-
టీయూటీఎఫ్ అధ్యక్షుడిగా లచ్చిరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) కొత్త కార్యవర్గం ఎన్నిక సోమవారం జరిగింది. గౌరవాధ్యక్షుడిగా బేర దేవన్న, అధ్యక్షుడుగా లచ్చిరాం, ప్రధాన కార్యదర్శిగా రఘునందన్రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షుడిగా మురళీ మనోహర్రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శిగా మొగులయ్య, ఆడిట్ కన్వీనర్గా గోపాల్ ఎన్నికయ్యారు. -
ముంపు ప్రాంత ఉపాధ్యాయులకు ఆప్షన్ ఇవ్వాలి
ఖమ్మం, న్యూస్లైన్: జిల్లాలో పోలవరం ముంపు ప్రాంత ఉపాధ్యాయులకు ఆప్షన్ అవకాశం ఇచ్చి, వారి ఇష్ట ప్రకారం వెళ్లే సదుపాయం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నాగటి నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంపు ప్రాంతాలతోపాటు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఆప్షన్ ప్రకారం వెళ్లే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కేంద్రం స్కేలు, స్థానిక ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రకటించడం హర్షణీయమని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కీలక పోస్టులు, మండల విద్యాశాఖాధికారి పోస్టులను భర్తీ చేసి విద్యారంగ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. అత్యంత తక్కువ వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు ఇంక్రిమెంట్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం ఈ విషయంలో తాత్సారం చేసిందని, రాబోయే ప్రభుత్వమైనా స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, పండిట్, పీఈటీ పోస్టుల అప్గ్రేడేషన్ ఫైళ్లు క్లియర్ చేయాలని కోరారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.నరసింహారావు మాట్లాడుతూ విద్యావికాస ఉద్యమం ద్వారా పాఠశాలల్లో విద్యార్థులను నమోదు చేయడం కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులంతా జూన్ 1 నుంచే నమోదు కార్యక్రమాల్లో ఉండాలని తెలిపారు. సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరి వీరబాబు కార్యకలాపాల నివేదిక ప్రవేశపెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. టీఎస్ యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు కల్యాణం నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర సహాధ్యక్షులు సీహెచ్.దుర్గాభవాని, జిల్లా కోశాధికారి జె.రాంబాబు, బి.రాందాస్, కాార్యదర్శులు జీవీ నాగమల్లేశ్వరరావు, పి.కిష్టయ్య, ఎస్కె.మహబూబ్అలి, ఎ.రమాదేవి, బాలు, టి.ఆంజనేయులు, ఎం.నరసింహారావు, ఎస్కె.ఉద్దండు షరీఫ్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement