breaking news
Syamala rao
-
అంతా బోగస్.. సంచలన నిజాలు బయటపెట్టిన టీటీడీ ఈవో..
-
తిరుమల లడ్డుపై చంద్రబాబు కుట్ర.. బయటపెట్టిన టీటీడీ ఈఓ
-
రాజధాని అభివృద్ధి కమిటీ విధి విధానాలు ఖరారు
సాక్షి, అమరావతి: రాజధానితో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాన, సమగ్రాభివృద్ధి కోసం ఇటీవల నియమించిన ఉన్నత స్థాయి కమిటీకి సంబంధించి ప్రభుత్వం విధివిధానాలు, అధికారాలను ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం మునిసిపల్ శాఖ కార్యదర్శి జె శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ రాష్ట్రంలో ఏ అధికారితోనైనా సంప్రదింపులు జరిపి చర్చించవచ్చు. అవసరమైన సమాచారాన్ని తెప్పించుకుని విశ్లేషించవచ్చు. క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించవచ్చు. రాష్ట్రంలో వివిధ వర్గాల వారితో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. ప్రజా ప్రతినిధుల నుంచి, వివిధ వర్గాల సాధారణ ప్రజల నుంచి, ఆన్లైన్ ద్వారా సమాచారం పొందవచ్చు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం, డాక్యుమెంట్లనైనా తెప్పించుకుని విశ్లేషించేలా ఈ కమిటీకి ప్రభుత్వం అధికారాలను కల్పించింది. కమిటీ కన్వీనర్, సభ్యులకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా ఇచ్చారు. వసతి, వాహన సౌకర్యం కల్పిస్తారు. కమిటీకి కార్యాలయం ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బంది కేటాయింపు బాధ్యతను సీఆర్డీఏకు అప్పగించారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్ విజయకృష్ణన్ ఈ కమిటీకి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. కమిటీ జిల్లాల పర్యటన సందర్భంగా కలెక్టర్లు సమన్వయ బాధ్యత నిర్వహించాల్సి ఉంటుంది. కమిటీకి అవసరమైన నిధులు సీఆర్డీఏ నుంచి సర్దుబాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. మున్సిపల్ కార్యదర్శితో సంప్రదింపులు జరిపిన తేదీ నుంచి ఆరు వారాల్లోగా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. -
రాష్ట్రంలో 43 మంది సీటీవోల బదిలీ
తిరుపతి రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 43 మంది వాణిజ్య పన్నుల శాఖాధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖా కమిషనర్ శ్యామలారావు సోమవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. సీటీవోల బదిలీల్లో ఈసారి కమిషనర్ డిపార్ట్మెంట్ పోర్టల్ ద్వారా అధికారుల నుంచి వినతులను స్వీకరించారు. ఐదేళ్లు పూర్తి అయిన వారిని తప్పనిసరిగానూ, మూడేళ్లు నిండిన వారిని వినతుల ద్వారా బదిలీ చేశారు. సీటీవో ర్యాంకులో ఒకేసారి 43 మందిని డిపార్ట్మెంట్ పోర్టల్ ద్వారా బదిలీ చేయడం రాష్ట్రంలో ఇదే ప్రథమం. బదిలీ అయిన అధికారులు రెండు రోజుల్లో విధుల్లో చేరాలని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.