breaking news
sworn as a Chief Minister
-
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సుఖ్వీందర్ సింగ్ సుఖ్
-
బిహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం నితీశ్కు ఇది ఏడోసారి. 2005 నవంబర్ నుంచి, మధ్యలో స్వల్పకాలం మినహాయించి, నితీశ్ బిహార్ సీఎంగా కొనసాగుతున్నారు. 2014 మే నుంచి 2015 ఫిబ్రవరి వరకు జితన్ రామ్ మాంఝీ రాష్ట్ర సీఎంగా ఉన్నారు. బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఎన్డీయే మిత్రపక్ష నాయకుల సమక్షంలో రాజ్భవన్లో నితీశ్తో గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించిన విషయం తెలిసిందే. నితీశ్తో పాటు 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో బీజేపీకి చెందిన తార్కిషోర్ ప్రసాద్, రేణుదేవి ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. బీజేపీ నుంచి ఏడుగురు, జేడీయూ నుంచి ఐదుగురు, హెచ్ఏఎం, వీఐపీల నుంచి ఒక్కొక్కరు చొప్పున తాజా మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. హెచ్ఏఎం నుంచి మాజీ సీఎం జితన్రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్(ఎంఎల్సీ), వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) నుంచి ఆ పార్టీ చీఫ్ ముకేశ్ సాహ్నీ మంత్రులుగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ స్పీకర్గా ఈసారి బీజేపీ నేత నందకిషోర్ యాదవ్కు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. 2000లో తొలిసారి నితీశ్కుమార్ బిహార్ సీఎంగా తొలిసారి 2000లో బాధ్యతలు చేపట్టారు. మెజారిటీ నిరూపించుకోలేక వారం రోజుల్లోపే రాజీనామా చేశారు. ఐదేళ్ల తరువాత, జేడీయూ– బీజేపీ కూటమి మెజారిటీ సాధించడంతో రెండోసారి సీఎం అయ్యారు. 2010లో అదే కూటమి ఘన విజయంతో మూడో సారి సీఎం పీఠం అధిష్టించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత, 2015 ఫిబ్రవరిలో మళ్లీ సీఎం అయ్యారు. 2015 నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్లతో కలిసి జేడీయూ పోటీ చేసి విజయం సాధించడంతో నితీశ్ మరోసారి సీఎం అయ్యారు. అయితే, ఆర్జేడీతో విభేదాల కారణంగా 2017లో సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం, 24 గంటల్లోపే బీజేపీతో మరోసారి జట్టు కట్టి ఆరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. బిహార్ సీఎంగా అత్యధిక కాలం కొనసాగిన ఘనత శ్రీకృష్ణ సింగ్ పేరిట ఉంది. స్వాతంత్య్ర పూర్వం నుంచి 1961లో చనిపోయేవరకు ఆయన సీఎంగా ఉన్నారు. ఇలా ఉండగా, కొత్త సీఎం నితీశ్కు అభినందనలు తెలుపుతూనే.. ఐదేళ్లు ఎన్డీయే ముఖ్యమంత్రిగానే నితీశ్ కొనసాగుతారని ఆశిస్తున్నట్లు లోక్జనశక్తి పార్టీ ప్రెసిడెంట్ చిరాగ్ పాశ్వాన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. నితీశ్కుమార్ బీజేపీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అని కొత్త సీఎం నితీశ్కు మాజీ సహచరుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చురకలంటించారు. రాజకీయంగా అలసి పోయిన నేత ముఖ్యమంత్రిత్వంలో ప్రజలు నీరసపాలన అనుభవించక తప్పదన్నారు. ప్రధాని అభినందనలు న్యూఢిల్లీ: బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీయే కుటుంబం కలసికట్టుగా కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం కేంద్రం తరఫున సాధ్యమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రులుగా ప్రమాణం చేసిన నాయకులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. -
నేడు సీఎంగా హేమంత్ ప్రమాణం
న్యూఢిల్లీ/రాంచీ: హేమంత్ సోరెన్ నేతృత్వంలో జార్ఖండ్లో నూతన ప్రభుత్వం ఆదివారం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్తో పాటు కాంగ్రెస్, ఆర్జేడీల నుంచి ఒక్కొక్క మంత్రి చొప్పున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా, (జేఎంఎం) దాని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)ల్లో మంత్రుల ఎంపిక ఖరారైనట్లు తెలిసింది. దీని ప్రకారం జేఎంఎం నుంచి ఆరుగురికి, కాంగ్రెస్ నుంచి నలుగురికి, ఆర్జేడీ నుంచి ఒకరికి మంత్రి పదవులు ఖరారయ్యాయి. కాంగ్రెస్కు అసెంబ్లీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం. లేదా మరో మంత్రి పదవి వరించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో జేఎంఎం 30 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 స్థానం గెలుచుకున్నాయి. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని వెల్లడించాయి. కాగా, కాంగ్రెస్లో ఆ పార్టీ సీనియర్ నేతలు అలాంగిర్ ఆలం, రామేశ్వర్ ఓరాన్, రాజేంద్ర ప్రసాద్ సింగ్లకు మంత్రి పదవులు దాదాపు ఖరారయ్యారని, మరొకరిని ఎంపిక చేయాల్సి ఉందన్నాయి. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ముఖ్యమంత్రులు కమల్నాథ్ (మధ్యప్రదేశ్), భూపేశ్ బఘేల్ (ఛత్తీస్గఢ్), అశోక్ గెహ్లోత్ (రాజస్తాన్), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), ఉద్ధవ్ ఠాక్రే (మహారాష్ట్ర), అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), హాజరుకానున్నారు. -
యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం..
►ఉత్తరప్రదేశ్ 21వ సీఎంగా ప్రమాణస్వీకారం ►47 మంది మంత్రులతో కొలువుదీరిన కేబినెట్ ►హాజరైన మోదీ, అమిత్షా, ములాయం, అఖిలేశ్ లక్నో: ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా హిందుత్వవాది యోగి ఆదిత్యనాథ్(44) ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఉత్తరప్రదేశ్ గవర్నర్ రాంనాయక్ ప్రమాణస్వీకారం చేయించారు. యోగి ఆదిత్యనాథ్తో పాటు 47 మంది సభ్యుల మంత్రిమండలి కొలువుదీరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దినేశ్ శర్మ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. ఆశ్చర్యకరంగా క్రికెట్ నుంచి రాజకీయాల వైపు వచ్చిన మెహసిన్ రజాకు కేబినెట్లో చోటు దక్కడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థినీ రంగంలోకి దించలేదు. దీంతో రజాను మంత్రి పదవి వరించింది. ప్రస్తుత కేబినెట్లో ఏకైక ముస్లిం మంత్రి ఆయనే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, మెహసిన్ రజా నలుగురూ కూడా యూపీ ఉభయ సభల్లో సభ్యులు కాకపోవడం విశేషం. 47 మందితో కేబినెట్.. డిప్యూటీ సీఎంలతో కలిపి 24 మందికి కేబినెట్ హోదా.. తొమ్మిది మందికి స్వతంత్ర హోదా.. మరో 13 మందికి సహాయ మంత్రుల హోదా లభించింది. యోగి కేబినెట్లో ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రీటా బహుగుణ జోషితో పాటు ఐదుగురు మహిళలకు చోటు దక్కింది. లక్నోలోని కాన్షీరాం స్మృతి ఉపవన్లో 90 నిమిషాల పాటు అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీతో పాటు సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం, మాజీ సీఎం అఖిలేశ్యాదవ్ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం యోగి ఆదిత్యనాథ్ కొత్తగా నిర్మించిన లోక్ భవన్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 15 ఏళ్ల తర్వాత కాషాయ రెపరెపలు.. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో 15 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. యోగి ఆ పార్టీ తరఫున నాలుగో ముఖ్యమంత్రి. ఆదిత్యనాథ్కంటే ముందు బీజేపీ తరఫున కల్యాణ్సింగ్, రామ్ప్రకాశ్ గుప్తా, రాజ్నాథ్సింగ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్గా ఉన్న కల్యాణ్సింగ్ రెండు సార్లు సీఎంగా పనిచేశారు. మా ప్రమేయం లేదు: ఆర్ఎస్ఎస్ ఆదిత్యనాథ్ను యూపీ సీఎంగా ఎంపిక చేయడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే ఐదు సార్లు ఎంపీగా పనిచేసిన యోగి ఆదిత్యనాథ్కు పెద్దగా పాలనా పరమైన అనుభవం లేకపోవడం ప్రతికూలాంశం. బీజేపీ అగ్రనాయకత్వానికి సన్నిహితుడైన యోగి ఆదిత్యనాథ్ ఎంపికతో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి వి.భాగయ్య ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయపరమైన నిర్ణయమని, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల ఎంపికలో ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కలుగజేసుకోలేదన్నారు. హాజరైన చంద్రబాబు సాక్షి, అమరావతి: యోగి ప్రమాణానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో కలిసి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన లక్నో వెళ్లారు.∙సాయంత్రం తిరిగి విజయవాడ చేరుకున్నారు. వివక్ష లేని అభివృద్ధే లక్ష్యం: ఆదిత్యనాథ్ లక్నో: ఎలాంటి వివక్ష లేకుండా అన్ని వర్గాల అభివృద్ధి కోసం కొత్త ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం ఆదిత్యనాథ్ అన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ను అనుసరిస్తూ యూపీ సమతుల్య అభివృద్ధి కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు అవినీతి, బంధుప్రీతికి పాల్పడడంతో పాటు, శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమవడంతో.. 15 ఏళ్లుగా అభివృద్ధి పరుగులో యూపీ వెనకబడిందని చెప్పారు. అధికార యంత్రాంగం చురుగ్గా పనిచేసేలా, జవాబుదారీగా ఉండేలా చేస్తామని, శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇస్తామని హామీనిచ్చారు. యువతకు నైపుణ్య శిక్షణపై దృష్టి పెడతామని, అప్పుడే వారు ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారనిపేర్కొన్నారు. ప్రభుత్వ నియామకాల్లో అవినీతి లేకుండా చేస్తామన్నారు. అభివృద్ధి, భద్రత కోసం ప్రజలు బీజేపీకి ఓటేశారని త్వరలో సానుకూల ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 15 రోజుల్లోగా మంత్రులందరూ ఆదాయ వివరాల్ని అందచేయాలనిఆదేశించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రుల పరిచయ కార్యక్రమంలో ఆయన ఈ ఆదేశాలిచ్చారు. సమతుల యూపీ కేబినెట్ లక్నో: కేబినెట్లో అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల వారికి సీఎం ఆదిత్యనాథ్ సమాన ప్రాతినిధ్యం కల్పించారు. 47 మందితో కూడిన కేబినెట్లో ముగ్గురు దళితులు, 26 మంది అగ్రవర్ణాల వారు, ఒకరు ముస్లిం కాగా, మిగిలిన వారు ఓబీసీసీలు. ఇద్దరు డిప్యూటీ సీఎంల ఎంపిక కూడా సమతుల్యంతో ఉంది. సీఎం రాజ్పుత్ కాగా, కేశవ్ ప్రసాద్ మౌర్య ఓబీసీ, దినేశ్ శర్మ బ్రాహ్మణ వర్గానికి చెందినవారు. దళిత నేత ఎస్పీ సింగ్ బాఘెల్కు కేబినెట్లో చోటిచ్చారు. ఎన్నికల్లో ఒక్క ముస్లింకూ టికెట్లివ్వని బీజేపీ.. మాజీ క్రికెటర్ మొహసిన్ రజాకు మైనారిటీ వ్యవహారాలు, హజ్, వక్ఫ్ మంత్రిత్వ శాఖను అప్పగించింది. కొత్త సీఎం నేపథ్యం.. ⇒1972–జూన్ 5న పారీ గడ్వాల్ జిల్లాలో (ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఉంది) జననం. అసలు పేరు అజయ్ సింగ్ బిస్త్ ⇒1992–గడ్వాల్ వర్సిటీ నుంచి బీఎస్సీ (మ్యాథ్స్) పట్టా. ⇒ 1994–గోరఖ్నాథ్ మఠాధిపతి మహంత్ అవైద్యనాథ్ శిష్యుడిగా దీక్ష, యోగి ఆదిత్యనాథ్గా పేరు మార్పు. ⇒1998లో 26 ఏళ్లకే గోరఖ్పూర్ నుంచి ఎంపీగా గెలుపు. అప్పటి నుంచి ఐదు సార్లు ఎంపీగా గోరఖ్పూర్కు ప్రాతినిధ్యం. ⇒ 2002–శ్రీరామ నవమి రోజున ‘హిందూ యువ వాహిని’ని స్థాపన. ⇒ 2005–యూపీలోని ఎటాలో ఐదు వేల మందికి పైగా వ్యక్తులను హిందూ మతంలోకి మార్పించారు. ⇒ 2007–గోరఖ్పూర్ అల్లర్లలో హిందూ బాలుడు మరణించినందుకు సంతాపంగా శ్రద్ధాంజలి సభ, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహణ సందర్భంగా తొలిసారి జైలుకు. ⇒ 2014–లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయం లభించిన అనంతరం అసెంబ్లీ ఉపఎన్నికలకు యోగి స్టార్ క్యాంపెయినర్గా బీజేపీ ప్రకటన. ఆ ఎన్నికల్లో అత్యధిక సీట్లలో ఓడిన బీజేపీ. ⇒ 2014–తన గురువు మహంత్ అవైద్యనాథ్ మరణించడంతో సెప్టెంబరులో గోరఖ్పూర్ మఠాధిపతిగా బాధ్యతల స్వీకారం. ⇒ 2017–ఎన్నికల్లోనూ యోగిని స్టార్ క్యాంపెయినర్గా ప్రకటించిన బీజేపీ. ఎక్కువ మంది బీజేపీ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ లేదా యోగి ఆదిత్యనాథ్లే ప్రచారం చేయాలని కోరుకున్నారు. ⇒ 2017– మార్చి 19న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం. యూపీ సీఎం ఆదిత్యనాథ్, హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ ముఖ కవళికలు ఒకేలా ఉండటంతో వీరి ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. యూపీకి సీఎం అయిన డీజిల్కు శుభాకాంక్షలంటూ జోకులు పేలుతున్నాయి.