breaking news
Transfers Process
-
బదిలీ బాధలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : తొలిసారిగా ‘వెబ్ కౌన్సెలింగ్’ విధానంలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియకు సాంకేతిక సమస్యలు అవరోధంగా నిలుస్తున్నాయి. పూర్వపు మెదక్ జిల్లాలో 8,269 మంది ఉపాధ్యాయులు బదిలీ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు తాము బదిలీ అయ్యే చోటు కోసం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు శనివారం ఒక్క రోజే గడువు ఇచ్చారు. 262 మంది పీజీహెచ్ఎంలు, 152 మంది ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు శని వారం ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. పాఠశాల యూ డైస్ పాత కోడ్లు ఇవ్వడంతో తడబాటుకు గురయ్యారు. మరోవైపు ఒకే పేరు ఉన్న గ్రామాల్లో ఉన్న పాఠశాలలను ఎంపిక చేసుకోవడంలోనూ ఇబ్బందులు పడ్డారు. ఉదాహరణకు చిట్కుల్ పేరిట పటాన్చెరు, కొల్చారం మండలాల్లో పాఠశాలలు ఉండగా, అప్షన్లో మండలం పేరు లేక ప్రధానోపాధ్యాయులు అయోమయానికి గురయ్యారు. స్పౌజ్ కేటగిరీకి సం బంధించి 50 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలల్లోని ఖాళీలను చూపాల్సి ఉం డగా, 15 కిలోమీటర్ల పరిధిలోని స్కూళ్లను మాత్రమే వెబ్ ఆప్షన్లో చూపిం చారు. వెబ్ ఆప్షన్ నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులను విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెబ్ఆప్షన్ల నమోదు గడువును శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించారు. ‘వెబ్ కౌన్సెలింగ్’పై నేడు నిరసన ఉపాధ్యాయ బదిలీల కోసం విద్యా శాఖ ప్రవేశ పెట్టిన వెబ్ కౌన్సెలింగ్ విధానం పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది. వెబ్ కౌన్సెలింగ్ విధానంపై ముందస్తు ఆవగాహన కల్పించక పోవడాన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిం చాయి. కేవలం వందల సంఖ్యలో ఉన్న ప్రధానోపాధ్యాయులు వెబ్ ఆప్షన్ల నమోదులో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నాయి. ఆదివారం నుంచి వేలాది మంది స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఎదుర్కొనే సమస్యలకు ఎవరు బా ధ్యత వహిస్తారని ఐక్య వేదిక ప్రశ్నిం చింది. వెబ్ కౌన్సెలింగ్ స్థానంలో పాత పద్ధతిలో బదిలీలు నిర్వహించాలనే డిమాండ్తో ఆదివారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు 12 ఉపాధ్యాయ సంఘాలతో కూడిన ఐక్య వేదిక నాయ కులు ప్రకటించారు. స్థానిక ఐబీ అతిథిగృహం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనపై ఎస్టీయూ, టీపీఆర్టీయూ, టీఆర్టీఎఫ్, టీపీటీఎఫ్, టీటీఎఫ్, ఎస్జీటీఎఫ్, టీఎస్టీఎఫ్, టీఎస్ జీహెచ్ఎం, పీఆర్టీయూ నేతలు సంతకాలు చేశారు. -
బోధనకు ఎగనామం.. కబుర్లతో కాలక్షేపం!
బదిలీల ప్రక్రియతో బడిలో గందరగోళం కొత్త టీచర్ చూసుకుంటారులే అనే ధోరణి..పలు పాఠశాలల్లో ఇదే పరిస్థితి!! సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ విద్యార్థులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం బదిలీలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ పూర్తికావడంతో సీనియారిటీ జాబితా మార్పులు, చేర్పుల తంతు నడుస్తోంది. ఈ క్రమంలో టీచర్లంతా తమకొచ్చే పాయింట్లు.. ఖాళీలపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు. సహోద్యోగులతో ఈ అంశంపైనే చర్చించి తమకు లబ్ధి చేకూరే అంశాలపై ఆరా తీస్తూ.. చర్చోపచర్చలు జరుపుతున్నారు. జిల్లాలో 10,400 మంది టీచర్లున్నారు. ఇందులో 6,766 మంది ఉపాధ్యాయుల బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రోజువారీగా టీచర్లంతా విధులకు హాజరైనప్పటికీ.. అసలు పని పక్కనపెట్టి బదిలీలై ప్రక్రియపైనే కసరత్తు చేయడంతో పాఠ్యాంశాల బోధన గాడితప్పింది. సర్కారు జాప్యం.. విద్యార్థులకు సంకటం.. సాధారణంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ వేసవి సెలవుల్లో చేపడితే పాఠశాలల పునఃప్రారంభం నాటికి పరిస్థితి అంతా చక్కబడేది. కానీ ఈసారి బదిలీల ప్రక్రియపై విద్యాసంవత్సరం ప్రారంభమైన పక్షం రోజుల తర్వాత స్పందించి చర్యలు చేపట్టింది. దీంతో విద్యాసంవత్సరం తొలినాళ్లలో జోరుగా సాగాల్సిన పాఠ్యాంశాల బోధన ఒక్కసారిగా కుదేలైంది. మరోవైపు బదిలీల ప్రక్రియ పూర్తి కావాలంటే పది రోజులు ఆగాల్సిందే. కొత్తగా పాఠశాలల్లో చేరడానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. మొత్తంగా ఈ నెలాఖరు నాటివరకు బదిలీ తాలూకు ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. బదిలీల కౌన్సెలింగ్ ఈ నెల ఏడో తేదీ నుంచి ప్రారంభం కానుంది. అప్పడివరకు ఉపాధ్యాయులంతా పాయింట్లు, బదిలీల ఖాళీలు, అక్కడున్న పరిస్థితులపై టీచర్ల దృష్టంతా కేంద్రీకరిస్తారు. దీంతో ఇప్పటికిప్పుడు చేప్పే పాఠ్యాంశాలు సైతం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. బదిలీ అయ్యేది తథ్యమని భావిస్తున్న టీచర్లంతా కొత్తగా వచ్చే టీచర్లపైనే భారం వేస్తున్నారు. శుక్రవారం జిల్లాలోని పలు మండలాల్లో పాఠశాలల్లో పరిస్థితిని సమీక్షించగా.. ఎక్కడ చూసినా బదిలీలపైనే చర్చిం చుకోవడం కనిపించింది. ఈ నేపథ్యంలో జూలై చివరివరకు పాఠశాలల్లో బోధనలో పెద్దగా పురోగతి నమోదయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.