-
వేల ఎకరాలు ఎందుకు?
విమానాశ్రయం అంటే వేల ఎకరాలు కావాలనే వాదనలో వాస్తవం లేదని తిరువనంతపురం ఎయిర్పోర్టు నిరూపిస్తోంది. అధిక ఎయిర్ ట్రాఫిక్ ఉన్న తిరువనంతపురం విమానాశ్రయాన్ని 628 ఎకరాల్లో నిర్మించారు. దేశంలోనే అత్యంత ఎక్కువ ఎయిర్ ట్రాఫిక్ ఉన్న ముంబై విమానాశ్రయాన్ని 1850 ఎకరాల్లోనే నిర్మించారు. కానీ.. భోగాపురం విమానాశ్రయానికి 15 వేల ఎకరాలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. దేశంలో ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల భూమి వివరాలు ఇలా.. విమానాశ్రయం భూమి విస్తీర్ణం (ఎకరాల్లో) తిరువనంతపురం 628 అహ్మదాబాద్ 1124 చెన్నై 1283 ముంబై 1850 -
‘పుష్కర’ను పూర్తి కా‘నీరు’!
నిలిచిన పుష్కర ఎత్తిపోతల పథకం భూ సేకరణ వివాదంతో నిలిచిన నిర్మాణం పనుల రద్దుకు అధికారుల ప్రతిపాదనలు సాగునీటికి నోచని ఎనిమిది వేల ఎకరాలు గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతాయి. బీడు భూములు సస్యశ్యామలమవుతాయి. బతుకులు బంగారుబాటలో నడుస్తాయి... ఏడేళ్లుగా అన్నదాతలు కన్న కలలివి. పుష్కర ఎత్తిపోతల పథకంపై పెట్టుకున్న ఆశలివి. భూ సేకరణపై అభ్యంతరం తెలుపుతూ తూర్పు గోదావరి జిల్లా తుని రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పనులకు గ్రహణం పట్టింది. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు భూ సేకరణ సమస్యనే సాకుగా చూపుతున్నారు. పనుల రద్దుకు ప్రతిపాదనలు పంపారు. రైతుల ఆశల్ని అడియాశలు చేశారు. పాయకరావుపేట, న్యూస్లైన్ : పుష్కర ఎత్తిపోత లపథకం ద్వారా గోదావరి జలాలు మెట్ట ప్రాంతాల్లో పరవళ్లు తొక్కుతాయని ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న రైతులకు నిరాశ మిగిలే పరిస్థితులు తలెత్తాయి. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుని, పాయకరావుపేట మండలాల్లోని 8 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే పనులకు పచ్చజెండా ఊపారు. పుష్కర ప్రధాన కాలువ తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట నుంచి పిల్ల కాలువల ద్వారా తుని మండలంలోని కొన్ని గ్రామాలతో పాటు, పాయకరావుపేట మండలం పాల్తేరు, కందిపూ డి, ఈదటం ముఠా ఆనకట్ట చానల్ ద్వారా పెదరామభద్రపురం, శ్రీరాంపురం, కుమారపురం, రాజవరం, కేశవరం గ్రామాల్లోని సుమారు 12 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాలువ నిర్మాణం ప్రారంభించారు. పిల్ల కాలువలు, వాటిపై నిర్మాణాల కోసం రూ.2.92 కోట్లతో పనులు చేట్టారు. తుని మండలం వల్లూరు వద్ద ఎలైన్మెంట్ పనులు మార్చాలని, ఎస్.అన్నవరం వద్ద కాలువకు భూసేకరణ ఆపాలని రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో తుని పాయకరావుపేట నియోజక వర్గాల్లో 8 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే పనులు ఆగిపోయాయి. భూ సేకరణ సాకు భూసేకరణ విషయంలో రైతుల నుంచి ఎదురవుతున్న సమస్యలను నీటిపారుదల శాఖాధికారులు సాకుగా చూపుతున్నారు. తుని మండలంలో 1496 ఎకరాల ఆయకట్టు, పాయకరావుపేట మండలంలో ముఠా చానల్ ద్వారా సాగు నీరందించే పెదరామభద్రపురం, శ్రీరాంపురం, కుమారపురం, రాజవరం, కేశవరం గ్రామాల్లో 6694 ఎకరాల ఆయకట్టు పనుల రద్దుకు ప్రతిపాదనలను పుష్కర అధికారులు ప్రతిపాదనలు పంపారు. పాల్తేరు ప్రాంతంలో 497 ఎకరాలు, ఈదటం ప్రాంతంలో 1699 ఎకరాలు, కందిపూడి ప్రాంతంలో 821 ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో పాల్తేరు, ఈదటం, కందిపూడి ప్రాంతాల్లో ఏడాదిన్నర క్రితం కాలువ పనులను నిలిపివేశారు. కొన్నేళ్లుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్న తమ కలలు ఫలిస్తాయో లేదోన్న ఆతృత రైతుల్లో నెలకొంది. పుష్కర అధికారులు స్పందించి భూసేకరణ సమస్యను పరిష్కరించి ఈ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న కాలువ పనులను పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
పెట్స్తో శ్రీవల్లి ఫోటోలు.. విజయ్ దేవరకొండ అంటూ నెటిజన్స్ కామెంట్స్!
టీ20 వరల్డ్కప్-2024కు పాకిస్తాన్ జట్టు ప్రకటన..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అలర్ట్: రేపు ఆన్లైన్ సేవలన్నీ బంద్!
పుణె పోర్షే కారు ప్రమాదం.. ఇద్దరు పోలీసుల సస్పెన్షన్
భారత్లో మరో బెంజ్ కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (24-05-2024)
సాగని సంసారం.. రొమ్ము క్యాన్సర్తో పోరాటం.. తెలుగులో ఒకే ఒక్క మూవీ (ఫోటోలు)
టాలీవుడ్ డైరెక్టర్ భారీ యాక్షన్ థ్రిల్లర్.. 27 ఏళ్ల తర్వాత స్క్రీన్పై స్టార్ జోడీ..!
బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హత్య చేసిన భర్త
ఈ సీఈవో జీతం 12 రూపాయలే.. నమ్మబుద్ధి కావడం లేదా?
తప్పక చదవండి
- బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హత్య చేసిన భర్త
- ఇషా అంబానీకి జియో బంపర్ డీల్! సక్సెస్ అయితే..
- భారత టాలెంట్ సరిహద్దులు దాటుతోంది: రాజమౌళి
- సీఎం నిర్ణయాలే ఫైనల్.. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్?
- టీ20 వరల్డ్కప్-2024 అంబాసిడర్గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
- 'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!
- స్వాతి మలివాల్పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
- మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
- వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
- చారిత్రక విజయానికి ఐదేళ్లు...
Advertisement