breaking news
Sumitomo mitsui Trust Bank of Japan
-
బ్యాంకింగ్లో మరిన్ని విదేశీ సంస్థల ఎంట్రీకి సానుకూలం
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్బ్యాంక్లో సుమితోమో మిత్సుయి ఫైనాన్షియల్ గ్రూప్ (ఎస్ఎంఎఫ్జీ) 20 శాతం వాటాలు కొనుగోలు చేయడమనేది భారతీయ బ్యాంకింగ్ రంగంలో ఇతర విదేశీ సంస్థల ప్రవేశానికి సానుకూలాంశంగా ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది. ఈ డీల్తో యస్బ్యాంకులో అతి పెద్ద వాటాదారుగా బోర్డులో ఇద్దరిని నియమించుకోవడంతో పాటు బ్యాంకుపై ఎస్ఎంఎఫ్జీకి గణనీయమైన నియంత్రణ కూడా లభిస్తుందని పేర్కొంది. ఈ లావాదేవీని పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్తులోను ఇలాంటి డీల్స్ మరిన్ని నమోదు కావచ్చని వివరించింది. వోటింగ్ హక్కులు, పెట్టుబడి పరిమితులను పెంచితే విదేశీ బ్యాంకు ఇన్వెస్టర్లు మరింత ఆసక్తి చూపించవచ్చని పేర్కొంది. భారత్లో కార్యకలాపాలను విస్తరించాలనుకుంటున్న విదేశీ బ్యాంకులు.. దేశీయంగా మధ్య స్థాయి బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయొచ్చని వివరించింది. ప్రస్తుతం విదేశీ పెట్టుబడుల నిబంధనల ప్రకారం భారతీయ బ్యాంకుల్లో విదేశీ సంస్థల ఓటింగ్ హక్కులపై 26 శాతం, పెట్టుబడులపై 15 శాతం పరిమితి ఉంది. -
వాటా విక్రయానికి యస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ)సహా పలు ప్రయివేట్ రంగ బ్యాంకులు సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న యస్ బ్యాంక్లో కొంతమేర వాటా విక్రయించనున్నాయి. తద్వారా జపనీస్ దిగ్గజం సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్ఎంబీసీ) మొత్తం 20 శాతం వాటా సొంతం చేసుకోనుంది. ఒక్కో షేరుకి రూ. 21.50 ధరలో ఇందుకు రూ. 1,483 కోట్లు వెచ్చించనుంది. వెరసి దేశీ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద లావాదేవీగా ఈ వాటా విక్రయం నమోదుకానున్నట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. ఎస్ఎంబీసీకి యస్ బ్యాంక్లో 13.19 శాతం వాటా ఎస్బీఐ విక్రయించనుంది. డీల్ విలువ రూ. 8,889 కోట్లు. ఈ బాటలో ఇతర బ్యాంకులు యాక్సిస్, బంధన్, ఫెడరల్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్, కొటక్ మహీంద్రా ఉమ్మడిగా 6.81 శాతం వాటా అమ్మనున్నాయి. వీటి విలువ రూ. 4,594 కోట్లు. ఫలితంగా యస్ బ్యాంక్లో అతిపెద్ద వాటాదారుగా ఎస్ఎంబీసీ అవతరించనుంది. 2020 మార్చిలో యస్ బ్యాంక్ పునర్నిర్మాణ పథకంలో భాగంగా 2020 మార్చిలో ఎస్బీఐసహా 7 ప్రయివేట్ రంగ బ్యాంకులు ఇన్వెస్ట్ చేశాయి. సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(ఈసీసీబీ) యస్ బ్యాంక్లో 13.19 శాతం వాటాకు సమానమైన 413.44 కోట్ల షేర్లను విక్రయించేందుకు అనుమతించినట్లు ఎస్బీఐ పేర్కొంది. యస్ బ్యాంక్లో ప్రస్తుతం ఎస్బీఐ 24 శాతం వాటా కలిగి ఉంది. 13 శాతంపైగా వాటా అమ్మకం ద్వారా రూ. 8,889 కోట్లు అందుకోనుంది. ఇతర బ్యాంకులలో హెచ్డీఎఫ్సీ 2.75 శాతం, ఐసీఐసీఐ 2.39 శాతం, కొటక్ మహీంద్రా 1.21 శాతం, యాక్సిస్ 1.01 శాతం, ఐడీఎఫ్సీ ఫస్ట్ 0.92 శాతం, ఫెడరల్ 0.76 శాతం, బంధన్ 0.7 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. తదుపరి దశ వృద్ధికి తాజా లావాదేవీ దోహదపడనున్నట్లు యస్ బ్యాంక్ ఈ సందర్భంగా పేర్కొంది. కాగా.. ఇందుకు ఆర్బీఐ, సీసీఐ తదితర నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించవలసి ఉంది. టాప్–2లో జపనీస్ దిగ్గజం సుమితోమొ మిత్సుయి ఫైనాన్షియల్ గ్రూప్ అనుబంధ సంస్థ ఎస్ఎంబీసీ 2 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. తద్వారా జపాన్లో రెండో పెద్ద బ్యాంకింగ్ కార్పొరేషన్గా నిలుస్తోంది. దేశీయంగా ప్రధాన విదేశీ బ్యాంకులలో ఒకటిగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా సొంత అనుబంధ సంస్థ, డైవర్సిఫైడ్ ఎన్బీఎఫ్సీ.. ఎస్ఎంఎఫ్జీ ఇండియా క్రెడిట్ కంపెనీని నిర్వహిస్తోంది. వాటా చేతులు మారుతున్న వార్తలతో యస్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 10 శాతం జంప్చేసి రూ. 20 వద్ద ముగిసింది. -
రిలయన్స్ బ్యాంకులో సుమితొమోకు 10% వాటా!
న్యూఢిల్లీ: ప్రతిపాదిత రిలయన్స్ బ్యాంకులో జపాన్ ఆర్థిక సేవల దిగ్గజం సుమితొమో మిత్సుయ్ ట్రస్ట్ బ్యాంక్ ఆఫ్ జపాన్(ఎస్ఎంటీబీ)కు 10 శాతం వాటా ఇవ్వాలని రిలయన్స్ క్యాపిటల్ భావిస్తోంది. యూనివర్సల్ బ్యాంకింగ్ లెనైన్స్కు దరఖాస్తు చేసేందుకు ఉత్సాహంగా ఉన్న అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్(అడాగ్).... ఆర్బీఐ తుది మార్గదర్శకాల విడుదల కోసం వేచిచూస్తోంది. ఇటీవలే అడాగ్ గ్రూప్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్.. ఎస్ఎంటీబీతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూ.371 కోట్ల పెట్టుబడితో ఎస్ఎంటీబీ రిలయన్స్ క్యాపిటల్లో 2.77 శాతం వాటాను తీసుకుంది. తద్వారా దీర్ఘకాలంలో విభిన్న వ్యాపారాల్లో ఎస్ఎంటీబీని భాగస్వామిగా చేసుకోవాలనేది అడాగ్ ప్రణాళిక. కాగా, మరో జపాన్ భాగస్వామ్య సంస్థ నిప్పన్ లైఫ్కు కూడా ప్రతిపాదిత బ్యాంకింగ్ వెంచర్లో 10 శాతం వాటాను ఇచ్చేందుకు రిలయన్స్ క్యాపిటల్ సుముఖంగా ఉంది. నిప్పన్ లైఫ్ వాటా 49 శాతానికి...! బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ను జారీ చేయడంతో.. అడాగ్ గ్రూప్ జోరు పెంచుతోంది. రిలయన్స్ క్యాపిటల్కు చెందిన రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో నిప్పన్ లైఫ్కు మరింత వాటా ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. నిప్పన్ లైఫ్కు ప్రస్తుతం 26 శాతం వాటా ఉండగా... దీన్ని 49 శాతానికి పెంచుకునే అంశంపై ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు రిలయన్స్ క్యాప్ సీఈఓ శ్యామ్ ఘోష్ చెప్పారు. అదేవిధంగా హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారాల్లో కూడా విదేశీ కంపెనీలకు వాటాలు ఇచ్చే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.