breaking news
Tight fight
-
యూపీ ఎన్నికల్లో ఈసారి ఎవరికి పట్టం?
మరో ఆరునెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్పై అన్ని పార్టీలు దృష్టిపెట్టాయి. రానున్న ఎన్నికల్లో పాలకపక్ష ఎస్పీ.. ఇంకా బీజేపీ, బీఎస్పీ మధ్య త్రిముఖ పోటీ బలంగా ఉంటుందని ఏబీపీ-సీఎస్డీఎస్, హఫింగ్టన్ పోస్ట్- సీ ఓటర్ వేర్వేరుగా నిర్వహించిన రెండు సర్వేల్లో వెల్లడైంది. ఏబీపీ- సీఎస్డీఎస్ సర్వేలో పాలకపక్ష ఎస్పీ కాస్త ముందంజలో ఉండగా, రెండో సర్వేలో బీజేపీ కాస్త ముందంజలో ఉంది. రెండు సర్వేల్లో బహుజన సమాజ్ పార్టీకి మూడో స్థానం, కాంగ్రెస్ పార్టీకి నాలుగో స్థానం లభించాయి. ఈసారి ఎన్నికల్లో ఏబీపీ సర్వే ప్రకారం సమాజ్వాదీ పార్టీకి 30 శాతం ఓట్లు, బీజేపీకి 27 శాతం, బీఎస్పీకి 26 శాతం, కాంగ్రెస్ పార్టీకి ఐదు శాతం ఓట్లు, హఫింగ్టన్పోస్ట్ సర్వే ప్రకారం ఎస్పీకి 27.51 శాతం, బీజేపీకి 27.79 శాతం, బీఎస్పీకి 25.44 శాతం, కాంగ్రెస్ పార్టీకి 6.19 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఇంతవరకు ప్రకటించకపోయినా బీజేపీ ముందుండటం విశేషం. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 12 శాతం ఓట్లకు పరిమితమైన బీజేపీ 2014 లోక్సభ ఎన్నికల్లో 42 శాతం ఓట్లతో 71 లోక్సభ సీట్లను సాధించిన విషయం తెల్సిందే. ఇప్పటికీ రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఖరారు కానందున, దాదాపు 17 కోట్ల జనాభా కలిగిన యూపీలో తాము తీసుకున్న శాంపిల్ పరిణామం తక్కువైనందున తాము ప్రస్తుతానికి ఓట్ల శాతం మాత్రమే అంచనా వేశామని, సీట్ల శాతాన్ని అంచనా వేయలేదని రెండు సర్వేలు తెలియజేశాయి. ఈ సర్వేలను జూలై, ఆగస్టు నెలల్లో నిర్వహించగా, మరో సర్వేను అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహిస్తామని సర్వే సంస్థలు వెల్లడించాయి. ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ పనితీరుతో 61 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఏబీపీ సర్వే వెల్లడించగా, ఎస్పీకే ఓటు వేస్తామని 50 శాతం ముస్లింలు వెల్లడించినట్లు హఫింగ్టన్పోస్ట్ తెలిపింది. -
తెలంగాణలో కాంగ్రెస్.. సీమాంధ్రలో హోరాహోరీ
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేకెతిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ముందంజలో ఉండగా, సీమాంధ్రలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. కొన్ని జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలుతో పాటు ఆంధ్ర ప్రాంతంలో కొన్ని జిల్లాల్లో మంచి ఫలితాలను సాధిస్తోంది. ఆళ్లగడ్డ, ఎర్రగుంట్ల మున్సిపాల్టీలను వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. కడప కార్పొరేషన్లో జయకేతనం ఎగురవేస్తోంది. ఇక ఊహించినట్టు కాంగ్రెస్ నామ మాత్రపు పోటీ ఇచ్చింది. ఒక్క మున్సిపాల్టీని కూడా గెలిచే అవకాశం కన్పించడం లేదు. తెలంగాణలో కరీంనగర్ కార్పొరేషన్ను టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేసులో నిలిచింది.