breaking news
tenth class certificates
-
వయసు నిర్ధారణకు టెన్త్ సర్టిఫికెట్ చాలు
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : బాలల న్యాయచట్టంలోని సెక్షన్ 94, వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలు పరిగణనలోకి తీసుకుని వయసు నిర్ధారణకు వ్యక్తి 10వ తరగతి సర్టిఫికెట్ తుది ఆధారమని జిల్లా బాలల సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. జిల్లాలోని టి.నరసాపురం పోలీస్స్టేషన్ పరిధిలోని ఒక కేసుకు సంబంధించి ఏలూరు శనివారపుపేటలోని సమితి కార్యాలయంలో సీడబ్ల్యూసీ తుది నిర్ణయం వెలువరించినట్టు సమితి చైర్పర్సన్ టీఎన్ స్నేహన్ తెలిపారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. టి.నరసాపురం మండలం రాజుపోతేపల్లికి చెందిన దేవరపల్లి బేబి అనే యువతి పెదవేగి మండలం ముండూరుకి చెందిన అన్నపనేని సందీప్ అనే యువకుడిని గతేడాది డిసెంబర్ 24న వివాహం చేసుకుంది. అయితే వివాహంపై బే బి తండ్రి అభ్యంతరం వ్యక్తం చేస్తూ టి.నరసాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాను మేజర్నని తన టెన్త్ సర్టిఫికెట్ను బేబి పోలీసులకు చూపింది. అయితే ఆమె తండ్రి టెన్త్ సర్టిఫికెట్లో పుట్టినతేదీ తప్పని, పంచాయతీ కార్యాలయం ద్వారా మరో సర్టిఫికెట్ను తీసుకువచ్చి పోలీసులకు చూపించారు. దీంతో కేసును పోలీసులు సీడబ్ల్యూసీ ముందుంచారు. తండ్రి చూపిన సర్టిఫికెట్ ఆధారంగా బేబిని మైనర్గా భావించి సీడబ్ల్యూసీ సూచనలతో గతనెల 12న ఆమెకు దెందులూరు బాలసదన్లో ఆశ్రయం కల్పించారు. సంక్రాంతి సెలవుల అనంత రం బేబీని పోలీసులు సీడబ్ల్యూసీ ముందు హాజరుపరిచారు. ఇరువర్గాల వాదోపవాదాల అనంతరం వయసు నిర్ధారణకు టెన్త్ సర్టిఫికెట్ ప్రామాణికమని భావించి తుది తీర్పు వెల్లడించారు. బేబి చదివిన మూడు పాఠశాలల్లో పుట్టినతేదీ ఒకేవిధంగా ఉందని, ఆమెకు 18 ఏళ్లు నిండినట్టు నిర్ధారించారు. -
నకిలీ సర్టిఫికెట్ ముఠా గుట్టురట్టు
వైఎస్సార్(బద్వేల్): జిల్లాలో ఓ నకిలీ సర్టిఫికెట్ల రాకెట్టు గుట్టురట్టయింది. పాస్పోర్టు కోసం సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని తేలడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సిద్ధుగారిపల్లెకు చెందిన ఓ యువకుడు కువైట్ దేశం వెళదామని పాస్పోర్ట్కు దరఖాస్తు చేద్దామని వెళ్లాడు. ఇతను పదో తరగతి కూడా చదువుకోలేదు. కనీసం పదో తరగతి సర్టిఫికెట్లు ఉంటేనే పాస్పోర్ట్ తేలికగా వస్తుందని ఓ ప్రభుత్వ ఉద్యోగి చెప్పడంతో ఆవిధంగా ప్రయత్నాలు ప్రారంభించాడు. రూ.40 వే లు చెల్లిస్తే సర్టిఫికెట్ ఇస్తానని ఓ ప్రభుత్వ టీచర్ చెప్పడంతో సదరు యువకుడు ఆ డబ్బును చెల్లించారు. బద్వేల్లోని ప్రవీత్ పబ్లిక్ హైస్కూల్ నుంచి టీసీ, ఇతర సర్టిఫికెట్లు తీసుకుని పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. స్పెషల్ బ్రాంచ్ అధికారి శేషగిరిరావు జరిపిన తనిఖీల్లో యువకుడు సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని తేలడంతో స్థానిక సీఐ వెంకటప్పకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన సీఐకు అసలు విషయం తెలియడంతో నిందితులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధమున్న శేఖర్, హరి, ఓ రిటైర్డ్ తహశీల్దార్ సమీప బంధువు, మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రక్షించటానికి మైదుకూరు టీడీపీ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. నిందితుల నుంచి సర్టిఫికెట్లు తయారు చేయడానికి వినియోగించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల పేర్లు పోలీసులు అధికారికంగా తెలపలేదు.