breaking news
tatkal scheme
-
AP: ఇంటర్ ఫీజు చెల్లింపునకు తత్కాల్ అవకాశం
సాక్షి, అమరావతి: మార్చి ఒకటో తేదీనుంచి జరిగే ఇంటర్మీడియట్ (Intermediate) పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు తత్కాల్ (Tatkal Scheme) కింద అవకాశం కల్పించారు. అభ్యర్థులు రూ.3 వేల ఆలస్య రుసుంతో మంగళవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంజనవరి నుంచి 1,48,923 మంది ఇంటర్ విద్యార్థులకు భోజనం పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (Midday Meal) అందించేందుకు సమగ్ర శిక్ష విభాగం ఏర్పాట్లు చేసింది. మొత్తం 475 కాలేజీల్లో 398 కాలేజీలకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో భోజనం అందిస్తున్న ఏజెన్సీలకు అప్పగించారు. మరో 77 కాలేజీలకు ఎన్జీవోల ద్వారా భోజనం సరఫరా చేయనున్నారు.రాష్ట్ర వర్సిటీలు, ప్రభుత్వ కాలేజీలకు రూ.100 కోట్లుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్షాభియాన్ (పీఎం–ఉష)లో భాగంగా దేశంలోని పలు విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించింది. వర్సిటీలకు అవసరమైన ల్యాబ్స్, మౌలిక సదుపాయాల కల్పన కోసం గత విద్యాసంవత్సరం (2023)లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఇప్పుడు నిధులు మంజూరుచేసింది. ఈ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కేంద్రం త్వరలో మార్గదర్శకాలు ఇవ్వనుంది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (పేరెంట్స్ కమిటీ)లకు ఒక్కరోజు శిక్షణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొత్తం 45,124 పాఠశాలలకు సంబంధించి జిల్లా, మండల, పాఠశాల స్థాయిల్లో ఈ శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయిలోనూ, 31 నుంచి జనవరి 2 వరకు మండల స్థాయిలోనూ, 3 నుంచి 6వ తేదీ వరకు పాఠశాల స్థాయిలోనూ శిక్షణ నిర్వహించాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు డీఈవోలను ఆదేశించారు. కాగా, జిల్లా స్థాయిలో 3,765 మందికి, మండల స్థాయిలో 93,643 మంది శిక్షణకు గానూ రూ.1,92,80,070 నిధులు మంజూరు చేశారు. నాన్ టీచింగ్ సిబ్బందికి జేఎల్ పదోన్నతులుప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2024–25 విద్యా సంవత్సరం ప్యానల్ సంవత్సరానికి బోధనేతర సిబ్బందికి 10 శాతం కోటా కింద ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న జేఎల్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించాలని ఇంటర్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా సోమవారం ఆర్జేడీలను ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అభ్యంతరాలను నమోదు చేయాలని సూచించారు. వీటిపై ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి తుది సీనియారిటీ జాబితాను పంపించాలన్నారు. కాగా, ఇదే కేటగిరీ కింద ఇటీవల 24 మంది నాన్ టీచింగ్ సిబ్బందికి ఒకేషనల్ జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించారు. -
‘తత్కాల్’ పాస్పోర్టులకు అటెస్టేషన్ అవసరం లేదు
-
మూడ్రోజుల్లో పాస్పోర్టు మంజూరు
మర్రిపాలెం (విశాఖ ఉత్తరం): గణతంత్ర దినోత్సవం సందర్భంగా సులభంగా పాస్పోర్ట్ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని విశాఖపట్నం ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి తెలిపారు. అభ్యర్థులు మూడ్రోజుల్లో పాస్పోర్ట్ పొందేందుకు తత్కాల్ విభాగంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఆధార్, స్వీయ ధ్రువీకరణ పత్రం (అనెక్సార్–ఈ) సమర్పించాలన్నారు. వీటితో పాటు ఏవైనా రెండు.. ఓటర్ కార్డు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రం, ఆర్మ్డ్ లైసెన్స్, మాజీ సైనికుల పెన్షన్ బుక్, సెల్ఫ్ పాస్పోర్ట్, పాన్కార్డు, విద్యాలయాలు జారీ చేసిన విద్యార్థి గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, రిజిస్ట్రార్ జారీ చేసి జనన ధ్రువీకరణ పత్రం తప్పక కలిగి ఉండాలన్నారు. 18 ఏళ్ల లోపు వారైతే ఆధార్తో పాటు విద్యార్థి గుర్తింపు కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు ఏదైనా ఒకటి సమర్పించాలని సూచించారు. సాధారణ పాస్పోర్ట్ మంజూరుకు ఆయా ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకుంటే పాస్పోర్ట్ మంజూరు చేస్తామన్నారు. అనంతరం పోలీస్ విచారణ ఉంటుందన్నారు. అయితే దీనికి ఎలాంటి అత్యవసర పత్రాలు, ‘అనెక్సార్–బి’ అవసరం లేదని ఆయన తెలిపారు. -
నేటి నుంచి తత్కాల్ స్కీం ద్వారా ఫీజు చెల్లింపు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా ఏప్రిల్లో జరిగే పదోతరగతి, ఇంటర్ పరీక్షలకు సంబంధించి పరీక్షల ఫీజులు చెల్లించేందుకు శుక్రవారంతో గడువు ముగిసింది. అయితే తత్కాల్ స్కీం కింద శనివారం నుంచి ఈనెల 13 వరకు ఫీజు చెల్లించేందుకు మరో అవకాశం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. -
పదో తరగతి 'తత్కాల్ ఫీజు' గడువు పొడిగింపు
హైదరాబాద్: ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు తత్కాల్ స్కీమ్ కింద పరీక్ష ఫీజు చెల్లించే గడువును ఈ నెల 18 వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్ ఎం.ఆర్.ప్రసన్నకుమార్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తత్కాల్ స్కీము కింద రూ.1000 ఆలస్య రుసుముతో పదో తరగతి పరీక్ష ఫీజును చెల్లించవచ్చని సూచించారు. రెగ్యులర్, ఒకసారి ఫెయిలైనవారు, ప్రైవేటు అభ్యర్ధులు ఈ తత్కాల్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.