breaking news
Survey of Land
-
8,421 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వేలో డ్రోన్లతో భూమిని కొలిచే ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు 8,421 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయ్యింది. 15 రోజుల్లోనే 700 గ్రామాల్లో సర్వేను పూర్తి చేయడం విశేషం. సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన డ్రోన్లు 4,769 గ్రామాల్లో సర్వే పూర్తి చేయగా.. ప్రైవేటు ఏజెన్సీల డ్రోన్లు 3,652 గ్రామాల్లో సర్వేను పూర్తి చేశాయి. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 807 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయ్యింది. మిగిలిన గ్రామాల్లో డ్రోన్, ఏరియల్ సర్వే చేసేందుకు.. సర్వే బృందాలు విస్తృతంగా పని చేస్తున్నాయి. మరోవైపు డ్రోన్ సర్వే పూర్తయిన 4,006 గ్రామాల ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్(చాయాచిత్రాలు)ను ఇప్పటికే విడుదల చేశారు. వీటితోనే సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. డ్రోన్ చిత్రాల ఆధారంగా ఇప్పటికే 3,031 గ్రామాల్లో క్షేత్రస్థాయి నిజ నిర్థారణ(గ్రౌండ్ ట్రూతింగ్)ను పూర్తి చేశారు. ఆయా గ్రామాల్లోని 3.58 లక్షల ఎకరాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయ్యింది. 975 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రస్తుతం జరుగుతోంది. చివరిగా నిర్వహించే గ్రౌండ్ వ్యాలిడేషన్ను కూడా 2,409 గ్రామాల్లో పూర్తి చేశారు. 622 గ్రామాల్లో ఈ ప్రక్రియ జరుగుతోంది. గ్రౌండ్ వ్యాలిడేషన్ పూర్తయిన గ్రామాల్లో 19,355 అభ్యంతరాలు రాగా.. వాటిలో 19,299 అభ్యంతరాలను మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు పరిష్కరించాయి. మొత్తంగా ఇప్పటివరకు అన్ని దశల్లో రీ సర్తే పూర్తయిన గ్రామాలు 2,913 ఉన్నాయి. ఈ గ్రామాలకు సంబంధించి సర్వే పూర్తయినట్లు నంబర్ 13 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇంకా 1,800 గ్రామాల్లో కూడా నంబర్ 13 నోటిఫికేషన్లు జారీ చేసే దిశగా సర్వేను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో మరో 2 వేల గ్రామాల్లో సర్వేను పూర్తి చేసి భూ హక్కు పత్రాలు పంపిణీ చేసేందుకు రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్ యంత్రాంగం కృషి చేస్తోంది. -
ఇక పక్కాగా భూముల లెక్క
► రాష్ట్రంలోని భూములన్నీ రీసర్వే.. రెవెన్యూ శాఖ కసరత్తు ► కొత్త ఏడాదికల్లా ప్రతి కమతానికి కొత్త సర్వే నంబర్ ► బై నంబర్లు, సబ్డివిజన్లకు చెల్లు ► డీజీపీఎస్ పద్ధతిలో సర్వే చేపట్టే యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూములన్నిం టినీ రీ సర్వే చేసేందుకు ప్రభుత్వం సమాయ త్తమవుతోంది. ఆధునిక సాంకేతిక పద్ధతులతో అత్యంత పకడ్బందీగా ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ప్రతి కమతానికి కొత్త సర్వే నంబర్ ఇస్తూ, ఎలాంటి కంగాళీ లేకుండా సర్వే చేపట్టేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు ప్రారం భించింది. ఈ ఏడాది సెప్టెంబర్లో దీన్ని ప్రారంభించి డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం అందు బాటులో ఉన్న డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిష నింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) విధానంలో సర్వే చేయనున్నారు. ఇందుకు రూ.500 కోట్ల ఖర్చ యినా వెనుకాడబోమని ప్రభుత్వ వర్గాలు ప్రకటించడంతో రెవెన్యూ శాఖ కసరత్తు ఊపందుకుంది. ఎలాంటి కంగాళీ లేకుండా.. తెలంగాణలో నిజాం హయాంలో భూముల సర్వే జరిగింది. 1936లో జరిగిన ఈ సర్వే ఆధా రంగానే లావాదేవీలు నడుస్తున్నాయి. దాదాపు 80 ఏళ్ల పాటు జరిగిన అనేక లావాదేవీల కారణంగా సర్వే నంబర్లు కంగాళీగా మారాయి. బై నంబర్లు, సబ్డివిజన్ల పేరుతో ఉన్న ఈ నంబర్ల ద్వారా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అసలు ఏ సర్వే నంబర్లో ఎంత భూమి ఉందన్నది కూడా ఇదమిత్థంగా తెలియ డం లేదు. కొన్ని సర్వే నంబర్లలో రికార్డుల్లో ఉన్న భూమి కన్నా ఎక్కువగా, కొన్నిచోట్ల తక్కువగా ఉంటోంది. డివిజన్ల విషయంలోనూ పట్టాదారుల రికార్డులకు, క్షేత్రస్థాయిలోని భూమికి పొంతన లేకుండా పోయింది. దీంతో ఈ గందరగోళానికి స్వస్తి పలికి ప్రతి భూకమ తానికి ఓ సమగ్ర సర్వే నంబర్, పాస్పుస్తకం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సర్వే ఆఫ్ ఇండియాతోపాటు దేశంలోని దాదాపు 25 అధీకృత సర్వే ఏజెన్సీలను కూడా వినియోగించుకోనుంది. సర్వే కోసం రాష్ట్రం లోని 20 వేల మంది ఇంజనీరింగ్ పట్టభద్రుల సహకారం కూడా తీసుకోనుంది. రాష్ట్రంలోని 10 వేలకు పైగా రెవెన్యూ గ్రామాలుండగా, ప్రతి గ్రామంలో ఈ సర్వే ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేసేలా రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రతి రెవెన్యూ డివిజన్కు డీజీపీఎస్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) విధానంలోనే భూముల రీసర్వే చేయాలని రెవెన్యూ శాఖ భావిస్తోంది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం వినియోగిస్తున్న డిజిటల్ మ్యాప్లతో కూడిన లైడార్ సర్వే, ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ సర్వే (ఈటీఎస్) విధానం వంటి వాటిపై చర్చ జరిగినా డీజీపీఎస్ విధానమే మేలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతి రెవెన్యూ డివిజన్కు ఓ డీజీపీఎస్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని, ప్రతి మండలానికి 3–4 రోవర్లు పెట్టి సర్వే చేయాలని యోచిస్తున్నారు. ఈ యంత్రాల ఏర్పాటు కోసం రూ.40 కోట్లకు పైగా అవసరం అవుతుందని రెవెన్యూ శాఖ అంచనా వేస్తోంది. దీంతోపాటు మానవ వనరుల నిర్వహణ కోసం, సర్వే ఏజెన్సీల సహకారం కోసం రూ.వందల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తోంది. మార్గదర్శకాలకు కమిటీ.. భూముల రీసర్వేకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఇందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. రంగారెడ్డి, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు రఘునందన్, లోకేశ్కుమార్, వెంకట్రామిరెడ్డిలతోపాటు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్, ముగ్గురు ఆర్డీవోలు, సర్వే, అటవీ శాఖల జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రీ సర్వేలో ఎదురయ్యే ఇబ్బందులు, కావాల్సిన మానవ వనరులు, యంత్రాలు, వాటి కొనుగోళ్లు, డీజీపీఎస్ కన్నా ఆధునిక పద్ధతి ఏదైనా ఉందా అనే దానిపై అధ్యయనం చేసి మార్గదర్శ కాలను ఖరారు చేస్తుంది.