breaking news
temper tamil remake
-
విశాల్తో జోడీ కుదిరింది!
సాక్షి, సినిమా : నటుడు విశాల్తో రాశీఖన్నాకు జోడీ కుదిరిందట. విశాల్ ఇప్పుడు రెండు చిత్రాల్లో నటిస్తూ నిర్మిస్తున్నారు. అందులో ఒకటి ఇరుంబుతిరై. ఇందులో సమంత నాయకి. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇక లింగుస్వామి దర్శకత్వంలో నటిస్తున్న సండైకోళీ–2 చిత్రం నిర్మాణంలో ఉంది. ఇందులో కీర్తీసురేశ్ నాయకి. తాజాగా మరో చిత్రానికి రెడీ అవుతున్నారు. తెలుగులో పూరిజగన్నా«థ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, కాజల్అగర్వాల్ జంటగా నటించిన విజయవంతమైన టెంపర్ రీమేక్లో నటించనున్నారు. అ చిత్రంలో విశాల్ మరోసారి పోలీస్ అధికారిగా నటించనున్నారు. లైట్హౌస్ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా వెంకట్ మోహన్ అనే నవదర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈయన మహేష్బాబు నటించిన స్పైడర్ చిత్రానికి సహయ దర్శకుడిగా పనిచేశారన్నది గమనార్హం. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో హైదరాబాద్ బ్యూటీ రాశీఖన్నా విశాల్తో జత కట్టే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ అమ్మడు కోలీవుడ్లో బిజీ అవుతోంది. ఇప్పటికే అధర్వకు జంటగా ఇమైకానోడిగల్ చిత్రంలో నటించింది. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. దీని గురించి రాశీఖన్నా చెబుతూ విశాల్కు జంటగా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం సిద్ధార్థ్కు జంటగా నటిస్తున్న చిత్ర షూటింగ్Š చిత్రీకరణ జరుగుతోందన్నారు. ఇది తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కుతోందని, అదే విధంగా జయంరవి సరసన ఒక చిత్రం చేయనున్నానని, అది వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమై మే లో విడుదల కానుందని చెప్పింది. -
టెంపర్ తమిళ రీమేక్ హీరో ఇతడే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్రలో కనిపించి, మంచి వసూళ్లు రాబట్టిన సినిమా టెంపర్. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధమైంది. స్వతహాగా తెలుగువాడైనా కోలీవుడ్లోనే స్థిరపడిన విశాల్ కృష్ణ ఈ రీమేక్లో పోలీసు పాత్రను పోషిస్తున్నాడు. నిజానికి ఈ ప్రాజెక్టులో శింబు నటిస్తాడని తొలుత కథనాలు వచ్చాయి. కానీ, చివరకు అధికారికంగా వచ్చిన ప్రకటన ప్రకారం విశాల్ హీరో అని తేలింది. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న తుప్పరివాలన్ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. అది పూర్తికాగానే టెంపర్ మొదలుపెడతాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విశాల్కు టెంపర్ సినిమా తెగ నచ్చేసిందని, అందులో ఎన్టీఆర్ చేసిన పాత్రకు న్యాయం చేయాలని భావిస్తున్నాడని అంటున్నారు. తెలుగులో జూనియర్ సరసన నటించిన కాజల్ అగర్వాలే తమిళంలోనూ హీరోయిన్గా చేస్తుందట. ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాకు స్టంట్ కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన అనల్ అరసు మెగాఫోన్ పట్టుకుంటారు.