-
హాట్ కేకులా అమ్ముడు పోయిన పాక్- భారత్ మ్యాచ్ టిక్కెట్లు
దుబాయ్: టీ20 ప్రపంచకప్–2021 లో భాగంగా అక్టోబర్ 24 న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, పాక్ మధ్య తొలి పోరు జరగనుంది. దాయాదుల మధ్య సమరానికి మరోసారి ప్రపంచకప్ వేదిక కానుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ సంభందించిన టిక్కెట్లు ఇటీవల అమ్మకానికి వచ్చాయి. అయితే అంతా ఊహించినట్లుగా టిక్కెట్లు కొన్ని గంటల్లోనే హాట్ కేకులా అమ్ముడుపోయాయి. కాగా కొవిడ్ నేపథ్యంలో ముందుగా ప్రేక్షకులును అనుమతించకుండా మ్యాచ్లు నిర్వహించాలని ఐసీసీ భావించింది. అయితే తన నిర్ణయం మార్చుకున్న ఐసీసీ.. 70% సామర్థ్యంతో టోర్నమెంట్ నిర్హహిస్తున్నట్లు తెలియజేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సామర్థ్యం 25,000.. అంటే టీ 20 వరల్డ్ కప్ సమయంలో వేదికలోని ప్రతి గేమ్లో దాదాపు 18,500 సీట్లు అందుబాటులో ఉంటాయి. కాగా ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే. చివరి సారిగా 2016 టీ20 వరల్డ్ కప్లో భారత్ పాక్తో తలపడింది. ఈ రెండు జట్ల మధ్య చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ 2019 లో మాంచెస్టర్లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచ కప్లో జరిగింది. పొట్టి ప్రపంచకప్లో పాక్తో ఐదుసార్లు తలపడిన భారత్ నాలుగు గెలిచి, ‘టై’గా ముగిసిన మరో మ్యాచ్లో ‘బౌల్ అవుట్’లో నెగ్గింది. చదవండి: వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన కామెంట్స్ -
ఏపీ సీఎం ఆలోచన చరిత్రాత్మకం
‘‘ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ పోర్టల్లో మాత్రమే విక్రయించా లనుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన చరిత్రాత్మకం’’ అని ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’(టీఎఫ్పీసీఏపీ) అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టిక్కెట్ల దోపిడీ గురించి తెలుసుకున్న జగన్గారు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకులకు వినోదం భారం కాదు.. పైగా నిర్మాతలు చిత్ర నిర్మాణ ఖర్చులను తగ్గించుకునేందుకు దోహదపడుతుంది.. బడ్జెట్ అదుపులో ఉంటుంది. జగన్గారి ఆలోచన చిత్రపరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుంది. ముఖ్యంగా కార్మికులకు, చిన్న నిర్మాతలకు మేలు జరుగుతుంది. కానీ కొంత మంది నిర్మాతలు తమ వ్యక్తిగత లాభాలకు గండి పడుతుందని భావించి, ఆ ఆలోచన తప్పు అని ప్రచారం చేస్తున్నారు. త్వరలో జగన్గారిని కలిసి, పరిశ్రమలోని సమస్యలను వివరిస్తాం’’ అన్నారు. చదవండి: Mrunal Thakur: విరాట్ కోహ్లిని పిచ్చిగా ప్రేమించాను: హీరోయిన్ -
అమెరికాకు టిక్కెట్లు బుక్.. అంతలోనే అదృశ్యం
చిక్కడప్లలి: అమెరికాకు వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్న ఓ మహిళ ఆకస్మాత్తుగా అదృశ్యమైన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాష్ అనే వ్యక్తి తన భార్య అమృత(29), ఇద్దరు పిల్లలతో గత ఆరేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. గత నవంబర్ 8న వారు సెలవుల నిమిత్తం నగరానికి వచ్చారు. ఈ ఏడాది జనవరి 1న ప్రకాష్ అమెరికా వెళ్లిపోగా, అమృత ఈ నెల 25న అమెరికా వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేసుకుంది. ఈ నెల 23న బయటికి వెళ్లిన ఆమె తిరిగిరాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టినా ప్రయోజనం కనిపించలేదు. అమృత తల్లి గంగ ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టేస్ట్...
మెట్రో కథలు ఇంతకుముందు ఇది తెలియదు. రెండు టికెట్లు బుక్ చేసి తెచ్చేవాడు. థియేటర్లో ముందు నడుస్తూ తీసుకెళ్లేవాడు. సీట్లను వెతికాక నంబర్లు ఏవైనా సరే మొదట కూచుని కుడివైపు కూచోపెట్టుకునేవాడు. కుడిచేతిని హ్యాండ్రెస్ట్ మీద పెట్టుకుని మీసాలు గిల్లుకుంటూ సినిమా చూట్టం ఇష్టమట. ఎడమ చేతి మీద బరువు పెట్టి సినిమా చూడటం తనకూ ఇష్టమేనే. అడగడానికి లేదు. అందుకే పుర్రచేతి వాటం వాళ్లను చేసుకోవద్దంటారు అని పెద్దగా నవ్వుతాడు. ఇదేమైనా జోకా? అలవాటు లేని ప్యాంట్ను పైకి సర్దుకుంది. అలవాటు లేని చొక్కాను కిందకు లాక్కుంది. మచ్చల చొక్కా. బాగుంది. కాని కొంచెం పొట్టిది. ఉన్న డబ్బులకు అదే వచ్చింది. వెనుక వైపు ఎవరైనా మిర్రిమిర్రి చూస్తున్నారా? చూస్తే చూడనీ. టైమ్ చూసుకుంది. ఒకటిన్నర. గురువారం దిగుల్లేదు. రెండున్నరా మూడు వరకూ కూడా మంచి భోజనం దొరుకుతుంది. అమీర్పేట్ నుంచి కూకట్పల్లి ఎంత దూరమని? బస్సెక్కింది. ఫుల్లుగానే ఉంది. అయినా ఇబ్బంది లేనట్టే. ఈ మధ్య ఆడవాళ్ల సీట్లకూ మగవాళ్ల సీట్లకూ మధ్య గేట్లు పెట్టారు. లేకుంటే తమ దేహంలో ఈ ప్రాంతం ఒకటుంది అని తెలియని చోట కూడా చేతులు వేసేస్తారు. కూచుంటే మరీ ఘోరం. ముఖానికి ఎదురుగా నిలుచోవడమే. లేదా భుజాన రెస్ట్ చేస్తారు. ఇక చావండి. బాబా గుడి వచ్చింది. అర్చకుడు గత వారమే పరిచయం అయ్యాడు. ప్రతివారం వస్తాను స్వామీ అంటే అయ్యో అదేం భాగ్యం తల్లీ... తప్పకుండా రా అన్నాడు. కూటికి గతి లేనట్టుగా సాగే అన్నదానం కాదు అది. అందరూ కలిసి భక్తిగా చేసే భోజనం. ఇవాళ వంకాయ చేశారు. పప్పు ఉంది. సాంబారు సరే. అదనంగా గులాబ్ జామూన్ కూడా ఉంది. కప్పులో రెండు మూడు జామూన్లు వేసుకొని పాకం ఒంపుకుని గుచ్చి గుచ్చి తినడం టైమ్ వేస్టు అనుకుని ఒకటి అమాంతం బుగ్గలో పెట్టుకుంటూ ఉంటే మొబైల్ మోగింది. ఇంకెవరు? మొగుడే. ఎక్కడా? గు...గ...వ...మ... ఏదో మెక్కుతున్నట్టున్నావ్. అ...గు...బ...గు... పెట్టేశాడు. పెళ్లయిన కొత్తలో మూడు నెలలపాటు ఢిల్లీకి తీసుకెళ్లలేదు. ఇక్కడ కష్టం గుంటూర్లో అమ్మావాళ్ల దగ్గరే ఉండు వచ్చిపోతుంటాను అన్నాడు. వచ్చి పోయేటట్టయితే మీ అమ్మవాళ్ల దగ్గర ఎందుకు మా అమ్మవాళ్ల దగ్గరే ఉంటాను అంది. దెబ్బకు దారికొచ్చాడు. కాపురానికి తీసుకెళ్లాక కూడా మొదటి వారంరోజులు చేతిముద్ద తింటేనా? అమ్మ ఇచ్చిన పొడులు, అమ్మ ఇచ్చిన పచ్చళ్లు, అమ్మ నేర్పించిన చారు... ముక్కల పులుసు.. . అదేంటి? కొన్నాళ్లు ఆగు. అలవాటు పడాలి గదా. పైగా నీది పుర్రచేతి వాటం. నాకు కక్కొస్తుంది. ఒరే గాడిదా. మొదటిరోజు రాత్రి పుర్రచేతివాటం అని దూరం పెట్టావట్రా... మనసులో అనుకుంది. ఆ తర్వాత మొదలు. ఏది చేసినా పేర్లు. అది నచ్చలేదు. ఇది నచ్చలేదు. ఈ కూర నీ నెత్తిన గుమ్మరించుకో. మా అమ్మై ఇలా చేసేదా. అసలు మా ఇంట్లో అయితే... వినీ వినీ తిండి మీదే వికారం వచ్చేసింది. కాని దేనికదే దారి. వేవిళ్లతో వచ్చే వికారం కూడా వచ్చింది. పాప పుట్టింది. అది చండీరాణి. మూడేళ్లకే ఆటలు మాటలు పాటలతో అల్లరి అల్లరి చేసేస్తుంటే దానికి ఇంకా ఏవేవో నేర్పించుకుందామనుకుంటే నేర్పించనిస్తేనా? మీ అమ్మకేం తెలుసే... చిమిడి పోకుండా అన్నం వండటం కూడా రాదు. నేను నేర్పిస్తా రా... అని ప్రతి దానికీ తీసిపడేయడమే. దానికేం గౌరవం ఉంటుంది? ఐదేళ్లు వచ్చేసరికి హైదరాబాద్కు కాపురం మారాక అసలు ఇక్కడ కూడా కాదు... గుంటూరు పంపించేద్దాం... మా అమ్మ అన్నీ నేర్పించుకుంటుంది... మా నాన్న రిటైర్డ్ హెడ్మాస్టర్... పులిలా దారిలో పెడతాడు... వాళ్లకు మాత్రం ఎవరున్నారు... ఇదే కదా కాలక్షేపం అన్నాడు. హ్యాండ్రెస్ట్నే అడగలేదు. కూతుర్ని మాత్రం ఏం అడుగుతుంది? మూడేళ్లు గడిచిపోయాయి. ఏం చేయడానికి లేదు. ఇంకొకరు వద్దట. సాకలేడట. పోనీ ఏదైనా సరదా ఉందా? ఊళ్లో ఉన్నా కదలనివ్వడు. క్యాంపులకెళ్లినా కదలనివ్వడు. ఇంట్లో ఉండాలి. ఇంట్లోనే ఉండాలి. ఆ కాసింత హాల్లో... ఆ కాసింత బెడ్రూమ్లో... మరీ ముఖ్యంగా ఆ కాసింత వంటగదిలో. రోజూ ఏదో ఒక టైమ్లో ఫోన్ చేస్తాడు. ఒకటే ఒక ప్రశ్న - ఏం వండుతున్నావ్?చెప్తుంది. అది తప్ప ఇంకా ఏవో నాలుగు చెప్తాడు. ఆ రోజు గుర్తుంది. పిరియడ్స్ మొదలయ్యేలా ఉన్నాయి. కడుపులో నొప్పిగా ఉంటే పడుకుని ఉంది. చేశాడు. అదే ప్రశ్న-ఏం వండుతున్నావ్? నీ పిండాకూడు. ఆ సాయంత్రమే ఇంట్లో నుంచి బయటికొచ్చేసింది. ఎలా బతుకుతావే? ఎలాగోలా.ఎక్కడ ఉంటావ్? ఎక్కడో ఒకచోట. గ్యాస్ కూడా నా పేరుమీదే ఉంది. మర్చిపోకు. ఏం వండుకుని తింటావ్? అసలు నేను వంటే చేయను. సంస్కృతం తెలియడం అచ్చొచ్చింది. ఏదో ఒక టైమ్లో రెండు క్లాసులు చెప్పు. నెలకు ఎనిమిది దాకా ఇస్తాను అంది తెలిసినావిడ జూనియర్ కాలేజీలో.ఎనిమిది అంటే పర్లేదు. హాస్టల్లో చేరకపోతే మేనేజ్ చేయొచ్చు. పిల్లలు ఎదిగొచ్చి అమెరికా వెళ్లి సంపాదన పంపితే సుఖంగా స్థిరపడి మనిషి కోసం ముఖం వాచిపోయిన కొంపలు చాలానే ఉన్నాయి. అలాంటి ఒకదానిలో రెండు మూడు వేలకే మంచి గది దొరికింది. ఇంకా ఐదుంటాయి. ఏం ఖర్చు ఉంటుంది? దేవుడే కదా దారి చూపింది. ఒకరోజు మనసు బాగోక దగ్గరలో ఉన్న టెంపుల్ కాంప్లెక్స్కు వెళితే శనగలు, వడ, పెసర హల్వా పెట్టారు. కడుపు నిండిపోయింది. పూజారిని అడిగితే ఓ... ఇలాంటివి చాలా ఉన్నాయ్ అన్నాడు. కొంచెం ఆచూకీ తీస్తే అవును చాలానే ఉన్నాయి. బాబోయ్. ఇన్నా. ఇక అక్కణ్నించి గుళ్లు, గోపురాలు, మఠాలు, ఆశ్రమాలు... సరుకులు తెచ్చుకునే టైము, కూరగాయలు తెచ్చుకునే టైము, సర్దుకునే టైము, పొయ్యి దగ్గర నిలబడి వండుకునే టైము, అంట్లు తోముకునే టైము... అన్నీ లెక్క వేసి ఆ టైమ్లో ఒక మెట్రో పాస్ కొనుక్కుని బస్లో కూలబడితే సరిపోతుంది కదా అనిపించింది. ఒక గుడిలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్... ఒక ఆలయంలో భోజనం... రాత్రికి మరో సన్నిధిలో అల్పాహారం.సిటీ మనిషిని వదిలేసి దేవుణ్ని పట్టుకుంది. తను వంటను వదిలేసి ప్రసాదాన్ని పట్టుకుంది. మూడు గులాబ్జాములు చాల్లేదు. నాలుగోది వేసుకొని మళ్లీ అమాంతం బుగ్గన పెట్టుకుంటుంటే ఫోన్. ఇంటికి ఎప్పుడొస్తావ్? గు...గ...క...ఖ... ఇంకేమీ అనను. ఖొ..వో...గ..గో... రావా? వూ.. వే.. ఓ... ఓ.. పెట్టేశాడు. చేతులు కడుక్కుంది. - మహమ్మద్ ఖదీర్బాబు
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఏపీలో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈవో
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
డాక్టర్ కాళ్లు పట్టుకున్నా.. అర్ధరాత్రి రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లా..
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఆలస్యం చేయొద్దు.. కదలండి ఓటేయండి.. (ఫొటోలు)
ఓటు వేసిన వైఎస్సార్సీపీ నేతలు (ఫొటోలు)
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హేమంత్ సోరేన్కు కేజ్రీవాల్ తరహా ఊరట: సుప్రీంను కోరిన కపిల్సిబల్
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement