breaking news
The traffic problem
-
కదలని రింగ్ రోడ్డు!
కార్యరూపం దాల్చని ఎంపీ ప్రతిపాదనలు తీరని ట్రాఫిక్ సమస్య జగిత్యాల: జిల్లా కేంద్రంలో రింగ్రోడ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అధికారులు ప్రతిపాదనలు రూపొందించాలని ఎంపీ కల్వకుంట్ల కవిత 2016 డిసెంబర్ 28న కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆదేశించారు. అయినా అధికారుల నుంచి స్పందన కరువైంది. ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనలు రూపొందించడంలేదు. జగిత్యాలలో రింగ్రోడ్డు పూర్తయితే జిల్లా కేంద్రం రూపురేఖలు మారుతాయి. చిన్నరోడ్లతో ఇప్పటికే జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. 1983లో అమలులోని మాస్టర్ప్లాన్లోని రోడ్లే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారి అయిన యావర్రోడ్లో ఎన్హెచ్–63 విస్తరించి ఉంది. కానీ.. ఈ రోడ్లు కనీసం 100 ఫీట్లు కూడా లేవు. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో పాటు ప్రధాన ప్రాంతమైన టవర్సర్కిల్, గంజ్రోడ్డు, న్యూబస్టాండ్, ధర్మపురి రోడ్లంతా చిన్నవిగా ఉన్నాయి. వెడల్పు కార్యక్రమానికి గతంలో ప్రతి అధికారి ప్రతిపాదనలు తయారుచేశారే తప్ప మోక్షం దాల్చలేదు. ట్రాఫిక్ను తగ్గించాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాల క్రితం జగిత్యాల పక్క నుంచి బైపాస్రోడ్డు సైతం నిర్మించారు. ప్రస్తుతం ఈ బైపాస్ సిటీలోనే కలిసిపోయి ట్రాఫిక్ సమస్యగా ఏర్పడింది. ప్రస్తుతం బైపాస్రోడ్లోసైతం జనాలు ఎక్కువగా ఉండటంతో పెద్దపెద్ద వాహనాలు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు పార్కింగ్ సమస్యతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రింగ్రోడ్డుతో కళ జగిత్యాల జిల్లా కేంద్రంలో రింగ్రోడ్ నిర్మిస్తే జగిత్యాల రూపురేఖలే మారనున్నాయి. ఇప్పటి కే ధరూర్ నుంచి గొల్లపల్లి రోడ్లోఉన్న డం పింగ్రోడ్ వరకు ఒక బైపాస్రోడ్డు నిర్మించారు. అలాగే ధరూర్ నుంచి కాకతీయ కెనాల్ పక్కనుంచి చల్గల్ వరకు సైతం బైపాస్రోడ్ నిర్మిం చారు.వీటితో పాటు మరో రింగ్రోడ్ను ఏర్పా టు చేస్తే ప్రజలకు కూడా ఎంతో వినియోగకరంగా ఉంటుంది. ట్రాఫిక్ నియంత్రణలో ఉం టుంది. జగిత్యాల జిల్లా జనాభా ప్రతిపాదికనఅతి పెద్ద జిల్లాగా విస్తరించింది. చుట్టు జిల్లా కేంద్రంలోని 18 మండలాలతోపాటు మూడు మున్సిపాలిటీలతో చుట్టూ జిల్లాలైనా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ నుంచి సైతం జగిత్యాలకు వస్తుంటారు. ప్రస్తుతం రింగ్రోడ్డు అయితే ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. -
‘మహా’ మార్పు
నాలుగు జిల్లాలుగా రెవెన్యూ పాలన కొత్తగా చార్మినార్, గోల్కొండ, సికింద్రాబాద్, భువనగిరి బల్దియా చేతికి ఆర్టీసీ ఎస్ఆర్డీపీతో ట్రాఫిక్ సమస్యకు చెక్ సిటీబ్యూరో: మహా నగర పాలనా స్వరూపం మారబోతోంది. సరి‘కొత్త’ రూపాన్ని సంతరించుకోబోతోంది. ఈ దిశగా రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు నగర శివారు ప్రాంతాలను కలుపుతూ కొత్త రెవెన్యూ జిల్లాలు ఆవిర్భవించనున్నాయి. దీనికోసం ప్రత్యేక కమిటీని నియమించారు. పీకల్లోతు నష్టాలతో అష్టకష్టాలు పడుతున్న హైదరాబాద్ ఆర్టీసీ రిజియన్ను జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్ఆర్డీపీ (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం)లో రూ.2631 కోట్లతో 20 ప్రాంతాల్లో మల్టీలెవల్ ఫ్లై ఓవర్లు... గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. ఈ పనులన్నీ ఇక చకచకా కదలనున్నాయి. కొత్త జిల్లాల స్వరూపం ఇదే... హైదరాబాద్ -రంగారెడ్డి జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో మొత్తం ఐదు జిల్లాల ఏర్పాటు దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. 1978లో ఏర్పాటైన రంగారెడ్డి జిల్లాను ఇకపై వికారాబాద్, చెవెళ్ల, పరిగి, తాండూరు నియోజకవర్గాలకు పరిమితం చేయాలని యోచిస్తున్నారు. మిగిలిన ప్రాంతాలతో గోల్కొండ, చార్మినార్, సికింద్రాబాద్ జిల్లాలు... ఉప్పల్ లేదా మలక్పేట కేంద్రంగా పని చేసే భువనగిరి జిల్లాను ఏర్పాటు చేసే దిశగా సన్నాహాలు మొదలయ్యాయి. ఎస్ఆర్డీపీకి కదలిక క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్, ఎల్బీనగర్, బంజారాహిల్స్, బైరామల్గూడ, సంతోష్నగర్, రాయదుర్గం, మైండ్స్పేస్, అయ్యప్ప సొసైటీ, చింతలకుంట తదితర ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, జంక్షన్ల నిర్మాణ పనులు కదలనున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించిన కార్యాచరణ మొదలైంది. రూ.2631 కోట్ల పనులకు క్యాబినెట్ సైతం పచ్చజెండా ఊపేసింది. ఈ రహదారుల నిర్మాణ వ్యయం మొత్తం జీహెచ్ఎంసీ నిధుల నుంచే చెల్లించాలని నిర్ణయించడం విశేషం. -
ట్రాఫిక్ సమస్యలకు టెక్ పరిష్కారం
తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ఆధునిక టెక్నాలజీని వాడుకోవాలని డీజీపీ రాముడు పోలీసులకు పిలుపునిచ్చారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ‘సీసీ టీవీ సర్వేలైన్స్ సెంట్రల్ కమాండింగ్ సిస్టమ్, తిరుపతి ఫేస్బుక్ పేజ్’ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. నగరంలో ప్రధాన జంక్షన్లలో 150 కెమెరాలు అమర్చామని చెప్పారు. ఈ సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నియంత్రణతో పాటు నేర పరిశోధనలకు వీలవుతుందన్నారు. -
రూ.10వేల కోట్లతో స్కైవేలు
సాఫీ ప్రయాణ ఏర్పాట్లకు రూ.7 వేల కోట్లు దశల వారీగా పూర్తి సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం.. మార్గమధ్యలో రెడ్సిగ్నళ్లు లేకుండా ఒకచోటు నుంచి మరో చోటుకు సాఫీ ప్రయాణానికి తలపెట్టిన స్కై వేల కోసం ప్రభుత్వం దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయనుంది. సుమారు 100 కి.మీ. మేర స్కైవేలు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా. వీటితో పాటు ప్రధాన మార్గాల్లో ఎక్స్ప్రెస్ వేలు, సమగ్ర రహదారుల అభివృద్ధికి మరో రూ.7 వేల కోట్లు ఖర్చు కాగలవని అంచనా వేశారు. మొత్తంగారూ.17వేల కోట్లు వ్యయం కాగలదని అంచనా. నగరంలోని వివిధ మార్గాల్లో స్కైవేలు.. కొన్ని ప్రాంతాల్లో మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు (ఫ్లై ఓవర్లు), ఆర్ఓబీలు, ఆర్యూబీలు, స్పైరల్ మార్గాలు, ఎక్స్ప్రెస్వే కారిడార్లకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో... స్కైవేలకు రూ.10 వేల కోట్లు, నగరంలో తీవ్ర రద్దీ ఉండే సుమారు 600 కి.మీ. రహదారి అభివృద్ధి పనులు, 50 జంక్షన్లలో రోడ్ల విస్తరణ, ఫ్లై ఓవర్లు/ఆర్ఓబీలకు మరో రూ.7 వేల కోట్లు అవసరమవుతాయని లెక్క తేల్చారు. కన్సల్లెంట్ల నుంచి నివేదికలు అందాక అవకాశాన్ని బట్టి తొలుత కొన్ని మార్గాల్లో ఈ పనులు ప్రారంభించనున్నారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల మేరకు రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్కుమార్ శనివారం విలేకరులకు చెప్పారు. ఈ మార్గాల్లో సెంట్రల్ డివైడర్లు, డక్టింగ్, గ్రీనరీ, వరద కాలువలతో పాటు అవసరమైన ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కల్పిస్తారు. ఈ రహదారులను నాలుగు లేన్లతో ఏర్పాటు చేస్తారు. ప్రణాళికలు తుదిరూపు సంతరించుకునేందుకు మరో 15 రోజులు పడుతుందన్నారు. పనులు చేపట్టేందుకు సుమారు నెల రోజులు పడుతుందన్నారు. దశల వారీగా వీటిని చేపడతారు. తొలిదశలో ఎంపిక చేసిన 60 మార్గాల్లోని 300 కి.మీ. రహదారులు అభివృద్ధి చేస్తారు. ఎక్కడెక్కడంటే... నగరంలోని హరిహరకళాభవన్ -ఉప్పల్, మాసబ్ట్యాంక్ -హరిహర కళాభవన్, నాగార్జున సర్కిల్-మాదాపూర్, తార్నాక -ఈసీఐఎల్, చార్మినార్- బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల్లో స్కైవేలు నిర్మిస్తారు. ఎల్బీనగర్, ఉప్పల్, బంజారాహిల్స్ పార్క్, ఖైరతాబాద్, సచివాలయం, నెక్లెస్ రోడ్డు చౌరస్తా, అబిడ్స్, చాదర్ఘాట్, కోఠి, ఒవైసీ హాస్పిటల్, తిరుమలగిరి జంక్షన్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, సంగీత్, ప్యారడైజ్ తదితర జంక్షన్ల వద్ద మల్టీ లెవల్ గ్రేడ్ సపరేటర్స్ ఏర్పాటు చేసే యోచన లో అధికారులు ఉన్నారు. -
మౌలిక వసతులతోనే చిక్కులకు చెక్..!
ఏప్రిల్ నుంచి నగరమే రాష్ట్ర పరిపాలన కేంద్రం అమాత్యులు, అధికారులు ఇక్కడే మకాం తక్షణమే 5 వేల కుటుంబాలూ వస్తాయి.. రోజూ లక్షలాది మంది వచ్చే అవకాశం అందుకనుగుణంగా సదుపాయాలు కల్పించాలి ట్రాఫిక్ సమస్య నివారించాలి పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలి తాగునీటి సమస్యపై దృష్టి పెట్టాలి విజయవాడ : నగరం నాలుగు నెలల్లోనే నవ్యాంధ్రప్రదేశ్కు పరిపాలన కేంద్రం కానుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పారు. దీనిపై నగరవాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఆనందం ఇలాగే కొనసాగాలంటే పలు సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించాల్సి ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగరాన్ని తక్షణమే అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ట్రాఫిక్ భారీగా పెరిగింది. రానున్న నాలుగు నెలల్లో మరింత పెరుగుతుంది. ప్రస్తుతం తాగునీటి సమస్య కూడా నెలకొంది. నేరాలూ పెరిగాయి. అధికారులకు భవనాలు సమకూర్చడంతోపాటు కీలకమైన ట్రాఫిక్ సమస్యను పరిస్కరించాలి. డ్రెయిన్లు, తాగునీటి కష్టాలు కూడా తలెత్తకుండా చూడాలి. ఈ మేరకు సదుపాయల కల్పనపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ నగర అధికారులతో చర్చించారు. పాలకులు, అధికారులు ఒక్కసారిగా వస్తే అవసరాలు తీర్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు వేధిస్తున్న ట్రాఫిక్ సమస్య నగరంలో ఇటీవల ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ప్రధాన రోడ్లతోపాటు అంతర్గత రహదారుల్లో సైతం గంటల తరబడి వాహనాలు బారులుతీరుతున్నాయి. దీంతో నిత్యం నగరవాసులు నరకయాతన పడుతున్నారు. ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కార్యక్రమాలు జరిగిన సమయంలో హైదారాబాద్ వైపు వెళ్లే వాహనాలను జాతీయ రహదారి నుంచి నగరం మీదుగా మళ్లించాల్సి వస్తోంది. ఆ సమయంలో వన్టౌన్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. ఆ ప్రభావం కృష్ణలంక జాతీయ రహదారిపై పడుతోంది. ఎర్రకట్ట, సింగ్నగర్ ఫ్లై ఓవర్లపై, రమేష్ ఆస్పత్రి జంక్షన్, నిర్మల కాన్వెంట్ జంక్షన్, ఎన్టీఆర్ సర్కిల్, పశువుల ఆస్పత్రి జంక్షన్లలో కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఇలా చేస్తే ట్రాఫిక్ సమస్య నివారించవచ్చు ► గొల్లపూడి బైపాస్ నుంచి సొరంగ మార్గం ద్వారా ఎర్రకట్ట కేదారేశ్వరపేట మీదుగా బీఆర్టీఎస్ రోడ్డులోకి వాహనాలను మళ్లించాలి. మధ్య, పశ్చిమ నియోజకవర్గాలను కలిపే ఎర్రకట్టపై పైప్లైన్ల లీకేజీలను అరికట్టాలి. ► గుణదల వంతెన పనులు పూర్తిచేయాలి. దీనివల్ల నూజివీడు వైపు నుంచి వచ్చే వాహనాలను జాతీయ రహదారిపైకి సులభంగా మళ్లించవచ్చు. తద్వారా సింగ్నగర్ ఫ్లై ఓవర్పై ఒత్తిడి తగ్గుతుంది. ►నగరం మీదుగా వెళ్తున్న రెండు జాతీయ రహదారులను కలిపేందుకు నిర్మిస్తున్న ఇన్నర్ రింగ్రోడ్డు పనులను త్వరగా పూర్తిచేయాలి. దీని వల్ల నగరంలోకి భారీ వాహనాలు రాకుండా నివారించవచ్చు. ► రోడ్ల విస్తరణ కూడా అత్యవసరం. బందరురోడ్డులో కంట్రోల్ రూం నుంచి ఆటోనగర్ చెక్పోస్టు వరకు విస్తరించాలి. గురునానక్ కాలనీ రోడ్డు, పటమటలంక రోడ్డు, పిన్నమనేని పాలిక్లినిక్రోడ్డు, టిక్కిల్రోడ్డు, ఎన్ఎస్ఎం రోడ్డు, రామలింగేశ్వరనగర్ కట్ట, రామకృష్ణాపురంరోడ్డు, గవర్నమెంట్ ప్రెస్ రోడ్డు, గుణదల నుంచి పడవల రేవు వరకు, గుణదల-పుల్లేటిడొంక రోడ్లు విస్తరించాల్సి ఉంది. చిట్టినగర్ జంక్షన్ నుంచి కాలేశ్వరరావు మార్కెట్ వరకు, రాజగోపాలాచారి వీధి, మ్యూజియంరోడ్డు, బీసెంట్రోడ్డులను విస్తరించాల్సి ఉంది. తాగునీటికి కటకట కృష్ణానది చెంతనే ఉన్నప్పటికీ నగర శివారు ప్రాంతాల్లో తాగునీటి కొరతతీవ్రంగా ఉంది. సింగ్నగర్, రాజీవ్నగర్, పాయకాపురం, రాజరాజేశ్వరీపేట పరిదిలోని పలు కాలనీలకు రెండు మూడు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఒక మనిషికి సగటున రోజుకు 150 లీటర్ల నీరు కావాలి. ప్రస్తుతం నగరంలో ఉన్న జనాభాకు రోజూ 15,72,36,000 లీటర్ల నీరు కావాలి ఉంది. నగరపాలక సంస్థ 12,14,52,000 లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తోంది. ఇందులో 2,63,84,000 లీటర్ల నీటిని బోర్ల ద్వారా తీస్తున్నారు. కేవలం 60 శాతం మాత్రమే కృష్ణానది ఉపరితల భాగం నుంచి సరఫరా అవుతోంది. ఏప్రిల్ నుంచి మరో 5వేల కుటుంబాలు నగరానికి వస్తాయని అంచనా. వీరితోపాటు సుమారు 3లక్షల మంది నగరానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో మరో 3కోట్ల లీటర్ల నీరు అవసరమవుతుంది. జనాభాకు ఏడాదికి 2.3 టీఎంసీలు అవసరమని అంచనా వేస్తున్నారు. పరిశ్రమలు, ఇతర అవసరాలకు కలిపి ఏడాదికి 5టీఎంసీలు నీరు నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే నీటి కష్టాల నుంచి గట్టెక్కవచ్చు ► ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రతి సంవత్సరం 400 నుంచి 800 టీఎంసీల వరకు నీటిని దిగువకు వదులుతున్నారు. దీనిలో 5 టీఎంసీలను తగిన ప్రాంతాల్లో నిల్వ చేసుకుంటే నగర ప్రజల నీటి కష్టాలను తొలగించవచ్చు. ► ఆటోనగర్లో తాగునీటి అవసరాల కోసం నగరపాలక సంస్థ రూ.53 కోట్లతో గుణదల గంగిరెద్దుల దిబ్బ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ను త్వరగా పూర్తిచేయాలి. దీనివల్ల ఆటోనగర్లో తాగునీటి సమస్యను నివారించవచ్చు. ► రామలింగేశ్వరనగర్, గుణదల ప్రాంతాల్లో ఉన్న వాటర్ప్లాంట్లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి. ► కొండప్రాంతాల వాసుల అవసరాలు తీర్చేందుకు త్వరగా రిజర్వాయర్లు నిర్మించాలి. వీటికోసం ఇప్పటికే డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు రూపొందిస్తున్నారు. కార్యాలయాల సమస్య... నగరంలో ప్రభుత్వ కార్యాలయాల సమస్య తీవ్రంగా ఉంది. గెస్ట్హౌస్ల కొరత కూడా నెలకొంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా నగరంలోని తమ శాఖల కార్యాలయాల్లోనే క్యాంపు ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో భవిష్యత్తులో భవనాల కొరత వల్ల ఒక్కోచోట ఒక్కో కార్యాలయం ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ► ఇలా చేస్తే మేలు : ఇప్పటికే అందుబాటులో ఉన్న పురాతన భవనాలకు మరమ్మతులు చేయించాలి. ► కేసరపల్లిలోని మేథా టవర్తోపాటు నగరం చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ సంస్థలను వినిగించుకోవాలి. ► ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాలను ముందస్తు ప్రణాళికతో తాత్కాలిక అవసరాలకు షెడ్లు, పార్కింగ్ స్థలాలుగా వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది. ► గెస్ట్హౌస్లను ఆధునికీకరించాలి. ఉన్న గదులను కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసురావాలి. నేరాలకు అడ్డాగా మారుతోంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నగరంలో నేరాలు పెరిగాయి. ఈ విషయాన్ని పార్లమెంట్లోనే ప్రకటించారు. నగరంలో ఇటీవల గన్ సంస్కృతి వచ్చింది. శివారు ప్రాంతాల్లో ఖాళీ భూములను కైవసం చేసుకునేందుకు గ్యాంగ్లు బయలు దేరాయి. న్యూ రాజరాజేశ్వరీపేట, సింగ్నగర్, పాయకపురం, పెజ్జోనిపేట ప్రాంతాల్లో భూవివాదాలు పెరిగాయి. చెరువులు సైతం కబ్జాకు గురవుతున్నాయి. నేరాలను నియంత్రించేందుకు ఇలా... ► పోలీసు అధికారులు, సిబ్బంది సంఖ్య పెంచి గస్తీని ముమ్మరం చేయాలి. ► కీలకమైన రైల్వేస్టేషన్, బస్టాండ్లలో నిఘా పెంచాలి. ► పాత నేరస్తులపై దృష్టిసారించాలి. నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. నగరంలోకి వచ్చే రహదారుల్లో నిఘా ఉంచాలి. కమిషనరేట్ అధికారులు పొరుగు జిల్లాల పోలీసు అధికారులతో సమన్వయం కలిగి ఉండాలి. ఏదైనా ఘటన జరిగితే వెంటనే పొరుగుజిల్లా అధికారులను అప్రమత్తం చేయాలి. వాహనాల నంబరు ప్లేట్ల విషయంలోనూ ప్రత్యేక చర్యలుతీసుకోవాలి. ఇంద్రకీలాద్రిపై.. నిత్యం రద్దీగా ఉండే ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి మరింత పెరుగుతుంది. వీఐపీలు, వీవీఐపీలు రోజూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా తగిన జాగ్రత్తలుతీసుకోవాల్సి ఉంది. మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సి ఉంది. ఇలా చేస్తే మేలు.. ► రాజగోపురం నుంచి భక్తులు పైకి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలి. ► భక్తులు, వీఐపీల కోసం ప్రత్యేకంగా కాటేజీలు నిర్మించాలి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్నవాటిని వెంటనే పూర్తిచేయాలి. ► కొండ దిగువన ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలి. ► స్నానఘాట్లలో తగిన ఏర్పాట్లు చేయాలి. ► కొండదిగువన, పైనా భద్రతను కట్టుదిట్టంచేయాలి.