పడిపోయిన భారత్ ర్యాంక్
ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక వన్డే ర్యాంకింగ్స్లో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా (124) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, న్యూజిలాండ్ (113), దక్షిణాఫ్రికా (112) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2013-14 ఏడాదిలో ఫలితాలను పక్కనబెట్టి 2014-15లో జట్లు సాధించిన విజయాల్లో 50 శాతాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ వార్షిక ర్యాంక్లను కేటాయించారు. టి20 ర్యాంకింగ్స్లో భారత్, న్యూజిలాండ్ సమాన పాయింట్ల (132)తో నిలిచినా... దశాంశమానం (+0.21) తేడాతో టీమిండియా రెండో ర్యాంక్కు పడిపోయింది.
ఈ వార్షిక ర్యాంకింగ్స్లో కివీస్ 11 పాయింట్లు కూడగట్టుకోవడం విశేషం. 2016 టి20 చాంపియన్ వెస్టిండీస్ (122) మూడు రేటింగ్ పాయింట్లు కోల్పోయి మూడో స్థానానికి పరిమితమైంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ టాప్-10లో ఉన్నాయి.