-
టీడీపీ నేతల మధ్య ఫ్లెక్సీల గొడవ.. ఎస్పీకి ఫిర్యాదు!
సాక్షి, అనంతపురం : ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తాజాగా మంత్రి లోకేష్ కర్నూల్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలతో నేతల మధ్య చిచ్చురగులుకున్న విషయం తెలిసిందే. అనంతపురంలో టీడీపీ ఎంపీల నిరసన దీక్షలో ఫ్లెక్సీల గొడవ చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. కానీ సూరి అనుచరులు మాత్రం మంత్రి పరిటాల సునీత వర్గీయులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే సూరి ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతేకాక ఫ్లెక్సీలు తొలగించిన కొంతమందిని పోలీసులు తప్పించారని ఎమ్మెల్యే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. -
వంగర పోలీసులపై ఎస్పీ కొరడా
వంగర: వంగర పోలీసులపై జిల్లా పోలీస్ సూపరిం టెండెం ట్ ఎ.ఎస్.ఖాన్ కొరడా ఝుళి పించారు. ఇద్దరు కానిస్టేబుల్స్ను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఖాకీ రాజీకీయం!’ శీర్షికన జూలై 21వ లేదీన ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ఆయన తీవ్రంగా స్పందించారు. వంగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న అవకతవకలుపై పాలకొండ డీఎస్పీ దేవానంద్ శాంతోతో ప్రత్యేకంగా దర్యాప్తు చేయించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ట్రాక్టర్ల యజమానులు, కర్మాగారాల మేనేజర్లు, గ్రానైట్ క్వారీ సిబ్బంది, వ్యాపారులు, ఇసుక రవాణాదారులు, కలప వ్యాపారులను డీఎస్పీ విచారించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. దాని ఆధారంగా తాజా చర్యలు తీసుకున్నారు. వంగర పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎం.క్రాంతికుమార్, రూపుకుమార్ను శ్రీకాకుళం సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారని పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. వంగర పోలీస్ స్టేషన్పై ప్రత్యేక దృష్టి వంగర పోలీస్ స్టేషన్పై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించినట్లు సమాచారం. అక్రమవసూళ్లపై ఉన్నతాధికారులు ఇప్పటికే వివిధ కోణాల్లో దర్యాప్తు పూర్తి చేశారు. నివేదికల్లో పొందుపరిచిన అంశాలను పరిశీలించి బాధ్యులుపై చర్యలు తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీస్ స్టేషన్లో కొంతకాలంగా జరుగుతున్న వ్యవహారాలపై ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు. ఇద్దరు పోలీసులను బదిలీ చేయడంతో తివ్వలాగినట్లైంది. ఈ క్రమంలో డొంక కదులకమానదని, మరికొందరిపై చర్యలుంటాయని పలువురు చెబుతున్నారు. ఈ విషయంపై సమాచారం కోసం వంగర పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయగా ల్యాండ్లైన్ పనిచేయలేదు. ఎస్ఐ జి.వీరాంజనేయులు ఫోన్కు అందుబాటులో లేకపోవడంతో సీఐ సిహెచ్.అంబేద్కర్, డీఎస్పీ దేవానంద్శాంతో వద్ద ‘సాక్షి’ ఫోన్లో ప్రస్తావించగా తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. ఎస్పీ వివరణ ఎస్పీ ఎ.ఎస్.ఖాన్ను ‘సాక్షి’ వివరణ కోరగా వంగర పోలీస్ స్టేషన్లో ఇద్దరు కానిస్టేబుల్స్ను బదిలీ చేయడం వాస్తవమని తెలిపారు. అయితే ఇది సాధారణ బదిలీల్లో భాగంగా జరిగిందేనని వివరణ ఇచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement