-
Hyderabad: గర్భిణి మెడపై కత్తి పెట్టి రూ.10 లక్షలు చోరీ..
బంజారాహిల్స్: గర్భిణి మెడపై కత్తి పెట్టి రూ.10 లక్షలు చోరీ చేసిన ఘటనలో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 58లో నివసించే ప్రముఖ వ్యాపారి ఎన్.ఎస్.ఎన్.రాజు ఇంట్లోకి ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున ఓ యువకుడు ప్రవేశించి ఆయన కూతురు నవ్య బెడ్రూంలోకి వెళ్లి ఆమె మెడపై కత్తి పెట్టి రూ. 25 లక్షలు డిమాండ్ చేశాడు. గదిలోకి వచి్చన ఆమె తల్లి లీలను కూడా బెదిరించాడు. తన భర్తకు ఫోన్ చేసిన బాధితురాలు రూ. 8 లక్షలు తెప్పించి ఇంట్లో ఉన్న రూ. 2 లక్షలు కలిపి మొత్తం రూ. 10 లక్షలు నిందితుడికి ఇవ్వడంతో పాటు తన సెల్ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేయడంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. కేవలం సెల్ఫోన్ ఆధారాలు మాత్రమే ఉండగా నిందితుడి కోసం పోలీసులు సాంకేతికతను వినియోగించారు. అదే రోజు మధ్యాహ్నం షాద్నగర్కు వెళ్లిన నిందితుడు తన కదలకలను పోలీసులు గుర్తుపట్టకుండా ఉండేందుకు నాలుగైదు గంటలు అక్కడే గడిపి తిరిగి క్యాబ్ బుక్ చేసుకొని సికింద్రాబాద్లోని రెజిమెంటల్ బజార్లో ఉన్న తన ఇంటికి వచ్చాడు. ఆ తెల్లవారే దొంగిలించిన డబ్బులో నుంచి రూ. 2.50 లక్షలు వెచి్చంచి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుగోలు చేశాడు. జల్సాలకు అలవాటుపడ్డ నిందితుడు శుక్రవారం ఉదయం శామీర్పేట్లోని ఓ ఫామ్ హౌజ్లో స్నేహితులకు విందు ఇస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నిందితుడు రెజిమెంటల్ బజార్లో నివసించే మోతిరాం రాజేష్ యాదవ్ (27)గా తేలింది. తన ఇంట్లో అప్పులతో పాటు తన జల్సాలకు డబ్బుల కోసమే ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో ఒప్పుకొన్నట్లు సమాచారం. నిందితుడి నుంచి మరింత సమాచారాన్ని రాబడుతున్నారు. చోరీ చేసిన సొత్తును రికవరీ చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. నిందితుడు జూబ్లీహిల్స్లోని ఏదైనా ఓ ఇంట్లోకి దూరి రూ. 25 లక్షలు ఎత్తుకెళ్లాలనే పథకంతో రోడ్ నెం 52లో తిరుగుతుండగా ప్రతి ఇంటి ప్రహరీ గోడ ఎత్తుగా ఉండటంతో లోపలికి దూకడం కష్టతరమైంది. ఒక్క ఎన్ఎస్ఎన్ రాజు నివాస ప్రహరీ మాత్రమే చిన్నగా ఉండటంతో ఆ ఇంటిని ఎంపిక చేసుకొని పక్కా ప్రణాళికతో ఇంట్లోకి దూరినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. -
వీడియో: కదిలే రైలులో ఫోన్ చోరీయత్నం.. చేతులు, టీ షర్ట్ పట్టుకుని..
దొంగతనం.. ఎక్కడ చేసినా నేరమే. కొందరు తామే తోపులమంటూ చేతివాటం చూపిస్తుంటారు. క్షణాల్లో విలువైన వస్తువులు మాయం చేస్తుంటారు. ఇక బస్సులు, రైళ్లు వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లో దొంగలు చాకచక్యంగా దొంగతనాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఎంత తెలివిగా తప్పించుకున్నా కొన్నిసార్లు దొంగ దొరికిపోతుంటాడు. తాజాగా ఓ దొంగ రైల్వే స్టేషన్ నుంచి కదులుతున్న రైలులో మొబైల్ ఫోన్ చోరీకి ప్రయత్నించి చివరికి ఊహించని విధంగా విఫలమయ్యాడు. దీంతో, రైలు ప్రయాణీలకులు దొంగకు చుక్కలు చూపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది. ఇటీవల బీహార్లోనే బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలులో ఓ దొంగ సెల్ఫోన్ దొంగలించచోయి ప్రయాణీకులకు చిక్కడంతో అతడికి చుక్కలు చూపించారు. తాజాగా మరో దొంగ సైతం ఇలాంటి దొంగతనానికే పాల్పడ్డాడు. ఈ వీడియోలో జమాల్పూర్-సాహిబ్గంజ్ ప్యాసింజర్ రైలు ఘోఘా స్టేషన్లో ఉండగా.. ఓ దొంగ రైలు కిటీకిలో నుంచి విండో సీట్లో ఉన్న ప్రయాణికుడి ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికుడు.. దొంగ చేతులను, టీ షర్టును కిటికీలోంచే గట్టిగా పట్టుకున్నాడు. రైలు కదలడం ప్రారంభమవ్వడంతో విడిచిపెట్టాలని ఎంత వేడుకున్నా ప్రయాణికులు మాత్రం చేతులు వదలలేదు. ఇలా రైలు కొంత దూరం ప్రయాణించాక.. దొంగను రైలులోపలికి లాగారు. అనంతరం అతడిని చితకబాదారు. తర్వాత, రైల్వే పోలీసులకు అప్పగించినట్టు సమాచారం. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
వీడియో: గన్ పేలుతుందనగా మెరుపులా దూసుకొచ్చి..
తల్లాహస్సీ: పక్కడో ఏమైనా పర్వాలేదు.. మనం బాగుంటే చాలనుకునే సమాజం ఇది. అయితే అడపా దడపా జరిగే ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మానవత్వం.. సాయ గుణం మనిషిలో ఇంకా మిగిలే ఉందని అనిపిస్తుంటుంది. తన ప్రాణాలను అడ్డుపెట్టి.. తల్లీకూతుళ్లను ఓ దొంగ నుంచి కాపాడాడు ఇక్కడ ఓ హీరో. ఫ్లోరిడా ఫోర్ట్ వాల్టన్ బీచ్లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కారు దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి.. ఆ ఓనర్ను తుపాకీ చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆమె తన చంటిబిడ్డను ఎత్తుకుని ఉంది. భయంతో కేకలు వేసింది. ఇక ఆమెను షూట్ చేయబోతున్నాడగా.. మెరుపు వేగంతో దూసుకొచ్చాడు ఓ వ్యక్తి. ఆ దొంగ మీదకు దూకి పక్కకు నెట్టేసి.. ఆ కాల్పుల ఘటనను నిలువరించే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. అంతలో ఆ తల్లి అరుపులతో చుట్టుపక్కల వాళ్లు కొందరు గుమిగూడడంతో దొరికిపోవడం ఆ దొంగ వంతు అయ్యింది. సమాచారం అందుకున్న ఒకలూసా కౌంటీ పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కారు బ్యాటరీ దొంగతనం కోసమే అతను ఆ ఘాతుకానికి యత్నించినట్లు తేలింది. In reference to the FWB Chick-fil-A employee who ran to help a woman with a baby who was being carjacked, we want to say a sincere thank you to Ms. Kelner for providing video of a portion of the encounter. (see prior post). A major shout-out to this young man for his courage! pic.twitter.com/2Lcwe46azv — OkaloosaSheriff (@OCSOALERTS) September 14, 2022 ఇక కాపాడిన వ్యక్తి అక్కడే ఓ రెస్టారెంట్లో పని చేసే మైకేల్ గోర్డాన్గా గుర్తించారు. అక్కడే మరో కారులో కూర్చున్న వ్యక్తి.. ఆ ఘటనను వీడియో తీయడంతో ఆ సూపర్ హీరో ఉదంతం వెలుగు చూసింది. తల్లీబిడ్డలను కాపాడడంతో పాటు తమ రెస్టారెంట్కు మంచి పేరు తెచ్చినందుకు ఆ యాజమాన్యం.. గోర్డాన్ను అభినందించింది. సూపర్ హీరోలు ఎక్కడో ఉండరు.. ఇలా మన మధ్యే మంచి మనసున్న మనుషుల రూపంలో తిరుగుతూ ఉంటారు. -
తాళం వేసి ఉంటే లూటీనే..!
బంజారాహిల్స్: తాళంవేసి ఉన్న ఇంటి తాళాలు పగలకొట్టి ఖరీదైన సెల్ఫోన్లు, నగలు, నగదును తస్కరించిన ఘటనలో నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్.రావు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె.రవికుమార్, డీఎస్ఐ ఇ.రవితో కలిసి బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఘటన వివరాలు వెల్లడించారు. దుబాయ్లో నివసించే మహ్మద్ ఇమ్రాన్ సయ్యద్నగర్లో నివాసముంటున్నాడు. ఈనెల 24న ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్కు ఓ వివాహ విందులో పాల్గొనేందుకు వచ్చాడు. తన బంధువులు, స్నేహితులకు ఇచ్చేందుకు 22 సెల్ఫోన్లను, ఒక ట్యాబ్ను, ఒక కెమెరాను తీసుకువచ్చాడు. తీసుకువచి్చన సామగ్రిని బ్యాగ్లోనే పదిలపరిచి ఇంట్లో ఉంచి సాయంత్రం తాళం వేసి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లారు. విందు ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగలకొట్టి ఉంది. లోనికి వెళ్లిచూడగా దుబాయ్ నుంచి తాను తీసుకువచి్చన సెల్ఫోన్లతో పాటు నగలు, నగదు కనిపించలేదు. అదే రోజు రాత్రి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన క్రైమ్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ వ్యక్తి దొంగతనం చేసిన వస్తువులతో వెళుతున్న దృశ్యాలు నిఘా నేత్రంలో స్పష్టంగా కనిపించాయి. స్థానికులు చెప్పిన ఆధారాలతో క్రైమ్ పోలీసులు చాంద్రయాణగుట్ట బార్కాస్లో తలదాచుకున్న ఫరీద్ఖాన్ అలియాస్ ఫరీద్ను అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టయింది. నిందితుడు నుంచి 22 సెల్ఫోన్లతో పాటు ఒక ట్యాబ్, ఒక కెమెరా, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.23 లక్షలు ఉంటుందని డీసీపీ తెలిపారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని ఫరీద్ గతంలో కూడా హిమాయత్నగర్, సైఫాబాద్, గోల్కొండ, లంగర్హౌజ్ పోలీస్స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేసినట్లు ఆ కేసుల్లో రిమాండ్కు వెళ్లినట్లు తెలిపారు. తాజాగా అరెస్టు చేసిన కేసుతో పాటు గతంలో ఇంకో ఐదు కేసుల్లో నిందితుడని ఆయన తెలిపారు. కారు మెకానిక్గా పనిచేస్తున్న ఫరీద్ జల్సాకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. క్రైమ్ పోలీసులను డీసీపీ అభినందించారు. -
మహిళ కేకలు వేయడంతో పట్టుబడిన దొంగలు
సాక్షి, నిజామాబాద్ : మహిళ మెడలోని పుస్తెల తాడును దొంగిలించాలని చూసిన ఇద్దరు దొంగలు ఆమె కేకలు వేయడంతో పోలీసులకు దొరికిపోయారు. జిల్లాలోని బోధన్ డివిజన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. అంతకుముందు మంగళవారం బోధన్లోని నాయీ బ్రాహ్మణ వీధిలో ఇంటి బయట నిల్చున్న మహిళ మెడలో గొలుసు తెంపడానికి ప్రయత్నించారు. కానీ, మహిళ అప్రమత్తంగా ఉండడంతో వీరి ప్లాన్ బెడిసికొట్టింది. బుధవారం ఎడవల్లిలో మాత్రం వారి ప్లాన్ సక్సెస్ అయ్యింది. వెంటనే మహిళ కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమందించారు. స్పందించిన పోలీసులు దొంగలను వెంబడించి సినీ ఫక్కీలో వారిని పట్టుకున్నారు. విచారణ అనంతరం బుధవారం సాయంత్రం పోలీస్ కమిషనర్ సమక్షంలో మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
కన్నీటి సుడులు.. కరిగె మారాజు
ఎవరినీ వదిలిపెట్టను
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement