-
అంబేడ్కర్ చిత్రపటాన్ని కాల్పించిన టీచర్కు దేహశుద్ధి
పెదపులివర్రు (భట్టిప్రోలు): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని విద్యార్థులతో ముక్కలు చేయించి, కాల్పించిన ఉపాధ్యాయుడికి పెదపులివర్రు గ్రామస్తులు బుధవారం దేహశుద్ధి చేశారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రులోని నాదెళ్ల సుబ్బరాయచౌదరి ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు వి.నరసింహారావు ఏప్రిల్ 14న విద్యార్థులతో అంబేడ్కర్ చిత్రపటాన్ని ముక్కలు చేయించి, కాల్పించాడు. దీనిపై గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. హైస్కూల్ స్థాయిలో సమస్య పరిష్కారం కాలేదు. వేసవి సెలవుల అనంతరం పాఠశాల పునః ప్రారంభమైనా సమస్య పరిష్కారమవలేదు. దీంతో గ్రామస్తులు ఆగ్రహించారు. ఉపాధ్యాయుడు నరసింహారావుకు బుధవారం దేహశుద్ధి చేశారు. గొరిగపూడి పంచాయతీ వరికూటివారిపాలేనికి చెందిన నరసింహారావు మొదటి నుంచీ ఎస్సీ విద్యార్థులపై వివక్ష చూపే వాడని, చితకబాదేవాడని గ్రామస్తులు ఆరోపించారు. విద్యార్థుల మధ్య కుల చిచ్చు పెడతాడని తెలిపారు. పోలీసులు గ్రామానికి చేరుకు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని హైస్కూల్ గదిలో ఉంచారు. బాపట్ల డిప్యూటీ డీఈవో ఎం. వెంకటేశ్వర్లు కూడా అక్కడికి వచ్చి గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయుడు నరసింహారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని విద్యా శాఖాధికారులు ప్రకటించారు. ఇందుకు గ్రామస్తులు ససేమిరా అన్నారు. అంబేడ్కర్ చిత్రపటాన్ని ముక్కలు చేసి కాల్పించిన ఉపాధ్యాయుడిని విధుల నుంచి పూర్తిగా తొలగించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రిసిటీ యాక్ట్ – 2015 ప్రకారం కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడిచే అంబేడ్కర్ విగ్రహం వద్ద పాలాభిషేకం చేయించి, క్షమాపణ చెప్పించాలని గ్రామస్తులు భీష్మించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సాయంత్రం 6:30 గంటలకు బాపట్ల డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు అక్కడికి చేరుకున్నారు. రాత్రి 8:30 గంటల వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు పోలీసులు గ్రామస్తులను చెల్లా చెదురు చేశారు. ఆ తరువాత ఉపాధ్యాయుడు నరసింహారావును పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కేసు దర్యాప్తునకు జిల్లాస్థాయి ప్రత్యేక అధికారిని నియమించాలని రాష్ట్ర మాల మహానాడు ప్రధాన కార్యదర్శి బుస్సా నాగరాజు, వేమూరు నియోజకవర్గ కన్వీనర్ గద్దె యతీష్, ఆలిండియా షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర కార్యదర్శి యన్నం సురేష్ డిమాండ్ చేశారు. నరసింహారావుకు సహకరించిన మరో పీఈటీ వి.శ్రీనివాసరావుపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. -
విద్యార్థినుల పట్ల వెకిలిచేష్టలు
- మొన్న ఎంఈఓ.. నేడు ఉపాధ్యాయుడు హిందూపురం అర్బన్ : పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు కొందరు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. గురువు స్థానానికి కలంకం తెస్తున్నారు. ఇటీవల ఎంఈఓ ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి జైలుపాలయ్యారు. ఆ ఉదంతం మరవకముందే మంగళవారం మోడల్కాలనీలో సర్థార్ వల్లభాయ్ పటేల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంగ్లిష్ సబ్జెక్టు ఉపాధ్యాయుడు మల్లికార్జున నాయక్ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. సాయంత్రం స్కూల్ కమిటీ సమావేశం జరుగుతుండటంతో అక్కడికి బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు వచ్చారు. వీరి రాకను ముందుగానే పసిగట్టిన సదరు ఉపాధ్యాయుడు అక్కడి నుంచి జారుకున్నాడు. ఉపాధ్యాయుడు వెకిలి చేష్టలు చేస్తూ ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడుతున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు స్కూల్ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే తామే బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం టూటౌన్ పోలీసులకు సమాచారం అందడంతో స్కూలుకు వచ్చి విచారణ చేశారు. తమకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సీఐ మధుభూషణ్ చెప్పారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
మీ ఇంటి ఆడబిడ్డను ఆశీర్వదించండి
కాంగ్రెస్ మాయమాటలకు మోసపోవద్దు
ఆదరించండి.. అభివృద్ధి చేస్తా
ప్రాణం తీసిన మామిడి కాయల గొడవ
బీజేపీ అనుకూల పార్టీలను ఓడించాలి
ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి..
ఉరేసుకొని వ్యక్తి మృతి
ఆర్ఎస్పీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
మెరుగైన వైద్యసేవలు అందించాలి
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement