breaking news
Temporary registrations
-
షోరూమ్ల్లోనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్
* హైసెక్యూరిటీ నంబర్ప్లేట్ కూడా అక్కడే * ఇక తాత్కాలిక రిజిస్ట్రేషన్లు ఉండవు * అమలు దిశగా రవాణా శాఖ సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్లలో ఇప్పటివరకు ఉన్న రెండు రకాల రిజిస్ట్రేషన్ల విధానానికి త్వరలో తెరపడనుంది. ఇక వాహనం కొనుగోలు చేసిన షోరూమ్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ చేస్తారు. హైసెక్యూరిటీ నంబర్ప్లేట్ను బిగించి ఇస్తారు. దీంతో వాహనదారులు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం తాత్కాలిక రిజిస్ట్రేషన్లతోపాటు, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఫీజును షోరూమ్లలోనే చెల్లించే సదుపాయం అందుబాటులో ఉంది. ఇక తాత్కాలిక రిజిస్ట్రేషన్ పద్ధతికి కూడా స్వస్తి చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం సీఎం పరీశీలనలో ఉన్న ఈ ప్రతిపాదన కొద్దిరోజుల్లోనే అమల్లోకి వచ్చే అవకాశమున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల విషయంలో ఇక ఏజెంట్లు, మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. ఈ కొత్త విధానాన్ని తెలంగాణ అంతటా పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర రవాణాశాఖ భావిస్తోంది. రోజూ వేలసంఖ్యలో నమోదు ఇప్పటివరకు మోటారు వాహన నిబంధనల ప్రకారం వాహనాలు కొనుగోలు చేసిన నెలరోజుల్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొద్దిపాటి జరిమానాతో 6 నెలల వరకు కూడా అనుమతిస్తారు. ఇలాంటి వాహనాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు, రోడ్డు భద్రతా నిమయాలను అతిక్రమించినప్పుడు చర్యలు తీసుకోవడంలో ఇబ్బందులు తలె త్తుతున్నాయి. ఇలాంటి సమస్యల నుంచి వాహనదారులకు ఊరట కల్పించేందుకు ఆర్టీఏ చర్యలు చేపట్టింది. వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను షోరూమ్లకు అప్పగించే ప్రతిపాదనపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, తాత్కాలిక రిజిస్ట్రేషన్ల పేరిట కొందరు డీలర్లు వాహనదారులను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. రవాణాశాఖ నిర్వహించే దాడుల్లోనూ తరచూ ఇలాంటి అక్రమాలు వెలుగుచూస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పర్మనెంట్ రిజిస్ట్రేషన్లను షోరూమ్లకు కట్టబెట్టడం వల్ల డీలర్లపై రవాణాశాఖ నియంత్రణ ఏ మాత్రం ఉండదని ఆందోళన వ్యక్తమవుతోంది. -
దర్జాగా తిరుగుతున్నారు!
అనంతపురానికి చెందిన రమేష్ ఆరేళ్ల క్రితం ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేశాడు. నిబంధనల ప్రకారం నెల రోజుల్లో శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే దర్జాగా తిరుగుతున్నాడు.. అతడే కాదు.. జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో వాహనదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్ల (టీఆర్)తోనే రోడ్డుపైకి వస్తున్నారు. కొందరికైతే టీఆర్ కూడా లేదు. అటు పోలీసులు, ఇటు రవాణాశాఖ అధికారుల తనిఖీలు తూతూమంత్రంగా సాగుతుండటంతో ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. * రిజిస్ట్రేషన్పై వాహనదారుల అనాసక్తి * జిల్లాలో 16 వేల వాహనాల గుర్తింపు * ప్రభుత్వాదాయానికి గండి అనంతపురం టౌన్ : జిల్లాలో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఇందులో ద్విచక్రవాహనాలు, కార్లు వంటికే అధికంగా ఉంటున్నాయి. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తున్న యజమానులు వాటి రిజిస్ట్రేషన్కు ముందుకు రావడం లేదు. కొనుగోలు జరుగుతున్న మేరకు రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ప్రస్తుతం అన్ని రకాల వాహనాలు 5 లక్షలకు పైగా ఉన్నాయి. ఇందులో సుమారు 16 వేల వాహనాలు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ప్రధానంగా 80 శాతం ద్విచక్రవాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్)తోనే కాలం వెళ్లదీస్తున్నాయి. నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన వాహనానికి తప్పనిసరిగా నెలరోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నెల దాటితే రూ.20, ఆరు నెలలు దాటితే రూ.100 నామమాత్రపు రుసుం ఉండడంతో వాహనదారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రభుత్వానికి వీటి నుంచి వచ్చే ఆదాయం కోల్పోతుంది. ఈనేపథ్యంలో రవాణాశాఖ అధికారులు ‘స్పెషల్ డ్రైవ్’ పేరుతో జిల్లా వ్యాప్తంగా మూడ్రోజులుగా తనిఖీలు చేపడుతున్నారు. టీఆర్తో మొదటి సారి వాహనం పట్టుబడితే రూ.2 వేలు, రెండో సారి పట్టుబడితే సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నేరాలకు కొత్త వాహనాలు చోరీలు, అక్రమ రవాణా ఇతరత్రా వాటికి కొన్ని అసాంఘిక శక్తులు కొత్త వాహనాలను ఉపయోగిస్తున్నారు. నేరాలు చేయాలన్నా నూతన వాహనాలనే ఎంచుకుంటున్నారు. నేరాలు జరిగినప్పుడు వాహనాన్ని ఎవరైనా చూసినా దానికి నంబర్ ప్లేట్ లేకపోవడంతో అసలు సమస్య ఎదురవుతోంది. వాహనదారులకూ నష్టమే వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే యజమానికే నష్టం జరుగుతుందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. వాహనచట్టం ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ లేని వాహనం చోరీకి గురయితే ఎలాంటి కేసులు నమోదు చేయరు. పోలీసులు వాహనం గుర్తించడం కష్టంగా ఉంటుంది. ప్రమాదాలు జరిగినప్పుడు వాహన యజమానే వాటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. బీమా చెల్లింపులకు సైతం ఇబ్బందులు తప్పవు. పోలీసు కేసుల్లో కూడా ఇరుక్కోవాల్సి ఉంటుంది. సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం నిబంధనలను అతిక్రమించి టీఆర్ నంబర్తోనే తిరుగుతున్న వాహనాల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు సుమారు 100 కేసులు నమోదు చేశాం. స్వచ్ఛందంగా 440 మంది రిజిస్ట్రేషన్ చేరుుంచుకున్నారు. మొదటిసారి జరిమానా విధిస్తున్నాం. పరిస్థితి అలాగే ఉంటే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం. జిల్లా వ్యాప్తంగా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాహనదారులు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే. వాహనదారులను చైతన్యవంతం చేసేందుకు గ్రామపంచాయతీలు, ఎంపీడీఓ కార్యాలయూల్లో ఫెక్లీలు ఏర్పాటు చేస్తున్నాం. - వి.సుందర్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్