థియేటర్స్లోకి ‘సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్’
తెలుగు ప్రేక్షకుల ముందుకు చాలా రోజుల తర్వాత ఓ సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్ రాబోతోంది. శ్రీ శివ సాయి ఫిలిం బ్యానర్పై వెంకట్ రెడ్డి నంది స్వీయ దర్శకత్వం లో శ్రీకరణ్, అనూష, షన్ను హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘తారకేశ్వరి’. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ బోర్డు సభ్యుల నుండి ప్రశంసలు అందుకున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ హైదరాబాద్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ప్రెస్ మీట్ నిర్వహించి కేక్ కట్ చేస్తూ సంబరాలు జరుపుకుంది.ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత వెంకట్ రెడ్డి నంది మాట్లాడుతూ – “నా టీమ్ నాకు అండగా నిలిచింది. అందుకే ఈ తరహా సినిమాలు చేయగలుగుతున్నాను. సినిమా పట్ల అందరి కృషి, ప్రేమతోనే ఈ స్థాయికి వచ్చింది. అక్టోబర్ 26న ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. నవంబర్ 7న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రేక్షకుల ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం” అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ రాము మాట్లాడుతూ – “ఈ సినిమాకి మ్యూజిక్ చాలా చక్కగా కుదిరింది. వెంకట్ రెడ్డి గారి 16 సినిమాల్లో సగానికి పైగా నేను సంగీతం సమకూర్చాను. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే తృప్తి ఉంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను” అన్నారు.హీరో శ్రీకరణ్ మాట్లాడుతూ – “ఈ సినిమా ఓ పల్లెటూరిలో జరిగిన యథార్థ గాథ ఆధారంగా తెరకెక్కింది. గ్రామీణ వాతావరణంలో జరిగిన షూటింగ్ మరిచిపోలేని అనుభవం. వెంకట్ రెడ్డి నంది గారు మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. కథ ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. నవంబర్ 7న థియేటర్లలో కలుద్దాం” అన్నారు.