breaking news
strays
-
అడవి దాటి గ్రామంలో చొరబడ్డ నమీబియా చీతా.. స్థానికులు హడల్..
భోపాల్: మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కులో ఉన్న నమీబియాలో చీతాల్లో ఒకటి అడవి దాటి బయటకు వెళ్లింది. ఫారెస్ట్ ఏరియా నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జార్ బరోడా గ్రామంలో చొరబడింది. దీంతో చీతాను చూసి గ్రామస్థులు హడలిపోతున్నారు. ఈ చీతా పేరు ఒబాన్. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు వెంటనే ప్రత్యేక బృందంతో రంగంలోకి దిగారు. చీతా జాడ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దాన్ని తిరిగి అడవికి తరలించేందుకు శ్రమిస్తున్నారు. అయితే చీతా తమ ఊర్లోకి చొరబడిన దృశ్యాలను గ్రామస్థుడు ఒకరు వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్గా మారింది. Sheopur, Madhya Pradesh | Cheetah Oban, one of the cheetahs brought from Namibia, entered Jhar Baroda village of Vijaypur which is 20 kms away from Kuno National Park. Monitoring team has also reached the village. Efforts are underway to bring the cheetah back: DFO (Video… pic.twitter.com/4iQAoB6tcz — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 2, 2023 కాగా.. భారత్లో అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికాతో భారత్ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే గతేడాది ప్రధాని మోదీ జన్మదినం సందర్బంగా 8 చీతాలను నమీబియా నుంచి తీసుకొచ్చి కునో జాతీయ పార్కులో విడుదల చేశారు. అయితే వీటిలో ఒకటి ఇటీవలే కిడ్నీ సమస్యతో చనిపోయింది. ఆ తర్వాత రెండు మూడు రోజులకే మరో చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ చీతాల తర్వాత దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలను కూడా భారత్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇవి కూడా అడవిలోనే క్వారంటైన్ కేంద్రంలో ఉన్నాయి. కొద్ది రోజుల తర్వాత వీటిని స్వేచ్ఛగా విడిచిపెడతారు. చదవండి: రెండో పెళ్లి కావలి అంటూ పోలీస్టేషన్లో వధువు హల్చల్! మద్యంమత్తులో ఊగిపోయి.. -
అనాథ కుక్కలకు అదో శరణాలయం..!
ప్రకృతి సంపదతో పర్యాటకుల్ని పులకరింపజేసే కోస్లారికా ప్రాంతం.. రకరకాల వన్యప్రాణులకు, వృక్షాలకే కాక అనాథ శునకాలకూ ఆశ్రయమిచ్చే శరణాలయం అని మీకు తెలుసా? జంతు ప్రేమికులు, పెంపుడు జంతువుల కోసం ఎదురు చూసే వారికి వందలకొద్దీ శునకాలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆశ్రయం పొందుతున్న ఆ శునకాలు.. వాటిని చేరదీసి ఆశ్రయం ఇచ్చి... పెంచుకునే వారికోసం ఎదురు చూస్తున్నాయి. టెర్రటోరియో డి జెగ్వేట్స్ వీధికుక్కలు హాయిగా జీవించగలిగే ఓ ప్రైవేట్ అభయారణ్యం. సుమారు 900 శునకాలు అక్కడ ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హాయిగా జీవిస్తున్నాయి. జంతు ప్రేమికులు.. ఓ కొత్త నేస్తం కోసం ఎదురు చూసేవారికి కోస్టారికాలోని ఆ ఆశ్రమం అందుబాటులో ఉంది. మరోవైపు పర్యటకులు ఒకేచోట రకరకాల శునకాలను వీక్షించి ఆనందించే అవకాశం ఆ సంస్థ కల్పిస్తోంది. 'వాలంటీర్ రన్' కార్యక్రమంతో కోస్టారికాలోని ఆ విశాలమైన అటవీ ప్రాంతంలో వందలకొద్దీ శునకాలకు ఆహారం, స్నానపానాలు, వసతి సౌకర్యాలు కూడ కల్పిస్తున్నారు. తిండీ తిప్పలూ లేక, బక్క చిక్కి, అనేక వ్యాధులు సోకి వీధుల్లో అనాథలుగా తిరుగుతున్న కుక్కలను చూసిన తర్వాత వాటికో శరణాలయం స్థాపించాలన్న ఆలోచన తనకు వచ్చిందని స్థాపకురాలు ల్యా బ్యాటిల్ చెప్తారు. తాను వెళ్ళే మార్గంలో ప్రతిరోజూ వీధికుక్కలను చూసేదాన్నని, నిస్సహాయంగా ఉన్న వాటిలో కొన్నింటిని చూస్తే వాటికీ ఎంతో జీవితం ఉందని, అది హాయిగా జీవించేందుకు తగ్గ సహాయం అందించడం తప్పనిసరి అనిపించేదని, అదే కర్తవ్యంగా భావించి... అటువంటి అనాథ శునకాలను తెచ్చి ఆరోగ్యసేవలు అందించి, శుభ్రపరచి మంచి కుటుంబాలు తయారయ్యేట్లుగా చేస్తున్నానని ఆమె చెప్తున్నారు. అలాగే వాటికి మంచి లక్షణాలను అలవరచి ఇష్టపడి పెంచుకునే వారికోసం అందుబాటులో ఉంచుతున్నామని ల్యా చెప్తున్నారు. అయితే అదృష్టంకొద్దీ తాను ఆశ్రయం కల్పించిన శునకాల్లో ఎక్కువ శాతం అభిమానంగా, ఆదరణీయంగా ఉండటంతోపాటు... తాను చెప్పినట్లుగా విని, తన సేవలు అందుకుంటున్నాయని, కొన్ని తనను తిరస్కరించి వెళ్ళిపోతున్నాయని ల్యా అంటున్నారు. పెంచుకునేందుకు వచ్చేవారికి ప్రతి కుక్క వివరాలు షెల్టర్ బిల్ బోర్డులో చూసేందుకు వీలుగా అందుబాటులో ఉంచారు. ఇప్పటికే సుదూర ప్రాంతాలనుంచీ సైతం ఇక్కడకు వచ్చి ఈ శునకాలను పెంచుకునేందుకు అనేక మంది స్వీకరిస్తున్నట్లు ల్యా బ్యాటిల్ తెలిపారు.