breaking news
Tamil Nadu Special Police
-
ఖాకీల కక్కుర్తి.. సీసీటీవీలో బుక్కు
చెన్నై: తమిళనాడులో ముగ్గురు కానిస్టేబుళ్లు కక్కుర్తి పడ్డారు. ఓ కూలీ చేసుకొని బతికే వ్యక్తి దగ్గర దొంగతనానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరితోనైనా చెబితే అతడిపై దొంగతనం కేసు పెడతామంటూ హెచ్చరించారు. ఎట్టకేలకు పోలీసులు ఆ ముగ్గురుని అరెస్టు చేసి జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. జే ఇరుదయరాజ్, జే అరుల్దాస్, ఎస్ రామకృష్ణ అనే ముగ్గురు కానిస్టేబుళ్లు ప్రత్యేక విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ముగ్గురు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫామ్పై పడుకున్న ఓ కూలీ దగ్గరకు వెళ్లారు. కూలీ నాలి చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్న అతడు ఉదయాన్నే కేరళకు రైలెక్కాల్సి ఉంది. అయితే, అతడిని బెదిరించిన ఆ ముగ్గురు అతడి దగ్గర నుంచి పర్సు(అందులో రూ.1800 ఉన్నాయి), రూ.16వేల విలువైన సెల్ఫోన్, అతడి వాచ్ తీసుకున్నారు. అయితే, కనీసం తను ఊరెళ్లెందుకు ఒక రూ.300 ఇవ్వాలని బతిమిలాడుకోవడంతో ఇచ్చి వెళ్లిపోయారు. అయితే, ఈ విషయం అతడు పోలీసులకు చెప్పడంతో వారు విచారణ ప్రారంభించి సీసీటీవీ ఫుటేజీ సేకరించారు. అలాగే, అక్కడే ఉన్న కొంతమంది రిక్షా కార్మికుల వద్ద వివరాలు తెలుసుకొని ఆ ముగ్గురు కానిస్టేబుల్స్ను అరెస్టు చేశారు. నేరం రుజువైతే వారికి పదేళ్ల వరకు జైలు శిక్షపడనుంది. -
పుంగనూరులో తమిళనాడు పోలీసులు తనిఖీలు
చిత్తూరు జిల్లా పుత్తూరులో ఇటీవల అల్ ఉమా సంస్థకు చెందిన తీవ్రవాదులు పట్టుబడిన నేపథ్యంలో పుంగనూరులో గత అర్థరాత్రి నుంచి తమిళనాడు పోలీసులు సోదాలు నిర్వహించారు. పుంగనూరులోని నక్కబండ కాలనీలో ప్రతి ఇంటిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందుకోసం పుంగనూరులో తమిళనాడు ప్రత్యేక పోలీసు బలగాలు భారీగా మోహరించారు. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అల్ ఉమా తీవ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు తీవ్రవాదులను తమిళనాడులోని తిరువళ్లూరు పోలీసులు నాలుగురోజుల క్రితం పుత్తూరులో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తిరుమల బ్రహ్మోత్సవాలలో బాంబు పేలుళ్లు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు తీవ్రవాదులు తమ విచారణలో వెల్లడించారని తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించిన విషయం విదితమే.