-
రెండేళ్ల నిరీక్షణకు తెర
సాక్షి, మహబూబ్నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఎస్జీటీ (సెకండ్ గ్రేడ్ టీచర్లు) పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం 2017లో నియామక పరీక్ష నిర్వహించగా ఇన్నాళ్లూ వివిధ కారణాలతో జాబితాను ప్రకటించడానికి కాలయాపన చేసింది. పలుమార్లు అభ్యర్థులు పెద్దఎత్తున జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పందించి పరీక్షకు సంబంధించిన మెరిట్ లిస్ట్ను ప్రభుత్వం ఆన్లైన్లో పొందుపరిచింది. దీంతో అభ్యర్థుల ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడింది. త్వరలో భర్తీ చేసే అవకాశం ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ఆధారంగా త్వరలోనే మొత్తం పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 2017లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మొత్తం 1,979 ఉపాధ్యాయ పోస్టులకు గాను 2018 ఫిబ్రవరి, మార్చిలో ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో పరీక్ష నిర్వహించారు. దాదాపు 50వేల మందికిపైగా అభ్యర్థులు పరీక్ష రాశారు. ఐదు నెలల క్రితం 375 పోస్టులకు వివిధ సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్లు, ల్యాంగ్వేజ్ పండిట్ పోస్టులను, 42 కన్నడ, ఉర్దూ మీడియం మినహా మిగతా భాషలకు చెందిన ఉపాధ్యాయులను మూడు నెలల క్రితం సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి భర్తీ చేశారు. అనంతరం ఇంగ్లీష్, తెలుగు భాష ఎస్జీటీ ఉపాధ్యాయులకు సంబంధించి కోర్టులో వివాదం కొనసాగగా కొన్నిరోజుల తర్వాత ఈ సమస్య కూడా సద్దు మనిగింది. ప్రస్తుతం కేవలం తెలుగు, ఇంగ్లీష్ భాషకు చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరు దాదాపు 1,020 మంది ఉన్నారు. వీరికి కూడా త్వరలోనే పోస్టింగులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తీరనున్న ఉపాధ్యాయుల కొరత కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఉమ్మడి జిల్లాలో 375, ఎస్జీటీ పోస్టులను గతంలో 42 మాత్రమే భర్తీ చేశారు. కానీ పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల సమస్య తీరలేదు. అయితే ఈ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం ‘సర్దుబాటు’ పేరుతో ఉపాధ్యాయులను వివిధ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు చేసింది. పాలమూరు జిల్లాలో దాదాపు 35 నుంచి 50 మంది వరకు ఉపాధ్యాయులను వివిధ పాఠశాలల్లో తాత్కాలిక డిప్యూటేషన్లు ఇచ్చారు. వీటితో పాటు మిగతా జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొత్త ఉపాధ్యాయులు వచ్చే క్రమంలో ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంది. అభ్యర్థుల్లో ఆనందం ఆలస్యంగానైనా జాబితా విడుదల కావడంతో టీఆర్టీ అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎంతో కాలంగా ప్రభుత్వ బడుల్లో బోధించేందుకు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దసరా సెలువులు ముగిసే నాటికి టీచర్ల భర్తీకి సంబంధించి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తుదిజాబితా వచ్చింది ప్రభుత్వం కొన్ని రోజులుగా పెండింగ్లో పెట్టిన ఎస్జీటీల భర్తీకి సంబంధించిన తుది జాబితాను ప్రకటించింది. అయితే వీటి భర్తీకి కౌన్సెలింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్కు షెడ్యూల్ నేడు వచ్చే అవకాశం ఉంది. అయితే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు ఎంత మంది ఉపాధ్యాయులను కేటాయించారనే విషయంపై స్పష్టత ఇంకా రాలేదు. – నాంపల్లి రాజేష్, జిల్లా విద్యాశాఖ అధికారి -
నకిలీలలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పిల్లలకు మంచి విద్యాబుద్ధులు చెప్పి సన్మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయ వృత్తిలో కొందరు దారి తప్పిన వారు వస్తున్నారు.. ఉపాధ్యాయులను దైవంతో సమానంగా కొలిచే ఈ సమాజంలో కొందరు ఆ వృత్తికి వ్యక్తులు మాయని మచ్చ తెస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఉపాధ్యాయ కొలువులను సాధించిన వారి బాగోతాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అర్హత లేకపోయినా అక్రమ మార్గంలో కొలువులు పొందిన ‘దొంగ’ టీచర్లకు ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే గండేడ్ మండలానికి చెందిన 10 మంది ఉపాధ్యాయులు సర్వీస్ నుంచి తొలగించారు. అయితే తాజాగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మరో 84 మంది నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు సాధించినట్లు వెలుగు చూసింది. వీరిపై ఫిర్యాదులు అందడంతో విద్యాశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. అత్యాశ... అక్రమ మార్గం ప్రస్తుతం సర్కారు ఉద్యోగానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులోనూ ఉపాధ్యాయ పోస్టుకు ఉన్న పోటీ మరేదానికి ఉండదు. అయితే కొందరు అక్రమార్కులు తమ నేర ప్రవృతిని ఉపయోగించి తప్పుడు ధ్రువపత్రాల ద్వారా అర్హులకు తీరని అన్యాయం చేశారు. తాజాగా వారి అక్రమాలు ఆధారాలతో సహా వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాల పునర్విభజనకు ముందు రంగారెడ్డి జిల్లాలో అంతర్భాగమైన గండేడ్ మండలంలో నకిలీ టీచర్ల బాగోతం బయటపడింది. ఒక్క గండేడ్ మండలంలోనే దాదాపు 52 మంది నకిలీలు తిష్టవేశారు. వైకల్యం లేకపోయినా ఉన్నట్లుగా చూపించడం, తప్పుడు కులధ్రువీకరణ పత్రాలు, స్థానికేతురులైనా.. స్థానికులుగా చూపించి కొలువులు కొట్టేశారు. వీరి బాగోతం బయటపడగా విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులకు విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆస్పత్రుల నుంచి పొందిన సర్టిఫికెట్లతో పాటు తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందిన కులధ్రువీకరణ పత్రాలు సైతం నకిలీవేనని బయటపడింది. ఈ విషయం కాస్త కాస్తానిర్దారణ కావడంతో 10 మంది ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి తొలగించారు. కూపీ లాగితే... గండేడ్ మండలంలో వెలుగు చూసిన దొంగ కొలువుల వ్యవహారం నేపథ్యంలో మరింత కూపీ లాగితే మరికొందరి బాగోతం బయటపడుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చెవి, ముక్కు, గొంతు వ్యాధి ఉన్నట్లు నకిలీ సర్టిఫికెట్లు పొందుపరిచి ఉద్యోగాలు సాధించిన వారి పేర్లు బయటకొస్తున్నాయి. ముఖ్యంగా 2002 నుంచి 2012 వరకు జరిగిన డీఎస్సీల్లో పీహెచ్సీ కోటాలో ఉద్యోగాలు పొందిన వారి వివరాలను తెలంగాణ సమాచార హక్కుల వేదిక వెలికి తీసింది. గతంలో గండేడ్ మండలంలో 52 మంది బాగోతాలు వెలుగు చూడగా... తాజాగా మరో 84 మంది ఉన్నట్లు బయటకొచ్చింది. నకిలీ ఉపాధ్యాయులకు సంబంధించి సరిగ్గా నెల క్రితం వరకు 24 మంది ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 60.. ఆపై 84 చేరింది. దీనిపై తెలంగాణ సమాచారం హక్కుల వేదిక బాధ్యులు డీఈఓతో పాటు జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు. ఎక్కడెక్కడ... నకిలీ సర్టిఫికెట్లు, ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందిన వారు ఉమ్మడి జిల్లాలో 84 మంది ఉన్నట్లు అధికారులకు ఫిర్యాదు అందాయి. అందులో మక్తల్ మండలంలో 14 మంది, మహబూబ్నగర్ మండలంలో ఎనిమిది మంది, నర్వలో నలుగురు, ఊట్కూరు, మాగనూరు, అడ్డాకుల, బాలానగర్, హన్వాడలో ముగ్గురు చొప్పున విధులు నిర్వర్తిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకా దేవరకద్ర, కొల్లాపూర్, గండీడ్, నవాబ్పేట, జడ్చర్ల, వెల్దండ, పెద్దకొత్తపల్లి, తెల్కపల్లి, వనపర్తి, మాడ్గుల, తలకొండపల్లి, వీపనగండ్ల, నాగర్కర్నూల్లో ఇద్దరేసి చొప్పున, నారాయణపేట, కోస్గి, దౌల్తాబాద్, మద్దూరు, తిమ్మాజిపేట, వంగూరు, కోడేరు, ఖిల్లాఘనపురం, గద్వాల, గట్టు, ధరూరు, గోపాల్పేట, ధన్వాడ, కల్వకుర్తి, కోయిల్కొండ, ఉప్పునుంతలల్లో ఒకరు చొప్పున విధులు నిర్వర్తిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఆయా ఉపాధ్యాయుల విషయమై ప్రత్యేక అధికారులు విచారణ చేపడుతారు. విద్యాశాఖ నిర్ణయాల మేరకు నిర్ణయం నకిలీ ఉపాధ్యాయులు ఉన్నారంటూ తెలం గాణ సమాచార హక్కుల వేదిక ఆధ్వర్యాన ఫిర్యాదు చేశా రు. ఇటీవలి కాలంలో వివిధ మండలాలకు చెందిన 24 మంది పేర్లను అందజేశారు. అలాగే తాజాగా మరో 60 మంది పేర్లు ఇచ్చారు. వీరందరిపై విచారణ జరుపుతున్నాం. పీహెచ్సీ కోటాలో ఉద్యోగాలు సాధించిన వారి విషయమై మెడికల్ బోర్డు కు లేఖ రాశాం. డీఎస్సీ సందర్భంగా వారు అందజేసిన సర్టిఫికెట్లు వాస్తవమా, కాదా అని తేల్చాలని కోరాం. అక్కడి నుంచి నివేదిక రాగానే విద్యాశాఖ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం. గతంలో సర్వీస్ నుంచి తొలగించిన పది మంది విషయంలోనూ ఇదే పద్ధతి పాటించాం. – సోమిరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి -
ఆ 11మంది ఉపాధ్యాయులకు పోస్టింగ్లు
హైదరాబాద్ : పీఎస్లుగా ఉన్న 11మంది ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం పోస్టింగ్లు కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ విభాగానికి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్కు ములుగు మండలం క్షీరసాగర్లో పోస్టింగ్ ఇచ్చింది. కాగా ఉపాధ్యాయులను ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు పీఏ, పీఎస్లుగా కొనసాగేందుకు వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.. వారంలోగా పాఠశాలలకు వారిని కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం టీచర్లను పీఎస్లుగా తొలగించింది. వీరంతా అక్టోబర్ 1వ తేదీ నుంచి విధులకు హాజరు కావాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement