన్ పోలీసులు బైండోవర్ చేశారు. ఆందోళన చేస్తున్న 58 మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని అర్బన్ తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.