టెన్నికాయిట్ విజేత అనిల్
జింఖానా, న్యూస్లైన్: ఎల్.వెంకట్రామిరెడ్డి స్మారక టెన్నికాయిట్ టోర్నీలో హైదరాబాద్ కుర్రాడు అనిల్ విజేతగా నిలిచాడు. ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగిన ఈ టోర్నీలో బాలుర విభాగం ఫైనల్లో అనిల్ 21-18, 21-19తో వరంగల్కు చెందిన ప్రకాష్పై గెలుపొందాడు.
బాలికల విభాగం ఫైనల్లో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రీహర్ష 14-21, 18-21తో రేవతి (ప్రకాశం) చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. విజేతలకు భారత టెన్నికాయిట్ సమాఖ్య (టీకేఎఫ్ఐ) ఉపాధ్యక్షడు టి. రామమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి టీకేఎఫ్ఐ కార్యదర్శి లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.