-
గుడ్ న్యూస్.. తగ్గనున్న సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు..
వంట కోసం సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్న వారికి శుభవార్త. టారిఫ్ రేట్ కోటా (TRQ) విధానం కింద ముడి సోయా బీన్ ఆయిల్, సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్ దిగుమతులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ మినహాయింపు మే 11 నుంచి జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ రేట్ కోటా లైసెన్స్ ఉన్న దిగుమతిదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇదీ చదవండి: జీఎస్టీ నిబంధనల్లో మార్పులు.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్! టారిఫ్ రేట్ కోటా అనేది కోటా చేరుకున్న తర్వాత అదనపు దిగుమతులపై సాధారణ సుంకాలు వర్తింపజేయడంతో పాటు, తగ్గింపు లేదా జీరో-డ్యూటీ రేటుతో భారతదేశంలోకి నిర్దిష్ట పరిమాణంలో దిగుమతులను అనుమతించే వ్యవస్థ. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు 2 మిలియన్ టన్నుల టారిఫ్ రేట్ కోటా కేటాయింపు కోసం 2022 మేలో ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే సన్ఫ్లవర్ ఆయిల్, సోయా బీన్ ఆయిల్ ఉత్పత్తిలో పెరుగుదల కారణంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ రేట్ కోటా కేటాయింపును ఉపసంహరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ రేట్ కోటా కింద ముడి పొద్దు తిరుగుడు విత్తన నూనె దిగుమతులను నిలిపివేయాలని ప్రభుత్వం మార్చిలో నిర్ణయించింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ముడి పొద్దుతిరుగుడు విత్తన నూనెను దిగుమతి చేసుకోవడానికి టారిఫ్ రేట్ కోటా కేటాయింపులు ఉండవని తెలిపింది. క్రూడ్ సోయాబీన్ ఆయిల్ విషయంలో కూడా ఈ ఏడాది జనవరిలో ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ముడి సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్, ముడి సోయాబీన్ ఆయిల్కు సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల సుంకం రహిత దిగుమతి వర్తిస్తుంది. ఇక ముడి పొద్దుతిరుగుడు నూనె కోసం టారిఫ్ రేట్ కోటా ఈ సంవత్సరం జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! -
వంటనూనె శుద్ధి కర్మాగారాలపై దాడులు
కాకినాడ: వంటనూనె శుద్ధి కర్మాగారాలపై అగ్మార్క్ అధికారులు శనివారం దాడులు జరిపారు. నకిలీ అగ్మార్క్ వినియోగిస్తున్న లోహియం కంపెనీ నుంచి రూ. 13 లక్షల విలువైన వంటనూనె స్వాధీనం చేసుకున్నారు. నకిలీ శుద్ధి కర్మాగారం యాజమాన్యంపై సర్పవరం పోలీస్ స్టేషన్లో అగ్మార్క్ అధికారులు ఫిర్యాదు చేశారు. వేరుశెనగ, సన్ఫ్లవర్ ఆయిల్లో 80శాతం పామాయిల్ కలుపుతున్నారని అధికారులు గుర్తించారు. -
షట్డౌన్
ప్రొద్దుటూరు, న్యూస్లైన్: జిల్లాలోని నూనె మిల్లులు సంక్షోభంలో ఉన్నాయి. మూడు నెలలుగా ఈ పరిస్థితి నెలకొంది. కొద్ది నెలల క్రితం నూనె మిల్లులు కళకళలాడుతుండేవి. ప్రస్తుతం మిల్లులు ఆడని కారణంగా బోసిపోయాయి. విత్తనాల కొరత ఇందుకు ప్రధాన కారణమని వ్యాపారులు తెలుపుతున్నారు. జిల్లాలోని ప్రొద్దుటూరు, బద్వేలు, కడప, రాయచోటి, మైదుకూరు, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో సుమారు 50 నూనె మిల్లులు ఉన్నాయి. ఇందులో 15 మిల్లుల వరకు ప్రొద్దుటూరులోనే ఉండటం గమనార్హం. ఇక్కడి నుంచే ట్యాంకర్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు నూనెను తరలిస్తుంటారు. ఈ పరిశ్రమపై ఆధారపడి వందల మంది కూలీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్నారు. మిల్లుల యజమానులు విత్తనాల లభ్యతను బట్టి పొద్దుతిరుగుడు నూనె (సన్ఫ్లవర్ ఆయిల్), వేరుశనగ నూనెను తయారు చేస్తుంటారు. వేరుశనగ నూనెను నేరుగా మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉండగా పొద్దుతిరుగుడు నూనెను మాత్రం రీఫైండ్ కోసం హైదరాబాద్కు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం విత్తనాల కొరత తో పాటు ధరలు కూడా పడిపోవడంతో పరిశ్రమకు గడ్డుకాలం ఏర్పడింది. కొంత కాలం క్రితం హోల్ సేల్గా 10 కిలోల వేరుశనగ నూనె రూ.1100 ఉండగా ప్రస్తుతం రూ.700 ఉంది. అలాగే పొద్దుతిరుగుడు నూనె (రా ఆయిల్) 10 కిలోలు రూ.720-620కి తగ్గింది. దిగుమతుల ప్రభావం కారణంగానే ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో యాంత్రీకరణ ప్రభావం కారణంగా పొద్దుతిరుగుడు పంట స్థానంలో ఎక్కువగా శనగ పంటను రైతులు సాగు చేస్తున్నారు. దీంతో పొద్దుతిరుగుడు పంట విస్తీర్ణం 25 శాతానికి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. ఆగిన మిల్లును తిరిగి నడపాలంటే కనీసం మూడు రోజులకు సరిపడ విత్తనాలైనా ఉండాలని, అవి దొరకడం కష్టతరంగా ఉందని ఓ వ్యాపారి తెలిపాడు. వేరుశనగ విస్తీర్ణం కూడా తగ్గిపోవడంతో నూనెమిల్లులకు విత్తనాల కొరత ఏర్పడింది. కొంత మంది వ్యాపారులు అనంతపురం జిల్లా నుంచి వేరుశనగ విత్తనాలు కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. దిగుమతుల ప్రభావమే కారణం ఇతర దేశాల నుంచి నూనెలు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. దీంతో లోకల్ మార్కెట్లో నూనెతోపాటు విత్తనాల ధరలు పడిపోయాయి. ప్రభుత్వం పన్ను రాయితీ ఇవ్వడంతో విచ్చలవిడిగా నూనెలు దిగుమతి అవుతున్నాయి. దీంతో మిల్లులు సంక్షోభంలో ఉన్నాయి. - గువ్వల నారాయణరెడ్డి, ఆయిల్ మిల్లర్, ప్రొద్దుటూరు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement