breaking news
Surabhi prabhavathi
-
ప్రేక్షకుల స్పందనతో ఆనందం కలిగింది
‘‘మానవ సంబంధాల నేపథ్యంలో నడిచే చిత్రం ‘ఇంటింటి రామాయణం’. కుటుంబంతో, స్నేహితులతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. మా చిత్రానికి ప్రేక్షకుల స్పందన చూసి చాలా ఆనందం కలిగింది’’ అని డైరెక్టర్ సురేష్ నరెడ్ల అన్నారు. రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, వీకే నరేశ్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు ΄ోషించిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’. సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో సురేష్ నరెడ్ల మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. అమెరికాలోనూ మంచి స్పందన వస్తోంది. నాకు స΄ోర్ట్ చేసిన నాగవంశీ, మారుతిగార్లకు, ఆహా వారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఇంటింటి రామాయణం’కి మేం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది.. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని నటి నవ్య స్వామి అన్నారు. -
సీరియల్స్లో అవకాశాలు వస్తున్నాయి
బొబ్బిలి: తమ వంశమంతా సురభి కళాకారులమేనని, ఒకవైపు తాను నాటకాలు వేస్తూనే మరో వైపు టీవీ, సినిమాల్లో నటిస్తున్నానని నటి సురభి ప్రభావతి అన్నారు. బొబ్బిలి వచ్చిన సందర్భంగా బుధవారం రాత్రి ఆమె సాక్షితో మాట్లాడారు. తమ కుటుంబంలో పుట్టుకతోనే నటనలో ఉంటామన్నారు. అందుకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చామో, ఎన్ని అవార్డులు వచ్చాయో లెక్కలేవన్నారు. బతుకమ్మ, మహాత్మ సినిమాల్లో తాను నటించానని చెప్పారు. టీవీ సీరియల్స్లో కలవారి కోడలు, పూత రేకుల్లో నటించానని, ఇంకా సీరియల్స్లో నటించేందుకు అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. నెల్లూరులో తాను ప్రదర్శించిన బాపుబాటలో నాటకానికి, ఖమ్మంలో వేసిన విప్రనారాయణ పద్యనాటకంలో దేవదేవి పాత్రకు, గుంటూరులో వేసిన వీరపల్నాడులో నాగమ్మ పాత్రకు తనకు నంది అవార్డులు వచ్చాయని తెలిపారు. తిరుపతిలో జరిగిన పోటీల్లో గరుడ అవార్డు కూడా ఇచ్చారన్నారు. ఉదయ్ భాగవతుల రచన, దర్శకత్వంలో వేసిన బొమ్మ సముద్రం నాటకానికి మంచి పేరు వచ్చిందన్నారు. ఆ నాటకాన్ని 50 సార్లు ప్రదర్శిస్తే 40 సార్లు ఉత్తమ నటిగా గుర్తింపు వచ్చిందన్నారు. ఖాళీలు పూరించండి, కొత్త బానిసలు నాటకాలకు కూడా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. టీవీసీరియల్స్, సినిమాలకు అవకాశం వస్తున్నా నాటకానికే తాను అధిక ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పారు.