breaking news
Sushil Kumar Singh
-
చైన్ స్నాచర్ల అరాచకం.. సినిమా రేంజ్లో బీజేపీ ఎంపీ ఛేజింగ్..
పాట్నా: ఆయనో ఎంపీ.. కానీ, సినిమా రేంజ్లో దొంగల భరతం పట్టాడు. సినిమా లెవెల్లో ఎనిమిది కిలోమీటర్లు చేధించి తన వ్యక్తిగత సిబ్బంది సాయంతో చైన్ స్నాచర్లను పట్టుకున్నారు. అనంతరం వారిని.. పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఔరంగాబాద్లోని బరున్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరిత కుమారి అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న తన అత్తను చూసేందుకు జముహర్ మెడికల్ కాలేజీకి వెళ్లింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఆమెను పరామర్శించింది. అనంతరం.. సరిత తన భర్త రాజేష్ గుప్తాతో కలిసి బైక్పై ఇంటి వెళ్తోంది. అయితే, వారిని గమనించిన ముగ్గురు దొంగలు కొద్ది రోజులు దూరం బైక్ను ఫాలో చేసి దొంగలు సరిత మెడలో ఉన్న చైన్ను లాక్కుని పారిపోయారు. ఇక, అదే సమయంలో కారులో అటుగా వెళ్తున్న ఎంపీ సుశీల్ కుమార్ సింగ్ దొంగలను చూశారు. వెంటనే అప్రమత్తమై.. దొంగలు పారిపోతున్న వైపుగా వెళ్లమని కారును తిప్పమని డ్రైవర్కు సూచించారు. అలా దాదాపు 13 కిలోమీటర్లు ఎంపీ కారుతో.. దొంగలను వెంబడించారు. ఈ క్రమంలో కారు.. దొంగల దగ్గరుకు వెళ్లగానే.. వారు రెచ్చిపోయారు. వారి వద్ద ఉన్న గన్తో ఎంపీ సుశీల్కు గురిపెట్టి కాల్చేస్తామని బెదిరించే ప్రయత్నం చేశారు. అయితే, దొంగలకు బెదిరింపులను ఎంపీ కొంచెం కూడా బెదరలేదు. అలాగే, వారిని వెంబడిస్తూ వెళ్లారు. కాగా, మధుపుర్ అనే గ్రామం వద్దకు వెళ్లగానే రోడ్డు పక్కనే ఉన్న బురదలో బైక్ స్కిడ్ అయి వారు కిందపడిపోయారు. ఆ వెంటనే ఎంపీ కారు ఆపారు. అది చూసిన ముగ్గురు దొంగలు వెంటనే లేచి పక్కనే ఉన్న పొలాల వైపు పరిగెత్తారు. దీంతో అప్రమత్తమైన ఎంపీ బాడీగార్డ్లు.. వారిని వెంబడిస్తూ పరిగెత్తారు. అనంతరం అరకిలోమీటర్ వరకు ఛేదించి దొంగలను పట్టుకున్నారు. అనంతరం, పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇక, నిందితులను టింకు కుమార్, ఆనంద్ కుమార్, ఠాకూర్గా పోలీసులు గుర్తించారు. దొంగల వద్ద నుంచి బంగారం, మొబైల్ ఫోన్, ఫారిన్ గన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: బీజేపీ ఎమ్మెల్యేపై దాడి -
భవిష్యత్తులో మరిన్ని సేవలు
జహీరాబాద్: పక్షం రోజులుగా జహీరాబాద్లో నిర్వహించిన లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ వైద్య శిబిరం విజయవంతమయ్యిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని మహీంద్రా సోషల్ రెస్పాన్స్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ సుశీల్కుమార్సింగ్ అన్నారు. సోమవారం స్థానిక మహీంద్రా ఆడిటోరియంలో లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ వైద్య శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఇంపాక్ట్ ఇండియా వారు ఏర్పాటు చేసిన లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ ఉచిత వైద్య శిబిరానికి మహీంద్రా తరఫున పూర్తి సహకారాన్ని అందించామన్నారు. రోగులకు అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. పేదలకు తగిన సేవలందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ రజనీష్ మాట్లాడుతూ మహీంద్రా యాజమాన్యం ముందుకు రావడం వల్లే లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ వైద్య శిబిరం సక్సెస్ అయ్యిందన్నారు. రోగుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. వైద్య శిబిరంలో రోగులకు సేవలందించిన మహీంద్రా వలంటీర్లకు ఈ సందర్భంగా సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో మహీంద్రా కర్మాగారం ప్రతినిధులు కె.పి.ఎన్.రావు, రామారావు, కృష్ణన్ అయ్యర్, ప్రదీప్గౌడ్, వినోద్కుమార్లు పాల్గొన్నారు. 7,342 మందికి వైద్య పరీక్షలు.. జహీరాబాద్లోని రైల్వేస్టేషన్ ఆవరణలో నిర్వహించిన లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ వైద్య శిబిరంలో 7,342 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 1,255 మందికి చికిత్సలు చేశారు. ఈనెల 6న శిబిరాన్ని ప్రారంభించగా, 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రహణం మొర్రికి సంబంధించి 21 మందికి వైద్య పరీక్షలు చేయ గా, 10 మందికి ఆపరేషన్లు నిర్వహిం చారు. చెవికి సంబంధించి 902 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 52 మందికి చికిత్సలు, ఆపరేషన్లు చేశారు. కంటికి సంబంధించి 4,645 మందికి పరీక్షలు చేయగా, 592మందికి ఆపరేషన్లు నిర్వహించారు. దంతాలకు సంబంధించి 1,560 మందికి పరీక్షలు చేయగా, 441 మందికి చికిత్సలు జరిపారు. మూర్చ రోగానికి సంబంధించి 214 మందికి పరీక్షలు నిర్వహించి, 160 మందికి చికిత్సలు చేశారు. జిల్లాలోనే రైల్వే శాఖ మొదటిసారిగా లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ ద్వారా వైద్యశిబిరం నిర్వహిం చింది. మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించేందుకు వీలుగా రైల్వే శాఖ ఈ కార్యక్రమం చేపట్టింది. లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ద్వారా దేశంలో ఇప్పటి వరకు సుమారు 9లక్షల మందికిపైగా రోగులకు అత్యాధునిక వైద్య సేవలందించినట్టు వివరించారు. ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా 1991లో రైల్వేశాఖ లైఫ్లైన్ ఎక్రరపెస్ వైద్య సేవలను ప్రారంభించింది. స్వచ్ఛంద సంస్థల సహకారంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది.