-
సుందర్ పిచాయ్ కూడా బుక్కయ్యాడు...!
ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సోషల్ మీడియా అకౌంట్ల హ్యాకింగ్ అనంతరం హ్యాకింగ్ గ్రూప్ అవర్ మైన్ లేటెస్ట్ టార్గెట్ గా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ బుక్కాయ్యారు. సుందర్ పిచాయ్ క్వారా అకౌంట్ ను అవర్ మైన్ గ్రూప్ హ్యాకింగ్ చేసింది. క్రౌడ్ సోర్స్ డ్ సమాధాన సైట్ కు అనుసంధానంగా ఉండే ట్విట్టర్ అకౌంట్లో తప్పుడు క్వారా పోస్టులను పోస్టు చేసింది. సుందర్ పిచాయ్ ఫాలోవర్స్ 508,000 మందికి ఈ హ్యాకింగ్ విషయాన్ని అవర్ మైన్ ప్రచారం చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ లను తొలగించినా.. ఆ హ్యాకింగ్ స్క్రీన్ షాట్ లు బయటికి వెల్లడించింది. కానీ ఈ గ్రూప్ అకౌంట్ల హ్యాకింగ్ కు ఎలా పాల్పడుతుందో క్లియర్ గా తెలియడం లేదు. సోషల్ నెట్ వర్క్ ల సిస్టమ్ దొంగతనం వల్ల హ్యాకింగ్ కు పాల్పడటం లేదని మాత్రం తెలిసింది. అయితే అవర్ మైన్ గ్రూప్, తనకు తాను భద్రతా సంస్థగా అభివర్ణించుకుంటోంది. ఈ హ్యాకింగ్ ఘటనలు మళ్లీ జరగకుండా, సర్వీసులను ఆఫర్ చేస్తుందని వెల్లడిస్తోంది. వెబ్ సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లు, కంపెనీల భద్రతా వలయాలను స్కాన్ చేసి, తన సైట్ లో భద్రతకు సంబంధించి ప్రచార సేవలను అందిస్తున్నట్టు చెబుతోంది. సుందర్ పిచాయ్ క్వారా అకౌంట్ హ్యాకింగ్ కు సోమవారం పాల్పడామని, గూగుల్ సీఈవో భద్రత చాలా వీక్ గా ఉందని అవర్ మైన్ గ్రూప్ తెలిపింది. ఎవరైనా దాడిచేసే విధంగా ఉందని పేర్కొంది. ఈ హ్యాకింగ్ రిపోర్టుపై గూగుల్, క్వారాలు వెంటనే స్పందించలేదు. ఈ హ్యాకింగ్ గ్రూప్ ఈ నెల మొదట్లో జుకర్ బర్గ్ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. -
మళ్లీ పెళ్లి చేసుకున్న పిచాయ్ మామ
జైపూర్ : గూగుల్ ముఖ్య కార్యనిర్వహాణాధికారి సుందర్ పిచాయ్ మామయ్య ఓలారామ్ హర్యానీ (70) మళ్లీ పెళ్లి కొడుకు అయ్యారు. రాజస్థాన్లోని ఆర్య సమాజ కార్యాలయంలో ఆ సంస్థ ఆచారాలకు అనుగుణంగా మంగళవారం మాధురి శర్మ (65)ను ఆయన వివాహం చేసుకున్నారు. మాధురీ శర్మ రాజస్థాన్లోని కోట నివాసి. ఆమె భర్త మిలటరీలో పని చేసే వారు. ఆయన మరణించారు. ఓలారామ్ కోటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగిగా పని చేసి రిటైర్ అయ్యారు. అనంతరం ఆయన ముంబైలో నివసిస్తున్నారు. ఓలారామ్ మొదటి భార్య మరణించారు. ఓలారామ్కు ఇద్దరు పిల్లలు. ఓ కుమారుడు, ఓ కుమార్తె. ఓలారామ్ కుమార్తె అంజలిని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement