breaking news
tral
-
ముగ్గురు జైషే ఉగ్రవాదుల హతం
త్రాల్: జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లా, త్రాల్ ప్రాంతంలోని నాదిర్ గ్రామంలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వని, యావర్ అహ్మద్ భట్గా గుర్తించారు. వీరందరూ పుల్వామా జిల్లా వాసులే. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిర్దిష్ట సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల జాడ కోసం భద్రతాదళాలు డ్రోన్లను ఉపయోగించాయి. ఉగ్రవాదులను గుర్తించిన అనంతరం.. లొంగిపోవాలని కోరాయి. అయితే, భద్రతా సిబ్బందిని చూసిన వెంటనే, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మూడు గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఆ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు ఉండొచ్చని భద్రతా దళాలు భావిస్తున్నాయి. దీంతో ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. జమ్మూకశ్మీర్లో 48 గంటల్లో జరిగిన రెండో ఎన్కౌంటర్ ఇది. మంగళవారం షోపియాన్ జిల్లాలోని కెల్లర్ ప్రాంతంలో జరిగిన ఆపరేషన్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయిన సంగతి తెలిసిందే.లొంగిపోవాలని తల్లి వేడుకున్నా...మరణించిన ఉగ్రవాదుల్లో ఒకరైన అమీర్ నజీర్ ఎన్కౌంటర్కు ముందు తల్లితో మాట్లాడిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఎన్కౌంటర్కు ముందు చివరి క్షణాల్లో నజీర్ తను దాక్కున్న ప్రదేశం నుంచి తల్లికి వీడియో కాల్ చేశాడు. తన తల్లితో, సోదరితో మాట్లాడాడు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దని, భద్రతాదళాలకు లొంగి పోవాలని నజీర్ను తల్లి వేడుకుంది. ఏకే 47 పట్టుకుని ఉన్న నజీర్ లొంగిపోవడానికి నిరాకరించాడు. ‘సైన్యాన్ని నా ముందుకు రానివ్వండి. అప్పుడు చూస్తా’ అని బదులిచ్చి కాల్ కట్ చేశాడు. -
ట్రాల్లో ఉగ్రవాదుల దాడి..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని ట్రాల్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు లక్ష్యంగా గురువారం ఉదయం దాడులకు దిగారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మృతిచెందారు. దాదాపు 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఎక్కువమంది పోలీసులు, జవాన్లే ఉన్నారు. సీఆర్పీఎఫ్ యూనిట్ లక్ష్యంగా మొదట గ్రనేడ్ దాడులు చేసిన ఉగ్రవాదులు అనంతరం కాల్పులు జరిపారు. రాష్ట్రమంత్రి నయీమ్ అఖ్తర్ ట్రాల్ ప్రాంతానికి ఓ ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల నుంచి మంత్రి తృటిలో సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ కాల్పుల్లో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించిన భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని.. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. ర్యాంబన్లో జరిగిన మరో ఉగ్రవాద దాడిలో ఆర్మీ జవాను ఒకరు ప్రాణాలు కోల్పోయారు. -
సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రదాడి
శ్రీనగర్: కల్లోల జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. త్రాల్లోని సీఆర్పీఎఫ్ శిబిరంపై మంగళవారం గ్రెనేడ్లతో దాడి జరిపారు. ఈ ఘనటలో తొమ్మిది మంది జవాన్లు గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి క్యాంప్ మొత్తం తమ ఆధీనంలోనే ఉన్నదని, దాడికి పాల్పడిన ముష్కరుల కోసం వేట కొనసాగుతున్నదని పేర్కొన్నారు.