breaking news
Technical University
-
వనాలకు ఆకాశ శరాలు
వాషింగ్టన్: వెచ్చని సూర్యకిరణాలు పుడమి తల్లిని ముద్దాడకుండా అడ్డుకుంటూ దట్టంగా, ఏపుగా పెరిగిన వృక్షాలను చూసి వరుణదేవునికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుదో లేదో తెలీదుగానీ వర్షం వంటి సందర్భాల్లో భూమిపైకి దూసుకొచ్చే మెరుపులు, పిడుగుల కారణంగా కోట్లాది వృక్షాలను కాలిబూడిద అవుతున్నాయి. పిడుగులు పడడంతో ఉద్భవించే అతి ఉష్ణానికి ప్రతి ఏటా అక్షరాలా 35 కోట్ల చెట్లు నిట్టనిలువునా కాలిపోతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. పుడమిపై పచ్చదనం క్షీణించడానికి పిడుగులు కూడా ప్రబల హేతువుగా మారాయన్న కొత్త విషయాన్ని అధ్యయనకారులు వెల్లడించారు. మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ మేరకు విస్తృతస్థాయిలో పరిశోధన చేశారు. పిడుగులు పడటంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది చెట్లు కాలిపోతున్నాయని, దీంతో పచ్చదనం తగ్గిపోతోందని అధ్యయనంలో స్పష్టమైంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన అడవుల్లో వృక్షాల క్షీణతకు సంబంధించిన సమాచారాన్ని ఆధునిక గణన పద్ధతులతో విశ్లేషించి ఈ విషయాన్ని దృవీకరించుకున్నారు. అయితే వాస్తవంగా చూస్తే ఏటా ఇంతకంటే ఎక్కువ సంఖ్యలోనే వృక్షాలు పిడుగులకు బలికావొచ్చని అధ్యయనకారులు అంచనావేశారు. ‘‘ప్రతి సంవత్సరం పడుతున్న పిడుగుల కారణంగా ఎన్ని చెట్లు కాలిపోతున్నాయి అనేది అంశంతోపాటే ఏఏ దేశాల్లో పిడుగుల ఘటనలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి? వాటి కారణంగా తగ్గిన పచ్చదనంతో అక్కడ మారిన వాతావరణ పరిస్థితుల వివరాలనూ సేకరిస్తున్నాం’’అని అధ్యయనంలో ముఖ్య రచయిత ఆండ్రీస్ క్రాస్ చెప్పారు. భారీ స్థాయిలో నష్టం 32 కోట్ల చెట్లు అంటే చిన్న విషయం కాదు. ఏకంగా ప్రపంచ వృక్ష సంపదలో 2.1 శాతం నుంచి 2.9 శాతానికి సరిపడా వృక్షాలు అంతరించిపోతున్నట్లే లెక్క. ఈ లెక్కన పుడమిపై పచ్చదనం గాఢత సైతం తగ్గుతోంది. ఇంతటి భారీ సంఖ్యలో చెట్లు లేకపోవడం కారణంగా ఈ చెట్లుఉంటే పీల్చుకునే కార్భన్డయాక్సైడ్ అలాగే వాతావరణంలోనే పోగుబడుతోంది. ఇలా ఏటా ఏకంగా 77 కోట్ల నుంచి 109 కోట్ల టన్నుల కార్భన్డయాక్సైడ్ వాతావరణంలోనే ఉండిపోతోంది. ఇది భూతాపోన్నతికి ప్రత్యక్షంగా కారణమవుతోందని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తంచేశారు. పిడుగులు పరోక్షంగా 109 కోట్ల టన్నుల సీఓ2 వాతావరణంలో పేరుకుపోవడానికి కారణమైతే.. కార్చిచ్చు, అడవి దగ్ధం వంటి ఘటనల కారణంగా వృక్షసంపద కాలిపోయి తద్వారా దాదాపు అదే స్థాయిలో 126 కోట్ల టన్నుల కార్భన్డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతోంది.మరింతగా పిడుగుల వర్షం! రాబోయే రోజుల్లో పిడుగులు పడే దృగి్వషయాలు మరింతగా సర్వసాధారణం కానున్నాయని అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం ఉష్ణమండల అరణ్యాల్లో పిడుగులు ఎక్కువగా పడుతున్నాయి. దీంతో భారీసంఖ్యలో చెట్లు నాశనమవుతున్నాయి. రాబోయే రోజుల్లో సముద్రమట్టంతో పోలిస్తే మధ్యస్థాయి, కాస్తంత ఎక్కువ ఎత్తులో ఉండే దేశాల్లోనూ పిడుగుల బెడద ఎక్కువ కానుందని అధ్యయనకారులు చెప్పారు. సమశీతోష్ణ మండలాలు, యూరప్ దేశాల్లో పిడుగులు ఎక్కువగా పడే అవకాశముంది. దీంతో అటవీ ఆవరణ వ్యవస్థ, అక్కడి కార్భన్డయాక్సైడ్ స్థాయిలపై దుష్ప్రభావం పెరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు తమ పరిధిలోని అడవుల సంరక్షణపై మరింతగా దృష్టిసారించాలని అధ్యయనకారులు సూచించారు. -
భాంగ్రా నృత్యంతో పంజాబ్ సీఎం హల్చల్
చండిగఢ్: పంజాబ్ నూతన ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ చాలా ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థానంలో చన్నీ ఇటీవల పదవీ బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో "భాంగ్రా" నృత్యంతో సందడి చేశారు. (Charanjit Channi:తొలి మీడియా సమావేశంలో భావోద్వేగం) కపూర్తలాలోని ఐకే గుజ్రాల్ పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మ్యూజియం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఒక ఈవెంట్లో వేదికపై ఉన్న కళాకారులతో జత కలిశారు. వారితో పాటు ఉత్సాహంగా స్టెప్పులేసి అక్కడున్న వారందరిలో జోష్ నింపారు. కాగా సీఎంగా జలంధర్లో జిల్లాలో తన తొలి పర్యటన సందర్భంగా, 101పైగా ఎకరాల విస్తీర్ణంలో గురు రవిదాస్ చైర్ ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి సుఖ్జీందర్ సింగ్ రాంధవా , కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శి పర్గత్ సింగ్తో ఇక్కడ పర్యటించారు డేరా సఖండ్ బల్లన్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన సీఎం, రవిదాస్ చైర్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. రానున్న పది సంవత్సరాల పాటు దీని నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం చూస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. #WATCH | Punjab Chief Minister Charanjit Singh Channi breaks into Bhangra at an event in Kapurthala. (Source: Information Public Relations Punjab) pic.twitter.com/4xg7iDKorW — ANI (@ANI) September 23, 2021 -
హైదరాబాద్లో టెక్నికల్ వర్సిటీ: మునియప్ప
కోలారు(కర్ణాటక): ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో ఐటీఐ నుంచి ఎంటెక్ వరకు ప్రత్యేక శిక్షణనిచ్చే సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని(టెక్నికల్ వర్సిటీ) ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల శాఖా మంత్రి కేహెచ్ మునియప్ప వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం కోలారులో కెనరా బ్యాంకు ఏర్పాటు చేసిన రుణ మేళాలో మంత్రి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిపుణులైన కార్మికులను రూపొందించేందుకుగాను హైదరాబాద్లో టెక్నికల్ వర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని చెప్పారు. వర్సిటీ ఏర్పాటుకు స్థలం ఇచ్చేందుకు ఏపీ సీఎం కిరణ్కుమార్రెడ్డి అంగీకరించారని తెలిపారు. అత్యుత్తమ సాంకేతిక శిక్షణ ఇవ్వడం ద్వారా సృజనాత్మకత కలిగిన నిపుణులు అందుబాటులోకి వస్తారన్నారు.