-
తండ్రీకొడుకుల ఎమోషనల్ కథే ‘మా నాన్న నక్సలైట్’
‘‘నక్సల్స్ బ్యాక్డ్రాప్లో సాగే తండ్రీకొడుకుల ఎమోషనల్ కథే ‘మా నాన్న నక్సలైట్’ చిత్రం. ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను హత్తుకుంటుంది. చదలవాడ శ్రీనివాసరావుగారు కథ విని మంచి సినిమా అవుతుందనే నమ్మకంతో మమ్మల్ని ప్రోత్సహించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బ్యానర్లో సినిమా చేయడాన్ని హ్యాపీగా ఫీలవుతున్నాను’’ అన్నారు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి. గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె ప్రధాన పాత్రలో సునీల్కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మా నాన్న నక్సలైట్’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో అనురాధ ఫిలిమ్స్ డివిజన్పై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘మా నాన్న నక్సలైట్’ చిత్రం బాగా వచ్చింది. నక్సలైట్ బ్యాక్డ్రాప్లో వస్తోన్న మంచి సెంటిమెంట్ సినిమా ఇది. సోసైటీకి ఉపయోగపడుతుంది. నా బ్యానర్లో వస్తోన్న మరో అద్భుతమైన చిత్రం ఇది. సునీల్కుమార్గారితో మరిన్ని సినిమాలు చేస్తా’’ అన్నారు. -
Land Suneel: ఎలాంటి సందర్భాల్లో అసైన్డ్ భూములు అమ్మవచ్చు?
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూముల అంశం పరిష్కరించలేనిది ఏమీ కాదని, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే నిర్దిష్ట కార్యా చరణ, విస్తృత చర్చలతో దీనికి శాశ్వత పరిష్కారం తేవొచ్చని భూ చట్టాల నిపుణుడు, నల్సర్ అనుబంధ ప్రొఫెసర్ ఎం. సునీల్ కుమార్ (భూమి సునీల్) తెలిపారు. అసలు అసైన్డ్ చట్టంలో ఉన్న వెసులుబాట్లు, లోటుపాట్లు సరిదిద్దేలా మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన అసైన్డ్ భూములకు సంబంధించిన అనేక అంశాలు, సందేహాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు. సాక్షి: పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్ముకోవచ్చా? సునీల్: ప్రభుత్వం పేదలకు రెండు సందర్భాల్లో భూములిస్తుంది. ఒకటి వ్యవసాయం కోసం. రెండు ఇళ్లు కట్టుకునేందుకు. ఈ అసైన్మెంట్ భూములను తరతరాలుగా వారసత్వంగా అనుభవించవచ్చు కానీ అమ్మడం లేదా మరే విధంగానూ ఇతరులకు బదలాయింపు చేయడానికి వీల్లేదు. సాక్షి: ఎలాంటి సందర్భాల్లో అసైన్మెంట్ భూములను అమ్మే వీలుంది? సునీల్: ఇందుకు పీవోటీ చట్టంలోనే మినహాయింపులిచ్చారు. 1977లో వచ్చిన చట్టంలో ఇప్పటి వరకు 11 రకాల వెసులుబాట్లు కల్పించారు. అసైన్డ్ పట్టాలో అమ్మకూడదు అనే నిబంధన పేర్కొనకపోతే, భూమిలేని నిరుపేదలు ఎవరైనా 1977 కంటే ముందు కనుక అసైన్డ్ భూములను కొనుగోలు చేసి ఉంటే అమ్ముకోవచ్చు. అసైన్డ్ భూములను బ్యాంకులకు, సహకార సమాఖ్యలకు కుదువ పెట్టవచ్చు. అప్పు తీర్చకపోతే కుదువ పెట్టిన భూములను బ్యాంకులు వేలం వేసి విక్రయించవచ్చు. అలా వేలంలో కొన్న వారికి పూర్తి యాజమాన్య హక్కులు వస్తాయి. మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు భూములిస్తే వాళ్లు పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. రాజకీయ బాధితులైతే పట్టా చేతికి వచ్చిన మరుక్షణమే అమ్ముకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధర చెల్లించిన వారికి అసైన్ చేస్తారు. వారికి ఫామ్–జీ పట్టాలిస్తారు. అవి పట్టాభూములే. వాటిని తక్షణమే అమ్ముకోవచ్చు. 1977 నుంచి 2007 వరకు ఆంధ్రప్రదేశ్లో, 2017 వరకు తెలంగాణలో ఎవరైనా భూమి లేని పేదలు అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తే కొన్న వారికి మళ్లీ అసైన్మెంట్ పట్టా ఇవ్వవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఇంటి స్థలాల కోసం ఇచ్చిన పట్టా భూములను 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. 2019 జనవరి కంటే ముందు అమ్ముకుని ఉంటే క్రమబద్ధీకరించుకోవచ్చు. అలాగే, రక్తసంబంధీకులకు దానం కానీ వీలునామా రూపంలో కానీ ఇవ్వవచ్చు. వారసుల పేరిట పట్టా మార్పిడి చేయొచ్చు. సాక్షి: చట్టాన్ని ఉల్లంఘించి కొనుగోలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సునీల్:అసైన్డ్ భూములను చట్టాన్ని ఉల్లంఘించి కొనుగోలు చేస్తే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముంది. సివిల్ చర్యల కింద వారిని ఆ భూమి నుంచి తొలగించి ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంటుంది. పీవోటీ చట్టం సెక్షన్–7 ప్రకారం తహసీల్దార్ క్రిమినల్ కేసు (కొనుగోలు చేసిన వారిపై, అడ్డుపడిన వారిపై) పెట్టవచ్చు. సాక్షి: అసైన్డ్ భూముల విషయంలో ఇప్పుడెలాంటి నిబంధనలుండాలి? సునీల్: దీన్ని విçస్తృత కోణంలో ఆలోచించాలి. బ్యాంకుల్లో కుదువపెట్టి వేలం వేయించుకోవడం కొందరికి దొడ్డిదారిగా మారింది. అసైన్డ్ భూములు వేలానికి వెళితే వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోనేరు రంగారావు కమిటీ సిఫారసు చేసింది. కానీ అమల్లోకి రావడం లేదు. ఇప్పటి వరకు జరిగిన అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి వాళ్లకు పట్టాలివ్వాలని చట్టంలోనే ఉంది. కానీ అదీ అమలు చేయడం లేదు. ఇప్పుడు దాన్ని అమలు చేస్తే సరిపోతుంది. 2017తర్వాత కొను గోలు చేసినా ఇదే నిబంధన వర్తింపు చేస్తే చాలు. సాక్షి: పెద్దలు ఈ భూములను కొనుగోలు చేసినా, కబ్జా చేసినా పరిస్థితేంటి? సునీల్: పేదలు కాని వారు అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తే ఏం చేయాలన్న దానిపై మూడు అభిప్రాయాలున్నాయి. మొదటిది అసైన్మెంట్ చట్టాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయాలి. ప్రభుత్వం ఆ భూములను తీసుకుని, మళ్లీ అసైన్చేయాలి లేదంటే ప్రజావసరాల కోసం వినియోగించుకోవాలి. రెండోది.. క్రమబద్ధీకరణ. మార్కెట్ విలువ కట్టించుకుని వారికి యాజమాన్య హక్కులివ్వాలి. ఇప్పుడున్న పీవోటీ చట్టంలో అలాంటి వెసులుబాటు లేదు. చట్టాన్ని మార్చుకుంటే కానీ ఇది సాధ్యం కాదు. ఇక, మూడోది.. ఫలానా తేదీ తర్వాత పెద్దలు ఈ భూములను కొనుగోలు చేసేందుకు అవకాశం ఇవ్వకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి భూమిలేని మరో నిరుపేదకు పంపిణీ చేయాలి.. లేదా విస్తృత ప్రజా ప్రయోజనం కోసం వాడొచ్చు. సాక్షి: అసైన్డ్ భూముల విషయంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? సునీల్: వారసత్వంగా అసైన్మెంట్ భూమి వచ్చి నా ఇంకా పట్టా మార్చడం లేదు. వారసుల పేరు మీద మ్యుటేషన్ చేసేందుకు చట్టంలో ఎక్కడా అడ్డంకులు లేవు. ఈ మ్యుటేషన్ ఫీజు ఎకరాకు రూ.2,500 భారమవుతుంది కనుక ఉచితంగా చే యాలి. లావుణి పట్టాలకు సంబంధించి ఇంకా కొత్త పాస్పుస్తకాలు ఇవ్వలేదు. ఇదేమంటే అసైన్డ్ భూమి అంటున్నారు. కానీ చట్టప్రకారం కొత్త పాస్ పుస్తకా లు ఇచ్చేందుకు అడ్డంకులు లేవు. అసైన్మెంట్ పట్టాలో ఉన్న సర్వే నెంబర్కు, అసైనీ కబ్జాలో ఉన్న భూమి సర్వే నెంబర్కు తేడాలున్నాయి. వీటిని పరిష్కరించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. వీటన్నింటినీ పరిష్కరిస్తేనే అసైన్డ్ భూములకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. సాక్షి: చట్ట ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకునేందుకు అవలంబించాల్సిన పద్ధతులేంటి? సునీల్:అసైనీదారులు, కొనుగోలుదారులకు మొదట నోటీసులివ్వాలి. ఆ తర్వాత తహసీల్దార్ విచారణ జరపాలి. చట్ట ఉల్లంఘన జరిగిందని ప్రకటిస్తే కొనుగోలుదారుడు లేదా కబ్జాదారులను ముందు ఆ భూమి నుంచి తొలగించాలి. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనపర్చుకోవాలి. క్రిమినల్ చర్యల్లో భాగంగా కేసు పెట్టాల్సింది తహసీల్దార్ మాత్రమే. తహసీల్దార్ లేదంటే ఆ పై స్థాయి అధికారి పెట్టవచ్చు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సాక్షి: అసైన్డ్ భూములను ప్రభుత్వం తన విచక్షణతో స్వాధీనం చేసుకోవచ్చా?నష్టపరిహారం ఇస్తారా? సునీల్: అసైన్పట్టాను పరిశీలిస్తే ‘ప్రభుత్వానికి ఎలాంటి అవసరం వచ్చినా ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది’ అనే నిబంధన ఉంటుంది. దీని ప్రాతిపదికగా చాలా సందర్భాల్లో అసైన్ భూములను ప్రభుత్వం తీసుకుంది. ఏ ఉద్దేశం కోసమైతే ప్రభుత్వం అసైన్ చేస్తుందో మూడేళ్లలో ఆ ఉద్దేశం నెరవేరకపోతే తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. అసైనీనే ప్రభుత్వానికి భూమిని సమర్పించవచ్చు. ప్రభుత్వం తీసుకుంటే 1992 వరకు నష్ట పరిహారం ఇవ్వలేదు. ఆ తర్వాత ఎకరానికి కంటితుడుపుగా ఎక్స్గ్రేషియా ఇచ్చేవారు. రెండు నెలల క్రితం వచ్చిన కోర్టు తీర్పుల ప్రకారం కూడా ఏ విధంగా అసైన్డ్ భూములను ప్రభు త్వం తీసుకున్నా పరిహారం ఇవ్వాల్సిందే. పట్టా భూములకు ఎంత చెల్లిస్తారో అంత చెల్లించాల్సిందే. భూమి హక్కులకు ఉల్లంఘన జరిగితే ఎన్నేళ్ల తర్వాత వచ్చి అడిగినా పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. సాక్షి: అసైన్మెంట్ చట్టాల్లో మార్పులేమైనా చేయాలా? సునీల్: ఈ చట్టాల్లో కచ్చితంగా మార్పులు చేయాల్సిందే. కొన్ని నిబంధనలను తొలగించడం, కొన్నింటిని చేర్చడం జరగాలి. ఈ చట్టంలో మార్పులు చేసేటప్పుడు స్థానిక పరిస్థితులు, పరిస్థితుల్లో మార్పు, పక్క రాష్ట్రాల్లో అనుభవాలు లాంటి అంశాలను విస్తృతంగా చర్చించి మార్పులు చేయాలి. -
అదే ముసుగుల కాన్సెప్ట్
‘‘యువత చెడిపోవడానికి వారి తల్లిదండ్రులు కూడా ఓ కారణం. సరైన గైడెన్స్ లేకనే యువత చెడు మార్గాల్లోకి వెళ్తున్నారు. ఆ రకంగా తల్లిదండ్రులకు రొమాంటిక్ క్రిమినల్స్ ఒక చెంపపెట్టులాంటి చిత్రం అవుతుంది’’అన్నారు దర్శకులు పి. సునీల్కుమార్ రెడ్డి. మనోజ్ నందం ప్రధాన పాత్రలో సునీల్కుమార్రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రొమాంటిక్ క్రిమినల్స్’. రొమాంటిక్ క్రైమ్ కథ, ఓ క్రిమినల్ ప్రేమ కథ చిత్రాలకు సీక్వెల్గా తెరకెక్కింది. ఈ చిత్రం నేడు విడుదల కానుంది. సునీల్కుమార్ మాట్లాడుతూ– ‘‘రెండేళ్లకొకసారి ఈ రొమాంటిక్ చిత్రాలను తెరకెక్కించాలని ప్లాన్ చేశాం. కాకపోతే గ్యాప్ వచ్చింది. ఓ జర్నలిస్టుగా స్టడీ చేసి ఈ కథలను రాసుకుంటున్నా. యువత వ్యసనాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నాం. సినిమా పోస్టర్లో ముగ్గురు అమ్మాయిలకు ముసుగులు వేశాం. వారు మూడు కాలాలను ప్రతిబింబిస్తారు. గతంలో చేసిన తప్పులకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పుడు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు? రేపు ఎలా ఉండబోతున్నారన్నది ఈ ముసుగుల కాన్సెప్ట్. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది’’ అని అన్నారు. -
కొత్తవారైనా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు!
‘‘భావోద్వేగంతో కూడిన సినిమాను ప్రేక్షకులు ఆదరించడం ఆనందంగా ఉంది. 150 సెంటర్లలో ‘గల్ఫ్’ను విడుదల చేస్తే ఇప్పటికీ 16 కేంద్రాల్లో ఆడుతోంది. రూరల్ లెవల్లోనూ మా సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది’’ అని దర్శకుడు పి.సునీల్కుమార్ రెడ్డి అన్నారు. చేతన్ మద్దినేని, డింపుల్ జంటగా ఆయన దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్కుమార్ నిర్మించిన ‘గల్ఫ్’ విడుదలై మంగళవారానికి 25 రోజులైంది. సునీల్కుమార్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘జగిత్యాల వంటి సెంటర్లో మా సినిమా 25 రోజులు రన్ కావడం గ్రేట్. తెలంగాణలో మంచి స్పందన వస్తోంది. రూరల్ పీపుల్ ఓన్ చేసుకున్నారు. ఇందులో నటించింది కొత్తవారైనా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు. వాళ్లు కొన్ని గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడివారు గల్ఫ్లో ఉన్న తమ పిల్నల్ని వీళ్లలో చూసుకోవడం చూశా’’ అన్నారు. ‘‘రెండు మూడు రోజులకే చిన్న సినిమాను ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాంటిది ‘గల్ఫ్’కి ఇంతమంచి స్పందన వస్తుండటం హ్యాపీ’’ అన్నారు చేతన్ మద్దినేని. ‘‘మా గత సినిమాల కన్నా ‘గల్ఫ్’కి ఎక్కువ స్పందన వస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు యక్కలి రవీంద్రబాబు. -
మూవీ రివ్యూ: గల్ఫ్
ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ క్రైమ్ కథ వంటి కమర్షియల్ సక్సెస్ సాధించిన సినిమాలతో పాటు గంగ పుత్రులు లాంటి సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మరో సందేశాత్మక చిత్రం గల్ఫ్. పొట్ట కూటి కోసం దేశం విడిచి వెళ్లిన గల్ఫ్ వలస బాధితుల కష్టాలే కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలంగాణకు చెందిన నేత కార్మికుడి కొడుకు శివ (చేతన్). తన స్నేహితుడు దుబాయ్ వెళ్లి బాగా సంపాదించడంతో తాను కూడా అలాగే డబ్బు సంపాదించాలనుకుంటాడు. అమ్మానాన్నలకు ఇష్టం లేకపోయినా.. గల్ఫ్ బాట పడతాడు. డబ్బు సంపాదించాలన్న ఆలోచనతోనే లక్ష్మీ (డింపుల్ హయాతి) కూడా దుబాయ్ వెళుతుంది. గల్ప్ ప్రయాణంలోనే పరిచయం అయినా శివ, లక్ష్మీలు ప్రేమలో పడతారు. ఎన్నో ఆశలతో దుబాయ్ లో అడుగు పెట్టిన శివకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతాయి. తానే కాదు అక్కడ లక్షల మంది భారతీయులు ఇలాగే శ్రమదోపిడీకి గురవుతున్నారన్న నిజం తెలుసుకుంటాడు. డబ్బు ఆశతో గల్ఫ్ బాట పట్టిన మన వారి బతుకులను పరిచయం చేయటమే ఈ సినిమా కథ. యదార్థ పరిస్థితులను కథాంశంగా ఎంచుకున్న సునీల్ కుమార్ అక్కడే సగం విజయం సాధించాడు. గల్ప్ లో జీవితాల గురించి యువత ఎలాంటి కలలు కంటుంది. నిజంగా అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడి పరిస్థితుల గురించి పూర్తిగా తెలుసుకోకుండా వెళ్లటం మూలంగా బ్రోకర్లు, అరబ్బుల చేతుల్లో మనవాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని కష్టాలు పడుతున్నారు అన్న విషయాలను చాలా బాగా చూపించారు. గల్ప్ లోని లోకేషన్లో చిత్రీకరణ చేయటం వలన సినిమా చాలా నేచురల్ గా అనిపిస్తుంది. భావోద్వేగ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. హీరో హీరోయిన్ల నటన ఆకట్టుకుంటుంది. అయితే ఫస్ట్ అంతా ఎంతో బలంగా రాసుకున్న దర్శకుడు ద్వితియార్థంలో కాస్త తడబడ్డాడు. దుబాయ్ లో మోసపోయిన హీరో ఎదురుతిరిగిన తరువాత వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా లేకపోవటం నిరాశకలిగిస్తుంది. ఒకే తరహా కష్టాలను మళ్లీ మళ్లీ చూపించటం కూడా కాస్త విసిగిస్తుంది. పాజిటివ్ గా ముగుస్తుందనుకున్న సినిమాకు నెగెటివ్ ఎండింగ్ ఇవ్వడం కూడా ఇబ్బంది పెడుతుంది. పులగం చిన్నారాయణ అందించిన డైలాగ్స్ అక్కడక్కడా మెరిశాయి. సంగీతం, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తం మీద గల్ఫ్ మరోసారి సునీల్ కుమార్ రెడ్డి నుంచి వచ్చిన మంచి ప్రయత్నమనే చెప్పాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement