-
తెనాలి గడ్డ...పేకాట అడ్డా..!
జూదం.. తెనాలిలో మళ్లీ షో అంటోంది. రాజు, రాణీ, జాకీ.. కాయ్ రాజా కాయ్ అంటూ పలవరిస్తోంది. లోనా, బయటా అంటూ ఊరిస్తోంది. కోట్ల రూపాయలతో పందెం కాస్తూ పోలీసులను జోకర్లను చేస్తోంది. రాజధాని గ్రామాల నుంచీ పేకాటరాయుళ్లు తరలివస్తున్నారు. విజయవాడ నగరంలోని ఒక ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఇక్కడే పేకాటలో తరిస్తున్నాడు. మొత్తంగా ఆంధ్రాప్యారిస్ మినీ క్లబ్గా మారిపోయింది. తెనాలి : ఆంధ్రాప్యారిస్గా పిలుచుకొనే తెనాలికి ఆ పేరు ఎలా వచ్చిందనే అంశంపై భిన్నవాదనలు తెలిసిందే. అన్నీ పక్కన బెడితే, ప్యారిస్లో ఉన్నట్టుగా జూదం, వినోదం ఇక్క డ మస్తు. పరిసరాల్లోని వందకుపైగా గ్రామాలకు కూడలి అయినందున జనం తాకిడి అధికం. పూర్వం నుంచి వ్యభి చారం, పేకాట క్లబ్బులకు పెట్టింది పేరు. ఆధునికతతో అం దివచ్చిన వ్యసనాలనూ పట్టణం వంట బట్టించుకుంది. సిం గిల్ నంబర్ లాటరీ.. ఒక ఊపు ఊపింది. జనం గుల్లయిపోయారు. రిక్రియేషన్ పేరుతో క్లబ్లూ నడిచాయి. మహిళల తిరుగుబాటుతో రెండు దశాబ్దాలుగా క్లబ్లలో పేకాట బం దయింది. రెండు క్లబ్లు బార్ అండ్ రెస్టారెంట్లుగా మారా యి. జిమ్, క్రీడల సహా రమ్మీ కోసం ఇటీవల ఓ క్లబ్ను ఆధునికీకరించి సిద్ధం చేస్తే, పోలీసులు అడ్డుకోవటం తెలిసిందే. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మినీక్లబ్బులు... ఈ నేపథ్యంలో పట్టణంలో జూదం మళ్లీ జడలు విప్పింది. పేకాటలో ఆరితేరిన అధికార తెలుగుదేశం పార్టీ ఛోటా నేతల నేతృత్వంలో పలు చోట్ల మినీ క్లబ్లు వెలిశాయి. ఊరి శివారుల్లో, పంట పొలాల్లో నాలుగైదు క్లబ్లున్నాయి. వీటిలో కోతముక్కాట అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది. ఐతానగర్లో రెండు, పినపాడు నుంచి దుండిపాలెం వెళ్లే డొంకరోడ్డులో తెనాలి, చుండూరు సరిహద్దుల్లో ఒకటి, అక్కడకు కొంచెం దూరంలోని పంట పొలం పాకలో భారీ జూదం జరుగుతోంది. మారీసుపేటలో స్థానిక ప్రజాప్రతినిధి బంధువు అడ్డాలో నడిచే పేకాట క్లబ్లో కొందరు పోలీసులూ ఆటగాళ్లేనట! చంద్రబాబు కాలనీలో ఓ వ్యాపారి ఇంట్లో పేకాట లేనిదే తెల్లవారదని వ్యసనపరులు చెబుతున్నారు. అమరావతి ప్లాట్స్, బోసురోడ్డులోని వ్యాపారకూడలిలో, నాజరుపేటలోని ఓ గుడి సమీపంలో, చెంచుపేటలోని ఓ హోటల్లో...ఇలా పట్టణంలో అన్నీ కలిపి 30 మినీక్లబ్లు నడుస్తుండగా, పదింటిలో భారీస్థాయిలో పేకాట సాగుతోంది. మరికొన్ని ప్రైవేటు ఇళ్లలో ఒక్కో టేబుల్ చొప్పున క్లబ్లు నిర్వహిస్తున్నారు. రోజుకు చేతులు మారుతున్న రూ.3 కోట్లు కోతముక్కాట ఆడే బరిలో కోటి రూపాయలు చేతులు మారుతుంటే, ఓకుకు రూ.50, రూ.100 చొప్పున జరిగే రమ్మీతో సహా రోజుకు హీనపక్షం రూ.3 కోట్లు చేతులు మారుతున్నాయి. కోతముక్కాటలో పాల్గొనే వ్యక్తి రూ.3 వేలు చెల్లించాలి. కనీసం రూ.5 లక్షలు జేబులో ఉండాలట! దాదాపు 20 మంది పాల్గొనే ఈ ఆటలో బరి కోసమే రూ.60 వేలు తీస్తున్నారు. రమ్మీ ఆట క్లబ్లలో ఒక్కో ఆటకు రూ.100, రూ.150 వంతున కేటాయిస్తున్నారు. అంటే రోజుకు కనీసం రూ.10 నుంచి రూ.15 వేల వరకు ఆదా యం. ఒక్కో క్లబ్కు నలుగురైదుగురు వేగులు. పోలీస్స్టేషను ముందు నుంచి, క్లబ్ వరకు ఉండే వేగులు పోలీసు వాసనను ఇట్టే పసిగట్టేసి హెచ్చరికలు చేస్తారు. ఆట పడిన రోజుల్లా ఒక పోలీస్స్టేషన్కు చెందిన నలుగురు కానిస్టేబుళ్లకు రూ.3 వేలు చొప్పున మామూళ్లు చెల్లిస్తారట. రైడింగులుంటే ముందే సమాచారం వచ్చేలా పక్కాగా ప్లాను చేసుకున్నారు. పేకాట జోలికొస్తే ఖబడ్దార్...! తెనాలిలో పేకాటకు రాజధాని గ్రామాలు, విజయవాడ నుంచీ ఆటగాళ్లు వస్తున్నారు. విజయవాడలోని ఓ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడికి ఇక్కడి పేకాట బరికి రాకుంటే నిద్ర పట్టదంట! ఊరి వెలుపల ఓ గుడి వద్ద, ఆర్టీసీ బస్టాండు వెలుపల, రైల్వేస్టేషనులోనూ వాహనాలను పార్క్ చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల మధ్య జరిగే ఈ పేకాటలో కొన్ని చోట్ల కోతముక్కను తెల్లవారుజాము 4 గంటల నుంచి 7.30 గంటల మధ్య ఆడుతున్నారు. పేకాట జోలికొస్తే ప్రజాప్రతినిధులూ ఊరుకోవటం లేదు. సమీప అంగలకుదురులో ఈ వారంలో వనభోజనాల్లో పేకాడుతున్న వారిపై పోలీసులు దాడి చేశారు. దాదాపు రూ.38 లక్షల నగదు బరిలో ఉందని తెలిసింది. మండల, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు జోక్యంతో పోలీసులు మౌనంగా తిరిగి వెళ్లినట్టు సమాచారం. ఇటీవల బోసురోడ్డులోని ఓ హోటల్లో పట్టుబడిన ఆటగాళ్లను వదిలేశారు. చేసేదిలేని పోలీసులు ఏ అండా లేని బక్క ఆటగాళ్ల బరులపై దాడులు చేస్తూ కేసులు కడుతున్నారు. -
కౌలు రైతుకు ‘కార్డు’ కష్టం!
కౌలు రైతుల కష్టాలకు అంతూపొంతూ ఉండటం లేదు. పంట రుణం మంజూరు సంగతి దేవుడెరుగు.. కనీసం రుణ అర్హత కార్డులే ఇంతవరకు వారికి అందలేదు. పది రోజులపాటు గ్రామ సభలు నిర్వహించి మరీ దరఖాస్తులు స్వీకరించిన రెవెన్యూ అధికారులు తర్వాత పట్టించుకోవటం మానేశారు. దీంతో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయూరైంది. ఖరీఫ్ పంటలెలా సాగు చేయూలో అర్థం కాక వారు ఆందోళన చెందుతున్నారు. తెనాలి టౌన్ : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా జిల్లాలోని కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇంకా మంజూరు కాలేదు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయూరైంది. జిల్లాలో రెండున్నర లక్షల మంది కౌలు రైతులు ఉండగా గత ఏడాది రెవెన్యూ అధికారులు 30 వేల మందికి మాత్రమే కార్డులు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ ఏడాది కార్డుల మంజూరు నిమిత్తం ఈ నెల 9 నుంచి 19వ తేదీ వరకు తెనాలి డివిజన్లోని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. వీటిలో డిప్యూటీ తహశీల్దార్ స్థాయి అధికారులు, వీఆర్వోలు పాల్గొని కౌలు రైతులను చైతన్య పరచి అర్జీలు తీసుకున్నారు. తర్వాత ఎలాంటి సమాచారం లేకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వడ్డీ వ్యాపారుల వలలో.. బ్యాంకు అధికారు లు రుణాలు ఇవ్వకపోవడంతో కౌలు రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రరుుస్తున్నారు. అధిక వడ్డీలకు అప్పు తీసుకుని విలవిల్లాడుతున్నారు.మరోవైపు.. పంట పెట్టుబడు లు, కూలీల ఖర్చులు, కౌలు ధరలు పెరగడంతో ఆర్థికంగా కుదేలవుతున్నారు. గత ఏడాది నవంబర్లో వచ్చిన హెలెన్ తుఫాన్ దెబ్బకు కౌలు రైతులు పూర్తిగా నష్టపోయారు. టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ పథకం వర్తించకపోరుునా, ఈ ఏడాది బ్యాంకు రుణాలు మంజూరు కాకపోరుునా ఆత్మహత్యలే శరణ్యమనివారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 2.50 లక్షల మంది కౌలుదారులు ఉంటే వారిలో కేవలం 30 వేల మందికి మాత్రమే కార్డులు ఇచ్చి గత ప్రభుత్వం చేతులు దులుపుకుంది. కార్డులున్నవారిలో కనీసం 3 వేల మందికి కూడా బ్యాంకు రుణాలు అందలేదు. రుణ అర్హత కార్డు తీసుకుంటే కౌలుకు భూమి ఇచ్చేది లేదని యాజమానులు కచ్చితంగా చెబుతున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా ఎరువులు, పురుగు మందులకు అందించే రాయితీలు పొందటానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట దెబ్బతింటే నష్టపరిహారం అందుకోవటానికి, బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకోవడానికి కౌలు రైతులకురుణ అర్హత కార్డులు అవసరం. కౌలు రైతులంటే చిన్నచూపు.. కౌలు రైతులను బ్యాంకు అధికారులు చిన్నచూపు చూస్తున్నారని కౌలు రైతుల సంఘం డివిజన్ కార్యదర్శి ములకా శివసాంబిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గోడకు వేసిన సున్నం ఎలా తిరిగిరాదో, కౌలుదారులకు ఇచ్చిన రుణం గ తి కూడా అంతేనని ఒక బ్యాంకు మేనేజర్ తనతో అన్నారని వాపోయూరు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement