-
పారగాన్ ఎక్స్క్లూజివ్ స్టోర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాదరక్షల తయారీ సంస్థ పారగాన్ ఎక్స్క్లూజివ్ ఔట్లెట్లను ఏర్పాటు చేస్తోంది. 2016 నాటికి దేశవ్యాప్తంగా 250 స్టోర్లను ఏర్పాటు చేయనుంది. ఏడాదిన్నర తర్వాత ఫ్రాంచైజీ విధానంలోనూ దుకాణాలను తెరుస్తామని పారగాన్ గ్రూప్ ప్రమోటర్, డెరైక్టర్ థామస్ మణి తెలిపారు. సినీ హీరో మహేష్బాబును పారగాన్ జాతీయ బ్రాండ్ అంబాసిడర్గా (ప్రచారకర్త) మంగళవారమిక్కడ ప్రకటించిన అనంతరం ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. కస్టమర్ల నుంచి వస్తున్న విజ్ఞప్తి మేరకే ప్రత్యేక షోరూంలను ప్రారంభిస్త్తున్నామని చెప్పారు. 2020 నాటికి రూ.5,000 కోట్ల టర్నోవర్కు చేరుకోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. మహేష్బాబుకు అన్ని ప్రాంతాల్లో అభిమానులు ఉన్నారని, అందుకే ఆయనను ప్రచారకర్తగా నియమించామని చెప్పారు. ఎంతైనా వెచ్చిస్తారు..: పిల్లల నాణ్యమైన పాదరక్షల కోసం తల్లిదండ్రులు ఎంతైనా వెచ్చిస్తున్నారని థామస్ మణి చెప్పారు. ‘పిల్లల పాదరక్షల మార్కెట్ పరిమాణం దేశంలో సుమారు రూ.7 వేల కోట్లు. పిల్లల కోసం 30 రకాల డిజైన్లను పరిచయం చేశాం. 6 నెలల్లో మరో 20 డిజైన్లు రానున్నాయి. ఈ విభాగంపై ప్రత్యేక ద ృష్టి పెడతాం’ అని అన్నారు. బ్రాండెడ్ పాదరక్షల వైపు కస్టమర్లు మళ్లుతున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉందన్నారు. రూ.25 వేల కోట్ల పాదరక్షల విపణిలో వ్యవస్థీకృత రంగం వాటా 20% లోపే. ధర విషయానికి వస్తే 90% అమ్మకాలు రూ.500లోపు లభించే వేరియంట్లవే. రూ.1,600 కోట్లు..: పారగాన్కు దేశంలో 19 ప్లాంట్లు, 250 స్టిచ్చింగ్ యూనిట్లున్నాయి. మహారాష్ట్రలో రూ.100 కోట్లతో రోజుకు 25 వేల జతల పాదరక్షలు తయారీ సామర్థ్యం గల ప్లాంటు పెట్టే ఆలోచనలో కంపెనీ ఉంది. అమ్మకాల్లో ఏటా 25% వృద్ధి నమోదు చేస్తున్నట్టు పారగాన్ మార్కెటింగ్ డెరైక్టర్ జోసెఫ్ జకారియా తెలిపారు. ‘2013-14లో 12 కోట్ల జతలు విక్రయించాం. రూ.1,400 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ ఏడాది 14 కోట్ల జతలతో రూ.1,600 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నాం’ అని తెలిపారు. -
బ్రాండెడ్ చెప్పులకు క్రేజ్...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చెప్పులు అనగానే పాదరక్షలు అన్న భావన ఇప్పుడు తొలగిపోయింది. ప్రత్యేకతను చూపించుకోవడానికి ఒక సాధనంగానూ మారిపోయాయి. పురుషులు సాధారణంగా ఆఫీసుకు ఒకటి, రోజూ వేసుకోవడానికి ఒకటి ఇలా ఏటా రెండు జతలు కొంటే.. యువతులైతే ఏకంగా నాలుగు జతలకు తక్కువ కాకుండా మెయింటెయిన్ చేస్తున్నారట. ఇంట్లో, ఆఫీసుకు, వాకింగ్కు, షాపింగ్కు, శుభకార్యానికి ప్రత్యేకంగా చెప్పులను కొంటున్నారు. కస్టమర్లు పాదరక్షల విషయంలో నాణ్యతకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇందుకోసం బ్రాండెడ్ వైపు మళ్లుతున్నారని ప్రముఖ కంపెనీ ప్యారగాన్ అంటోంది. బ్రాండెడ్ ధరలు తగ్గడం కూడా మరో కారణమని చెబుతోంది. రంగులమయం.. చెప్పుల అడుగు భాగంలో నలుపు రంగును మాత్రమే కస్టమర్లు ఆదరిస్తున్నారు. పై భాగంలో ఫ్యాన్సీ రంగులున్న వాటిని మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పురుషులైతే నలుపుతోపాటు సంప్రదాయ రంగులు కోరుతున్నారు. మహారాష్ట్రలో నలుపు రంగు సాండల్స్ అధికంగా అమ్ముడవుతున్నాయి. ఇక సైజు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో 10, 11 నంబరు చెప్పులకు ఎక్కువ డిమాండ్. దీనికి కారణం ఇక్కడివారి పాదం పెద్దగా ఉండడమే. పశ్చిమ బెంగాల్లో 8వ నంబరు అమ్మకాలే అధికం. 9, 10 నంబరు అతి స్వల్పం. మొత్తంగా సగటు వినియోగం భారత్లో 2.1 జతలు. పశ్చిమ దేశాల్లో 11 జతలుంది. ధరలు తగ్గాయి కాబట్టే.. పాదరక్షల అమ్మకాల్లో 60 శాతం వాటా రూ.250 లోపుండే వెరైటీలదే. బ్రాండెడ్ కంపెనీలు కూడా ఈ ధరలో వివిధ వెరైటీలను ఆఫర్ చేస్తున్నాయి. మూడు నాలుగేళ్ల క్రితం బ్రాండెడ్ చెప్పుల ఖరీదు దాదాపు రూ.350 నుంచి ఉండేది. ఇప్పుడు రూ.129 నుంచి లభిస్తున్నాయని ప్యారగాన్ పాలిమర్ ప్రొడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ థామస్ మణి తెలిపారు. బ్రాండెడ్ కంపెనీలు ధరలు తగ్గించడంతో అవ్యవస్థీకృత రంగ కంపెనీల ఉత్పత్తులకు ఆదరణ తగ్గుతోందని పేర్కొన్నారు. కస్టమర్లు సైతం మన్నికకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టైల్, సౌకర్యం, అందుబాటు ధర ఈ మూడు అంశాలు కీలకమయ్యాయని వివరించారు. చైనాలో కార్మికులకయ్యే వ్యయం అధికమవుతుండడంతో ఆ దేశం నుంచి చవక పాదరక్షల దిగుమతి తగ్గుతోందని వెల్లడించారు. రూ.27,000 కోట్ల మార్కెట్.. చెప్పులు, సాండల్స్, స్పోర్ట్స్, ఫార్మల్, లెదర్ షూస్ అన్నీ కలిపి వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగంలో దేశంలో పాదరక్షల పరిశ్రమ రూ.27 వేల కోట్లుంటుందని అంచనా. వ్యవస్థీకృత రంగంలో సాండల్స్, చెప్పుల పరిశ్రమ 20 శాతం వృద్ధి రేటుతో రూ.6-7 వేల కోట్లుంది. పాలీ యురెథేన్తో(పీయూ) తయారైన పాదరక్షలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. తడి ఉన్నప్పటికీ జారకుండా ఉండడం వీటి ప్రత్యేకత. 2013-14లో 3.2 కోట్ల జతల పీయూ చెప్పులను ప్యారగాన్ విక్రయించింది. ఇక పిల్లల పాదరక్షల మార్కెట్ రూ.2,500 కోట్లుండొచ్చని సమాచారం. పెద్దల కంటే పిల్లల పాదరక్షలే ఖరీదెక్కువ. సమంత.. బ్రాండ్ అంబాసిడర్ పాదరక్షల తయారీలో ఉన్న ప్యారగాన్ సినీ తార సమంతను ప్రచార కర్తగా నియమించింది. మహిళలకు రోజువారీ వినియోగం కోసం రూపొందించిన సోలియా శ్రేణి చెప్పులకు మూడేళ్లపాటు ఆమె ప్రచారం చేస్తారు. 100 డిజైన్లు ఆఫర్ చేస్తున్నామని, వీటి ధరలు రూ.129-199 మధ్య ఉన్నాయని కంపెనీ తెలిపింది. 2013-14లో కంపెనీ రూ.1,375 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. 12.92 కోట్ల జతల చెప్పులను విక్రయించింది. ఇందులో 35% వాటా మహిళల పాదరక్షలదేనని మార్కెటింగ్ ఈడీ నవీన్ థామస్ శుక్రవారమిక్కడ తెలిపారు. ఫార్మల్, లెదర్ షూస్ విభాగంలోకి రెండేళ్లలో ప్రవేశిస్తామని చెప్పారు. ఎక్స్క్లూజివ్ ఔట్లెట్లు, ఈ-కామర్స్ భవిష్యత్ ప్రణాళికలని వెల్లడించారు. కంపెనీ నెలకు 35 కొత్త డిజైన్లను ప్రవేశపెడుతోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కంపెనీకి 45 శాతం మార్కెట్ వాటా ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement