breaking news
Tribal Arts sankharavam Poster Release
-
ప్రజల కోసమే పనులు: మోదీ
నవ్సారి/అహ్మదాబాద్: సుదీర్ఘకాలం అధికారంలో ఉండి కూడా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ఏనాడూ ప్రాధాన్యమివ్వలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. శుక్రవారం గుజరాత్లోని గిరిజన జిల్లా నవ్సారిలో ఖుద్వేల్ గ్రామంలో గుజరాత్ గౌరవ్ అభియాన్ సభలో ఆయన మాట్లాడారు. ‘‘మేం అభివృద్ధి పనులు చేపడుతున్నది ఎన్నికల్లో గెలుపు కోసం, ఓట్ల కోసం కాదు. ప్రజల జీవితాలను మెరుగుపర్చాలన్న లక్ష్యంతో. గిరిజన ప్రాంతాలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. గిరిజన తండాల్లో రోడ్లు కూడా ఉండేవి కావు. మేమొచ్చాక మార్పు వచ్చింది’’ అన్నారు. రూ.3,050 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అలాంటి వారం ఒక్కటైనా ఉంటే చూపించండి ‘‘గతంలో మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల దాకా ప్రభుత్వ పథకాలు చేరాలంటే చాలా సమయం పట్టేది. ఏళ్లు గడిచినా టీకాలే అందేవి కావు. అడవి బిడ్డలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యేవారు. వారి సంక్షేమంపై మేం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. కరోనా టీకాలు వారికి త్వరగా అందజేశాం. ఇంతకుముందు గిరిజన ప్రాంతం నుంచి ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆయన సొంత గ్రామంలో నీళ్ల ట్యాంకు కూడా ఉండేది కాదు. నేను సీఎం కాగానే ఆ గ్రామంలో వాటర్ ట్యాంకు నిర్మించాలని ఆదేశించా. నేను ఓట్ల కోసమే అభివృద్ధి పనులు చేస్తున్నానని కొందరు విమర్శిస్తుండడం బాధాకరం. రెండు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉన్నా. నేను అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించని వారం ఒక్కటైనా ఉంటే చూపించాలని సవాలు విసురుతున్నా. గిరిజన ప్రాంతాల్లో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలే కాదు, యూనివర్సిటీలూ నిర్మిస్తున్నాం. రెండు దశాబ్దాలుగా గుజరాత్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది’’ అన్నారు. ‘ఇన్–స్పేస్’ ఆఫీసు ప్రారంభించిన మోదీ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇండియన్ స్పేస్ ప్రమోషన్, ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్) మోదీ ప్రారంభించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను, నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. ఐటీ తరహాలోనే గ్లోబల్ స్పేస్ సెక్టార్లోనూ భారత సంస్థలు అగ్రగామికి ఎదగాలని ఆకాంక్షించారు. అంతరిక్ష రంగంలో గతంలో ప్రైవేట్ సంస్థలకు ప్రవేశం లభించేది కాదని గుర్తుచేశారు. కానీ, తమ ప్రభుత్వం సంస్కరణలను తెరతీయడం ద్వారా ప్రైవేట్ రంగానికి స్వాగతం పలుకుతోందని తెలిపారు. స్పేస్ సెక్టార్లో సంస్కరణల ద్వారా అన్ని నియంత్రణలను, ఆంక్షలను తొలగించామని వివరించారు. ప్రైవేట్ రంగానికి ఇన్–స్పేస్ తగిన మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. స్కూల్ టీచర్తో భేటీ ప్రధాని నరేంద్ర మోదీ తనకు విద్యాబోధన చేసిన గురువును గుజరాత్ పర్యటనలో కలుసుకున్నారు. నవ్సారిలో నిరాలీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా టీచర్ జగదీష్ నాయక్(88)ను కలిసి కాసేపు మాట్లాడారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మోదీ కుటుంబం మెహసానా జిల్లాలోని వాద్నగర్లో నివసించిన సమయంలో ఆయనకు జగదీష్ నాయక్ పాఠాలు బోధించారు. -
విలాస జీవితాన్ని గడుపుతున్న కేసీఆర్
గిరిజనులకిచ్చిన హామీలను విస్మరించారు: ఉత్తమ్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముతో అధునాతన భవనాలు నిర్మించుకొని, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఎద్దేవా చేశారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను విస్మరించి, వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో తెలంగాణ గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఏప్రిల్లో జరగనున్న ‘గిరిజన రణ శంఖారావం’పోస్టర్ను ఉత్తమ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే గిరిజనులకు ఉద్యోగాలు వస్తాయని మాయమాటలు చెప్పారని అన్నారు. దీనివల్ల 2014 ఎన్నికల్లో ఏజెంట్లు కూడా దొరకని గిరిజన తండాల్లో ఓట్లు కూడా ఎక్కువగా పడ్డాయని అన్నారు. గిరిజనులకు డబుల్ బెడ్రూంలు ఇస్తానని దగా చేశారని విమర్శించారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో గిరిజనులు కూడా కీలక పాత్ర పోషించారని అన్నారు. తండాల అభివృద్ధి ఎంతో అవసరమని.. అందువల్ల తండాలను పంచాయతీలుగా గుర్తించాలని ఆయన కోరారు. భూసేకరణలో మొదటి దెబ్బ గిరిజనులపైనే పడుతుందని అన్నారు. అటవీ హక్కుల చèట్టాన్ని కూడా అమలు చేయకుండా గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుంటే ప్రజలు పాతర వేస్తారని అన్నారు. తెలంగాణ గిరిజన జేఏసీ కన్వీనర్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, అమర్ సింగ్ తిలావత్, గిరిజన సంఘం నాయకులు గణేశ్నాయక్, దాసురాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.