-
అతిపెద్ద ఇంక్యుబేటర్ టీహబ్పై రతన్ టాటా స్పందన
సాక్షి,హైదరాబాద్: తెలంగాణాలో ప్రతిష్టాత్మక టీ-హబ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీహబ్గా ఐటీ హబ్ అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం లాంచ్ చేయనున్నారు. ఈ ఇంక్యుబేటర్ ప్రారంభోత్సవంపై ఇప్పటికే చాలామంది రాజకీయ, వాణిజ్యరంగ ప్రముఖులతోపాటు క్రీడా, సినీరంగ సెలబ్రిటీలు స్పందించారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూపు అధినేత రతన్ టాటా సోషల్మీడియాలో స్పందించడం విశేషంగా నిలిచింది. హైదరాబాద్లో టీ హబ్పై దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జాబితాలో రతన్ టాటా కూడా నిలిచారు. ఇది భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్కు భారీ ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు ట్విటర్ పోస్ట్కు స్పందించిన టాటా టీహబ్ను ప్రశంసించారు. ఈ సందర్భంగా తెలంగాణా సీఎం కేసీఆర్కు, ప్రభుత్వానికి టాటా అభినందనలు తెలిపారు. కాగా హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్కు భారీ ఊరటనిచ్చేలా కొత్త టీ-హబ్ను జూన్ 28న కేసీఆర్ ప్రారంభిస్తారంటూ కేటీఆర్ ఆదివారం ట్వీట్ చేసిన సంగతి తెలిసందే. దీనిపై నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్, టాలీవుడ్ యాక్టర్స్ విజయ్ దేవరకొండ, సమంతా రూత్ ప్రభు, మహేష్ బాబుతో సహా పలువురు ప్రముఖులు కొత్త టీ-హబ్ పై ప్రశంసలు కురిపించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Congratulations to the Government of Telangana and Chief Minister K. Chandrashekar Rao on its new T-hub facility in Hyderabad, which will be a great boost to the Indian startup ecosystem. https://t.co/XppHITrRl7 — Ratan N. Tata (@RNTata2000) June 28, 2022 One of our biggest achievements of the last 8 years of Telangana …under the leadership of Minister @KTRTRS …getting dedicated to the nation on 28th June pic.twitter.com/ygw2nwco0B — Jayesh Ranjan (@jayesh_ranjan) June 27, 2022 -
స్టార్టప్స్కు బాసటగా తెలంగాణ ప్రభుత్వం
♦ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ♦ వ్యయాల్లో కొంత భరించాలని యోచన హైదరాబాద్, బిజినె స్ బ్యూరో : దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్ టి-హబ్ను ఏర్పాటు చేసి స్టార్టప్స్ను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మరింత మంది ఔత్సాహికులకు బాసటగా నిలవాలని నిర్ణయించింది. అద్దె, విద్యుత్ చార్జీలు, ఇంటర్నెట్ వ్యయాల్లో కొంత మొతాన్ని భరించాలని యోచిస్తున్నట్టు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) వెల్లడించారు. టి-హబ్ వెలుపల ఉన్న ఇతర ఇంక్యుబేటర్లు, కార్యాలయాల్లోని స్టార్టప్స్కు తోడ్పాటు అందించి వాటి అభివృద్ధిలో పాలుపంచుకుంటామని చెప్పారు. గచ్చిబౌలిలో జేడ్ గ్లోబల్ ఏర్పాటు చేసిన డెవలప్మెంట్ సెంటర్ను శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ ఎస్ఎంఈల కోసం ఎస్ఎంఈ టవర్ను గచ్చిబౌలిలో నెలకొల్పుతామని పేర్కొన్నారు. హైదరాబాద్లో 50 ఎకరాల్లో ఏర్పాటు కానున్న డేటా అనలిటిక్స్ పార్కులో ఫ్రాక్టల్ అనలిటిక్స్ యాంకర్ యూనిట్గా వస్తోందని చెప్పారు. రంగాల వారీగా పునరుద్ధరణ..: ఖాయిలాపడ్డ కంపెనీలను రంగాల వారీగా పునరుద్ధరించనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఫెర్రోఅల్లాయ్ పరిశ్రమలకు విద్యుత్ చార్జీల్లో డిస్కౌంట్ ఇచ్చి ఆదుకున్నామని గుర్తు చేశారు. మైనింగ్, స్పిన్నింగ్ రంగ కంపెనీలు కూడా ప్రభుత్వ సాయం కోసం చూస్తున్నాయన్నారు. ‘ఔటర్కు లోపల కాలుష్యాన్ని వెదజల్లే 1,234 కంపెనీలను రెడ్, ఆరెంజ్ కేటగిరీలో గుర్తించాం. దశలవారీగా రంగాన్నిబట్టి ఈ కంపెనీలను ఓఆర్ఆర్ వెలుపలకు పంపిస్తాం. మౌలిక వసతులు ఉంటే కంపెనీలు తరలి వెళ్తాయని, కాబట్టి పీపీపీ విధానంలో పారిశ్రామిక పార్కులను ప్రోత్సిహ స్తామని అన్నారు. ఎస్ఎంఈలకు రుణ సాయం.. హైదరాబాద్లోని 1,300లకుపైగా ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల్లో 90 శాతం ఎస్ఎంఈలే. మొత్తం 4 లక్షల మందికిపైగా ఉద్యోగుల్లో 2.5 లక్షల మంది ఈ ఎస్ఎంఈల్లో పనిచేస్తున్నారు. అవసరమైనన్ని నిధుల సేకరణ లో ఈ రంగ కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వీటి వృద్ధికి నిధుల లేమి అడ్డంకిగా మారింది. ఈ కంపెనీలకు ఆర్థిక సహాయం అందించే విషయమై కోటక్ మహీంద్రా, సిడ్బీతో చర్చించినట్టు కేటీఆర్ తెలిపారు. ప్రైవేటు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి ఈ కంపెనీలకు తనఖా లేని రుణం ఇప్పించాలన్నది ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. హైదరాబాద్లో జేడ్ గ్లోబల్.. యూఎస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ కంపెనీ జేడ్ గ్లోబల్ హైదరాబాద్లో డెవలప్మెంట్ సెంటర్ను గచ్చిబౌలిలో నెలకొల్పింది. ఇప్పటికే కంపెనీకి యూఎస్, యూకేతోపాటు పుణే, నోయిడాలో ఆఫీసులున్నాయి. తమ సంస్థలో 550 మంది పనిచేస్తున్నారని కంపెనీ సీఈవో వై.కరణ్ ఈ సందర్భంగా తెలిపారు. హైదరాబాద్లో ప్రస్తుతం 50 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంఖ్యను డిసెంబరుకల్లా 100కు చేరుస్తామని చెప్పారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement