breaking news
Tihar prison
-
వస్తువులం కాదు.. మనుషులమే
న్యూఢిల్లీ : తీహార్ జైలులో ఓ ముస్లిం ఖైదీ వీపు మీద బలవంతంగా ఓం గుర్తును ముద్రించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనపై ఏఐఎంఐఎం అధినేత, అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘మమ్మల్ని అవమానించడానికి రోజుకోక కొత్త మార్గాన్ని కనిపెడుతున్నారు. అతన్ని ఓ పశువులాగా భావించి ఓం గుర్తును ముద్రించారు. ఇది చాలా అసాధరణమేకాక ఎంతో అవమానకరం కూడా. మేము మనుషులమే.. వస్తువులం కాదు. కావాలనే నబ్బీర్ ఒంటి మీద ఈ ప్రత్యేక గుర్తును ముద్రించారు.. తప్ప ఇందుకు వేరే ఇతర బలమైన కారణాలు ఏం లేవు కదా’ అని ట్వీట్ చేశారు. Everyday, a more innovative way is developed to humiliate us To brand someone like cattle is cruel, unusual & dehumanising. We’re not chattel, we’re HUMAN. (Let’s not pretend there’s any other reason why Nabbir was branded with this specific symbol)https://t.co/eFMUvWTJJZ — Asaduddin Owaisi (@asadowaisi) April 19, 2019 ఇంతకు విషయం ఏంటంటే షబ్బీర్ అలియాస్ నబ్బీర్ అనే వ్యక్తి తీహార్ జైలులో ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం నబ్బీర్.. తమ బ్యారక్లోని ఇండక్షన్ స్టవ్ సరిగా పని చేయడం లేదని అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో వారు ‘ఫిర్యాదులు చేస్తున్నావ్.. నాయకుడిగా ఎదగాలని చూస్తున్నావా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక అతన్ని ఓ గదిలోకి తీసుకెళ్లి చితకబాదారు. అంతటితో ఊరుకోక మెటల్ ఓం సింబల్ని తీసుకొచ్చి.. కాల్చి దాన్ని నబ్బీర్ వీపు మీద ముద్రించారు. ఓ రెండు రోజుల పాటు అతనికి భోజనం కూడా పెట్టలేదు. ఈ విషయం గురించి తోటి ఖైదీలకు ‘నబ్బీర్ హిందువుగా మారాడు. ప్రస్తుతం నవరాత్రి దీక్ష చేస్తున్నాడు. దానిలో భాగంగా ఉపవాసం ఉన్నాడని’ తెలిపారు. ఈ క్రమంలో జైలులో తనకు జరిగిన అవమానం గురించి నబ్బీర్ తన కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఈ క్రమంలో ఈ నెల 17న నబ్బీర్ కేసు ఢిల్లీ కోర్టులో విచారణకు వచ్చింది. ఆ సమయంలో నబ్బీర్ తల్లి జైలులో తన కొడుకుకు ప్రాణాపాయం ఉందని బెయిల్ మంజూరు చేయమని కోర్టును కోరింది. దాంతో న్యాయమూర్తి విషయం ఏంటని ప్రశ్నించగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. -
అధికారుల తప్పులు, ఖైదీల తిప్పలు
విశ్లేషణ దురుద్దేశంతో అక్రమంగా ఎవరిని నిర్బంధించినా నేరమే. జైల్లో అధికారులకు దురుద్దేశం ఉందని అనడం కష్టమే. కానీ పొరబాటున, నిర్లక్ష్యం వల్ల, తప్పుడు లెక్కలవల్ల జైల్లో నిర్బంధం హద్దు మీరితే ప్రభుత్వం పరిహారం చెల్లించవలసిందే. ఇచ్చిన చెక్కు చెల్లని నేరానికి ఓం ప్రకాశ్ గాంధీకి ఒక సంవ త్సరం సాధారణ జైలు శిక్ష విధించారు. 23 నవంబర్న అరెస్టు అయిన నాటి నుంచి 24 డిసెంబర్ 2010న బెయిల్పైన విడుదలయ్యే దాకా బందీగా ఉన్నారు. 26 నవంబర్ 2013న కోర్టు విధించిన శిక్ష ప్రకారం 24 అక్టోబర్ 2014న అతను విడుదల కావలసి ఉంది. ఖైదీకి ప్రవర్తన ఆధారంగా కారాగార శిక్షలో తగ్గింపు (రెమిషన్) ఇస్తారు. ఓం ప్రకాశ్కు కూడా రకరకాల రెమిషన్ ఇచ్చారు. వాటి వివరాలకు సంబంధించి అనేక ఆర్టీఐ దరఖాస్తుల ద్వారా తీహార్ జైలు నుంచి సమాచారం సంపాదించారు. ఆయన లెక్క ప్రకారం ఆగస్టు 2వ తేదీన విడుదల కావలిసి ఉండింది. మొత్తం 83 రోజుల రెమిషన్ ప్రకటిస్తే, అందులో జైలు నియమాల ప్రకారం 37 రోజులు, ప్రభుత్వం ఇచ్చిన 30 రోజులు సూపరింటెండెంట్ ఇచ్చిన రెమిషన్ 15 రోజులు డైరెక్టర్ జనరల్ ఇచ్చిన ఒక రోజు రెమిషన్ తనకు రావలసి ఉందని వాదించారు. ఆ లెక్కన తనను ఆగస్టు 2న విడు దల చేయాలన్నారు. కానీ ఆయనను 15 ఆగస్టున విడు దల చేశారు. 14 రోజులపాటు తనను అనవసరంగా బంధించారని అది అక్రమమని గాంధీ వాదించారు. హర్యానా ఫరీదాబాద్ ఒకటో తరగతి న్యాయాధి కారి ముందున్న కేసులో బెరుుల్ ఉందో లేదో తెలుసు కునే దాకా జైల్లోనే ఉంచవలసి వచ్చిందని తీహార్ జైలు అధికారులు ఒక ఆర్టీఐ జవాబిచ్చారు. మరొక కేసులో అరెస్టు వారంటు ఉందో లేదో తెలుసుకోవడం విడుదల తేదీకన్నా ముందే జరగాలని, ఆ వివరాలు తెలియడానికి రెండు మూడు రోజులు పడితే అంతకాలం తనను బంధించడం న్యాయం కాదని వాదించారు. అక్రమ నిర్బంధానికి నష్ట పరిహారం ఇప్పించాలని దరఖాస్తు దారుడు కోరారు. దరఖాస్తుదారుకు లభించిన రెమిషన్ ఇవ్వకుండా నిర్బంధించినట్టు తేలితే దానికి పరిహారం ఏమిటి? ఎవరిస్తారు? బాధ్యులెవరు? విధివిధానాలు ఏమిటి? అని అడిగారు. తమ దగ్గర దీనికి ఏవిధానమూ లేదని, ఒకవేళ ఎవరైనా అక్రమ నిర్బంధానికి గురైనారని అను కుంటే కోర్టుకు వెళ్లి పరిష్కారం కోరాలని, ఆ ఆదేశాల మేరకు తాము వ్యవహరిస్తామని జైలు అధికారులు తెలి పారు. ఒకవేళ లెక్కలో తప్పు వచ్చినా, రెమిషన్ ఇవ్వ వలసిన దానికన్న తక్కువ ఇచ్చినా, నిర్లక్ష్యంతో లెక్కిం చడం వల్ల పొరబాటు జరిగినా లేకపోతే ఎవరైనా కావా లని తప్పుడు లెక్కలు సృష్టించినా, అటువంటి ఫిర్యా దులు వచ్చినపుడు ఎవరు వింటారు? ఏ అధికారికి దర ఖాస్తు పెట్టుకోవాలి? ఆ విధానం గురించి తమంత తామే అధికారులు సమాచార హక్కు చట్టం కింద ఎందుకు ప్రకటించబోరు? అనే ప్రశ్నలు సహజంగానే ఉదయిస్తాయి. న్యాయ విధానాల ద్వారా తప్ప మరొక రకంగా జీవన హక్కును స్వేచ్ఛా జీవనాన్ని హరించడానికి వీల్లే దని ఆర్టికల్ 21 కింద జీవన స్వేచ్ఛా హక్కును మన సంవిధానం ప్రసాదించింది. శతాబ్దాల నుంచి వ్యవస్థా పితమైన ప్రక్రియ పరిధిలోకి సత్ప్రవర్తనకు శిక్షాకాలం తగ్గించడం, గాంధీ జయంతి, స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా శిక్ష తగ్గించడం కూడా వస్తాయి. ఒకవేళ శిక్షా కాలం తగ్గింపు లెక్కల్లో ఏ కారణంగానైనా తప్పు ఉంటే జీవన హక్కు స్వేచ్ఛా హక్కు భంగపడినట్టే. సెక్షన్ 4 కింద ఖైదీల హక్కులకు సంబంధించిన వివరాలు స్వయంగా ఇవ్వవలసిన బాధ్యత జైలు అధికా రులపైన ఉంది. ఈ బాధ్యత నిర్వహించకపోతే ఆర్టీఐ కింద ఎవరైనా అడిగినప్పుడైనా సమాచారం ఇవ్వాలి. ఈ కేసులో ఖైదీ, బాధితుడూ అయిన సమాచార అభ్యర్థికి అడిగే హక్కు ఉంది, అధికారులకు ఇవ్వవలసిన బాధ్యత ఉంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు భంగపడినప్పుడు, దానికి కారకులు ప్రభుత్వ ఉద్యోగులైతే, ప్రభుత్వం పరోక్షంగా బాధ్యత వహించి పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు హైకోర్టులు అనేక సందర్భాలలో పరిహా రాలు చెల్లించాలని ఆదేశించాయి. మొదట్లో రాచకా ర్యాల నిర్వహణలో నష్టాలు జరిగితే జనం భరించా ల్సిందే తప్ప ప్రభుత్వాలకు ఏ బాధ్యతా ఉండదనే సిద్ధాంతానికి కాలం చెల్లింది. ప్రభుత్వ బాధ్యతను నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు ఇచ్చింది. పీనల్ కోడ్ ప్రకారం తప్పుడు నిర్బంధం నేరం అవుతుంది. దురుద్దేశంతో అక్రమంగా ఎవరిని నిర్భంధించినా నేరమే. జైల్లో అధికారులకు దురుద్దేశం ఉందని అనడం కష్టం అవుతుంది. పొరబాటున, నిర్లక్ష్యంవల్ల, తప్పుడు లెక్కలవల్ల జైల్లో నిర్బంధం హద్దు మీరితే ప్రభుత్వం పరిహారం చెల్లించవలసిందే. అధికారులు విచారణకు హాజరు కాకుండా అభ్యర్థిని ఖర్చులపాలు చేసినందుకు వేరుు రూపాయలు, రోజుకు 2,500ల చొప్పున నాలుగు రోజుల అక్రమ నిర్బంధానికిగాను పదివేల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. CIC/SA/A/ 2016/000884, (how&cause notice) కేసులో 27. 9.2016 న సీఐసీ తీర్పు ఆధారంగా. వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ - మాడభూషి శ్రీధర్ ఈమెయిల్: professorsridhar@gmail.com -
తీహార్ జైల్లో ఖైదీ హత్య
న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన తీహార్ జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ, హత్యలు ఆందోళన కలిగిస్తోంది. అండర్ ట్రయల్ ఖైదీని తోటి ఖైదీని హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. హై సెక్యూరిటీ వుండే జైలు నెం.8 లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సెల్లో ఉండగానే దీపక్ (29) పై నలుగురు ఖైదీలు దాడి చేసి దారుణంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. హత్య, దొంగతనం లాంటి కేసుల్లో దోషిగా తేలిన దీపక్ 2008 సం.రం నుంచి తీహార్ జైల్లో అండర్ ట్రయిల్ ఖైదీగా ఉంటున్నాడు కిటికీ ఊచలను మారణాయుధాలు మలుచుకున్న ఖైదీలు పథకం ప్రకారం దాడికి తెగబడినట్టు తెలుస్తోంది. మన్ప్రీత్, జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న సత్పాల్ సహా మరో ఇద్దరికి ఈ కేసులో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల్లో ఒకడైన మన్ప్రీత్ గతంలో ఒక ఖైదీని హత్య చేసినట్టుగా జైలు పీఆర్వో ప్రసాద్ తెలిపారు. వీరు తరచూ జైలు నిబంధనలను అతిక్రమిస్తూ గొడవలకు దిగేవారని చెప్పారు. ఈ నేపథ్యంలో వారిపై అనేక క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఈ సంఘటనపై హరినగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదుచేశాన్నారు -
సుబ్రతా రాయ్ కి జైలు తిండి, నేలపైనే నిద్ర!
న్యూఢిల్లీ: భోగభాగ్యాలు అనుభవించిన సహారా ఇండియా అధినేత సుబ్రతా రాయ్ వారం రోజులపాటు సాధారణ ఖైదీగా తీహార్ జైలులో గడుపనున్నారు. సుబ్రతాకు వారం రోజుల జుడిషియల్ కస్టడీని సుప్రీం కోర్టు విధించి తీహార్ జైలుకు పంపింది. తీహార్ జైలులో సాధారణ ఖైదీగా నేలపైనే పడుకుని.. జైలు అధికారులు ఇచ్చే ఆహారాన్ని సుబ్రతా రుచిచూడనున్నారు. దేశంలోని అతిపెద్ద ఉద్యోగ సంస్థగా పెరున్న సహారా ఇండియా పరివార్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సుబ్రతాకు ఇలాంటి పరిస్థితి రావడంపై పలువరు పలువిధాలు స్పందిస్తున్నారు. ఇతర జైళ్లలో మాదిరిగా ఏ,బీ,సీ కేటగిరిల్లాంటి ప్రత్యేక క్లాస్ లు లేవని, కావున సుబ్రతాను సాధారణ ఖైదీగానే పరిగణిస్తామని తీహార్ జూలు అధికారి సునీల్ గుప్తా పీటిఐకి తెలిపారు. మాకు తీహార్, రోహిణి అనే రెండు కాంప్లెక్సులున్నాయని.. సుబ్రతాను తీహార్ జైలులో ఉంచామని అధికారుల తెలిపారు.