breaking news
tooth decay
-
ఇదు శ్రీలంక: బుద్ధుని దంతాలయం!
శ్రీలంక దీవి హిందూ మహా సముద్రంలో చిన్న భూభాగం. ఇందులో సముద్ర మట్టానికి పదహారు వందల అడుగుల ఎత్తులో ఉంది కాండీ నగరం. ఈ నగరంలో ప్రధానంగా చూడాల్సిన ప్రదేశం బుద్ధుడి దంత అవశిష్టంతో నిర్మించిన ఆలయం. ఈ ఆలయాన్ని టూత్ రిలిక్ టెంపుల్ గా వ్యవహారిస్తారు. ఈ ఆలయం కంటే ముందు ఇక్కడ ఉన్న నేషనల్ మ్యూజియాన్ని తప్పక చూడాలి. రిలిక్ టెంపుల్ చుట్టూ ప్రాచీన రాజకుటుంబాల ప్యాలెస్లున్నాయి. ఆలయంతోపాటు రాజప్రాసాదాలు కూడా ఏటవాలు పై కప్పుతో మనదేశంలో కేరళలోని నిర్మాణాలను తలపిస్తాయి. శ్రీలంకలో తరచూ వర్షాలు కురుస్తుంటాయి, కాబట్టి నీరు సులువుగా జారిపోవడానికి ఒకప్పుడు ఎర్రటి బంగ్లా పెంకు కప్పే వాళ్లు. ఇప్పుడు ఆకుపచ్చ రంగు రేకులు కప్పుతున్నారు. ఇక ఈ నగరంలో మరో విశిష్ఠత ఏమిటంటే... పోర్చుగీసు, బ్రిటిష్ పరిపాలనలో ఉండడంతో కొన్ని ప్రదేశాలు కలోనియల్ కాలనీలను తలపిస్తున్నాయి. యూరప్ నిర్మాణశైలిలో ఉన్న క్వీన్స్ హోటల్ను చూసి తీరాలి. ఇక బ్రిటిష్ వాళ్లు హిల్ స్టేషన్లను ఎంత చక్కగా వేసవి విడుదులుగా మలుచుకున్నారో చెప్పడానికి కాండీ నగరం ఒక నిదర్శనం. నిర్మాణ పరంగా, చారిత్రక ప్రాధాన్యతలెన్ని ఉన్నప్పటికీ ఈ నగరానికి ఇంతటి పర్యాటక ప్రాముఖ్యత ఏర్పడడానికి కారణం బుద్ధుడి అవశిష్టమే. బౌద్ధమే ప్రధానం.. బుద్ధుడి దంతాన్ని ప్రతిష్ఠించి ఆ ఆలయాన్ని నిర్మించారు. ఆ దంత అవశిష్టం మన భారతదేశం నుంచి శ్రీలంక చేరడం కూడా రసవత్తరమైన నాటకీయతను తలపిస్తుంది. బుద్ధుడు మహా పరినిర్వాణం చెందిన తర్వాత ఎముకలు, దంతాలు ఇలా ఒక్కొక్క దేహభాగాలను ఒక్కొక్క ప్రదేశంలో ప్రతిష్ఠించి ఆలయాలను నిర్మించారు. అలా ఈ దంతాన్ని కళింగ రాజులు సొంతం చేసుకున్నారు. ఈ దంతం ఎక్కడ ఉంటే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందనే విశ్వాసం అప్పట్లో ఉండేది. యువరాణి హేమమాలిని, యువరాజు దంత ఈ దంతాన్ని రహస్యంగా లంకాపట్టణానికి తెచ్చారు. హేమమాలిని తల మీద శిఖలో దాచి తెచ్చిందని చెబుతారు. ఆ దంతాన్ని అనూరాధపురను పాలించిన రాజు సిరిమేఘవన్నకు ఇచ్చింది హేమమాలిని. మొదట ఆ దంతాన్ని మేఘగిరి విహార (ఇసురు మునియ) లో భద్రపరిచారు. క్రమంగా రాజుల్లో ఈ దంతాన్ని కలిగి ఉండడం ఆధిక్యతకు చిహ్నంగా భావించారు. శ్రీలంకలో రాజులు ఆ దంతం తమ రాజ్యంలో ఉండడం తమకు గొప్ప అన్నట్లు భావించేవారు. దాంతో ఎవరికి వారు ఆ దంతం తమ రాజ్యంలోనే ఉండాలని ఒకింత పోటీ పడేవారు కూడా. ఆలయ సౌందర్యం! ఆనాటి రాజులు బౌద్ధ స్థూపాలు, ఆలయాల నిర్మాణానికి తమవంతుగా సమృద్ధిగా నిధులు కేటాయించేవారు. కాండీలోని ఆలయనిర్మాణం అత్యంత సుందరంగా, అంతకు మించిన సంపన్నతతో ఉంది. ఆలయం ఆర్కిటెక్చర్ గొప్పతనానికి చేతులెత్తి మొక్కాల్సిందే. ఈ తలుపులను ఒకరు తెరవడం సాధ్యం కాదు. తిరుమల వేంకటేశ్వర ఆలయం మహాద్వారం తలుపుల్లాగ భారీగా ఉంటాయి. ఉలి నైపుణ్యం గోడలు, స్తంభాల్లోనే కాదు తలుపు గడియల్లో కూడా చూడవచ్చు. నెమలి పింఛం ఆకారంలో ఉన్న గడియ కనీసం రెండు కిలోల బరువుంటుంది. సరదాపడి పైకి తీద్దామన్నా ఒక చేతితో కదిలించలేం. మనకు ఆలయాల్లో ప్రవేశద్వారాలే తెలుసు, కానీ ఇక్కడ ప్రవేశ భవనమే ఉంది. తొలి భవనంలో అడుగు పెట్టగానే గర్భగుడి కోసం చూస్తాం. కానీ అదంతా ప్రవేశ మార్గమే. అసలు ఆలయంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి బుద్ధభగవానుడి దర్శనం చేసుకునే వరకు మనల్ని మనం మరిచిపోతాం. ఇప్పటి వరకు మనం చూడని మరోలోకంలో ఉన్న భావన కలుగుతుంది. ఆలయం పై కప్పు జామెట్రికల్ డిజైన్లు కూడా తేలికరంగులతో కంటికి హాయినిస్తూ నిర్మాణకౌశలానికి అద్దం పడుతుంటాయి. ప్రకృతి మనకు కలువలను ఎన్ని షేడ్లలో ఇస్తోందో ఈ ఆలయంలో చూడాల్సిందే. ఆలయ అలంకరణలో తెల్లని పూలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తారు. బౌద్ధావలంబకులు కూడా (భిక్కులు కాదు) బుద్ధుని దర్శనానికి శ్వేత వస్త్రాలు ధరించి వస్తారు. చంటిబిడ్డలకు కూడా తెల్లని వస్త్రాలే వేస్తారు. వర్షం పడినా చలి ఉండదు! కాండీ నగరం మొత్తం కనిపించే వ్యూ పాయింట్స్ ఉంటాయి. అక్కడ ఆగి నగరసౌందర్యాన్ని వీక్షించవచ్చు. ఇక్కడ ఒక సరస్సును, ఒడ్డున ధవళ బుద్ధుడిని మిస్ కాకూడదు. కాండీ నగరంలోని సరస్సు... మనదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముసోరి సరస్సును తలపిస్తుంది. కాండీ రిలిక్ టెంపుల్ నిర్మాణం దక్షిణ భారత ఆలయ నిర్మాణశైలిని తలపిస్తుంది. ఇక్కడ వర్షం సీజన్తో పని లేకుండా రోజూ ఏదో ఒక సమయంలో చిరుజల్లయినా పడుతుంది. అందుకే గొడుగు దగ్గర ఉండడం అవసరం. ఇక్కడ మనకు ఒకింత ఆశ్చర్యకలిగించే విషయం ఏమిటంటే వర్షం కురుస్తుంది, కానీ చలి ఉండదు. వర్షం జల్లు ఆగిన వెంటనే ఉక్కపోత కూడా ఉంటుంది. మొత్తానికి శ్రీలంకలో ఉన్నది ఎండాకాలం, వర్షాకాలం రెండు సీజన్లేనని అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: సీతా ఎలియా) -
Medi Tips: పిప్పి పన్ను తీయించుకున్న తర్వాత అలాగే వదిలేస్తే..
పన్నుపోటు వెన్నుపోటు కంటే ఎక్కువగా బాధిస్తుంది. డాక్టర్ దగ్గరకు వెళ్లి పన్ను తీయించుకునే వరకు మరో ఆలోచన రానివ్వనంతగా వేధిస్తుంది. అయితే పన్ను తీయించుకోవడంతో సమస్య తీరిపోదు, అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఆ ఖాళీని అలాగే వదిలేయకూడదు. తిరిగి కొత్త పన్ను కట్టించుకోవాల్సిందే. పన్ను కట్టించుకోకుండా ఎక్కువ కాలం గడిచిపోయే కొద్దీ పక్కన ఉన్న దంతాలు ఒరిగిపోతాయి, పట్టు తప్పిపోతాయి కూడా. ఒకవేళ తీయించుకున్నది కింద దవడ పన్ను అయితే ఆ స్థానంలో పై దవడకు ఉన్న పన్ను కిందకు జారిపోతుంది. ఆ పన్నుకు ఉండాల్సిన సపోర్టు కోల్పోవడంతో అలా జరుగుతుందన్నమాట. అలాగే మరో విషయం... ఏమిటంటే ఇప్పుడు డాక్టర్లు పిప్పిపన్నును గుర్తించిన వెంటనే తొలగించడం లేదు. దానిని పరిరక్షించే వైద్యవిధానాల మీదనే దృష్టిపెడుతోంది వైద్యరంగం. వీలు కాని దశ వరకు నిర్లక్ష్యం చేసినప్పుడు పన్నును కోల్పోక తప్పదు, ఆ ఖాళీలో కృత్రిమ పన్ను కట్టించుకోక తప్పదు. ‘పన్నుపోటు’ తప్పదన్న మాట. చదవండి: Kidney Stones Health Tips: నీటితో పోయేది రాయి దాకా వస్తే... -
'చక్కెర తగ్గించిన పదార్థాలు లాగించేస్తున్నారు'
స్థూలకాయం, దంతక్షయం వంటి వ్యాధుల బారినుంచి బయటపడటానికి అమెరికా, పశ్చిమ యూరప్, మధ్యాసియా ప్రాంతాల్లోని చిన్నలు, పెద్దలు కలసి సగానికి తగ్గించిన చక్కెర పదార్థాలను లాగించేస్తున్నారంట. అందుకు ప్రధాన కారణం ఒబేసిటీ, దంతక్షయం నుంచి బయటపడాలనే. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సాధారణంగా రోజూ తీసుకునే ఆహారంలో కనీసం పదిశాతానికి తక్కువగా షుగర్ లెవల్ ఉండేలా జాగ్రత్త పడితే బాగుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. అయితే, చాలామంది 15శాతానికి పైనే చక్కెర కలిగిన పదార్థాలను తీసుకుంటున్నారని దీనితో పలు దీర్ఘకాలిక వ్యాధులు (క్రానిక్ డిసీజెస్) వస్తాయని, అదే 5శాతం చక్కెర తీసుకుంటే వారికి క్యాన్సర్, గుండెజబ్బులు వంటివాటిని కూడా దరిచేరనీయకుండా చేయొచ్చని చెబుతోంది. చిరుతిండ్లే అన్ని సమస్యలకు కారణమని పేర్కొంది. అయితే, షుగర్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి సంస్థలు మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన మార్గదర్శకాలలో పసలేనివని, వాటిల్లో ఏమాత్రం నిజం లేదని పెదవి విరిచాయి. క్రానిక్ వ్యాధులకు, షుగర్కు సంబంధం లేదని అంటున్నాయి.