-
డ్రైవింగ్ లైసెన్స్లూ ఆన్లైన్లోనే
– భవిష్యత్లో వాహనదారులు కార్యాలయానికి రానవసరం ఉండదు – ఉపరవాణా కమిషనర్ సుందర్వద్దీ అనంతపురం సెంట్రల్: వాహనదారులు ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఏ పనైనా ఆన్లైన్లో చేసుకునేవిధంగా త్వరలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని ఉపరవాణా కమిషనర్ సుందర్వద్దీ తెలిపారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడారు. ఇప్పటికే నాన్ట్రాన్స్పోర్టు, ట్రాన్స్పోర్టు వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ అయిందన్నారు. వారం రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్లకు సంబంధించి తొలిఘట్టం ఎల్ఎల్ఆర్ కూడా ఆన్లైన్ పొందవచ్చునని చెప్పారు. పైలెట్ ప్రాజెక్టు కింద కడప, విజయవాడ, విశాఖపట్నంలో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ వారంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ప్రస్తుతం మీ సేవా కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకొని, ఎల్ఎల్ఆర్ కోసం కార్యాలయానికి రావాల్సి ఉంటుందన్నారు. ఇక నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు, ఎక్జామ్ ఉంటుందని వెల్లడించారు. అర్హత ఉన్న వారికి ఎల్ఎల్ఆర్ మంజూరు చేస్తామని, ఆన్లైన్లో తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అనంతరం డ్రైవింగ్ లైసెన్స్ టెస్టింగ్ కోసం మాత్రమే రావాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్టింగ్, వాహనాల ఫిట్నెస్ కోసం మాత్రమే కార్యాలయానికి రావాల్సి ఉంటుందన్నారు. మిగిలిన పనులన్నీ ఆన్లైన్ ద్వారానే చేసుకోవచ్చునన్నారు. దీంతో భవిష్యత్ కోసం రహదారుల భద్రతపై ఎక్కువ దృష్టి సారిస్తామని వివరించారు. ఎక్కువ శాతం వాహనాలను తనిఖీ చేసి అనుమతులు లేని వారిపై కేసులు నమోదు చేసి తద్వారా ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తామని వివరించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడతామని తెలిపారు. -
అన్నింటికీ ఆధార్
♦ రవాణాశాఖలో సమూల మార్పులు ♦ ఈనెల 15 నుంచి అన్ని సేవలు ఆన్లైన్లోనే ♦ రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ సుందర్వద్ది అనంతపురం సెంట్రల్ : రవాణాశాఖలో త్వరలో సమూల మార్పులు తీసుకువస్తున్నట్లు డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ సుందర్వద్ది తెలిపారు. ఈనెల 15 నుంచి అన్ని సేవలు ఆన్లైన్లోనే పొందే వెసులుబాటును కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడారు. రవాణాశాఖలో నూతన సాఫ్ట్వేర్ వస్తోందనీ, డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎల్ఆర్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ తదితర అన్ని సేవలను ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అధికారులు కూడా కంప్యూటర్ ద్వారానే సర్టిఫికెట్లు మంజూరు చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే అన్ని సేవలకు ఆధార్కార్డు ఉంటే చాలనీ, భవిష్యత్లో రకరకాల సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. దీనివల్ల ప్రజలు ఇంటి వద్ద నుంచే అన్ని కార్డులు పొందవచ్చన్నారు. ఒక్కసారి మాత్రమే కార్యాలయానికి రావాల్సి ఉంటుందని తెలిపారు. ఆన్లైన్ విధానంపై త్వరలో డీలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణపై కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి వాహనానికి జీపీఎస్ తప్పనిసరిగా అమర్చుకోవాలనీ, పరిమితికి మించి వేగంగా వెళ్తే జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ప్రతి 50 కిలో మీటర్లుకు ఒక ట్రామాకేర్ హాస్పిటల్ను జాతీయ రహదారిలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ. దీని వల్ల క్షతగాత్రులకు వెంటనే వైద్యం అందుతుందన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement