-
రాష్ట్ర పారిశ్రామిక విధానం భేష్
హైదరాబాద్ అమెరికన్ కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హుడా హైదరాబాద్: దేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో పారిశ్రామి కంగా ఎంతో మేలు జరుగుతోందని, ప్రధానంగా తెలంగాణ పారిశ్రామిక విధానం ఎంతో ఉపయుక్తంగా ఉందని హైద రాబాద్ అమెరికన్ కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హుడా పేర్కొన్నారు. హైదరా బాద్ నాలెడ్జ్ సిటీలోని సలార్పురియా సత్వా భవనంలో సింక్రోని ఫైనాన్షియల్ సంస్థ రెండో కార్యాలయ భవనాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. భారత్– అమెరికా దేశాల మధ్య మైత్రి వీడదీయ లేనిదని ఆమె అన్నారు. ఇటీవలే భారత ప్ర«ధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ల భేటీలు ఇరుదేశాల సంబంధా లను మరింత బలోపేతం చేశాయన్నారు. ఆర్థిక, ఐటీ, సైనిక, ఎరోస్పేస్, సాంస్కృ తిక, ఇతర రంగాల్లో రెండు దేశాల మధ్య పరస్పర అవగాహన మరింతగా పెరిగిందన్నారు. అమెరికా దేశానికి చెందిన 130 కంపెనీలు హైదరాబాద్ నగరంలో పనిచే స్తున్నాయని ఆమె చెప్పారు. సింక్రోని ఫైనాన్షియల్ ఇండి యా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫైసలుద్ధీన్ మాట్లాడుతూ.. 1999లో ఇక్కడ సైబర్ టవర్స్లో కార్యక్రమాలను ప్రారంభిం చామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ, ఐల్యాబ్స్, సైబర్గేట్వేలలో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సీఎస్ఆర్ నిధుల కింద ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో 400 మంది రోగుల కోసం ఆర్థి«క సహాయాన్ని ఆస్పత్రి ప్రతినిధి హరిహరన్కు అందజే శారు. అలాగే మణికొండ ప్రభుత్వ పాఠశాలలోని 1,200 మంది విద్యార్థుల కోసం ప్రిన్సిపల్ నిరంజన్కు చెక్ను అందిం చారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర పారిశ్రామిక విధానం భేష్
పటాన్చెరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం గొప్పగా ఉందని పటాన్చెరు, రామచంద్రాపురం, పాశమైలారం పారిశ్రామికవేత్తల సంఘం ప్రతినిధులు కొనియాడారు. మంగళవారం పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ భవన్లో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఫ్యాప్సియా మాజీ అధ్యక్షుడు హనుమంతరావు, చిన్నపరిశ్రమల సంఘం అధ్యక్షుడు నర్సింగ్రావు, పటాన్చెరు ఐలా అధ్యక్షుడు జనార్దన్రెడ్డి, కార్యదర్శి కళా రమేష్, పారిశ్రామికవేత్తల సంఘం నాయకులు చంద్రమౌళి, దుర్గాప్రసాద్, గోకుల్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఇలాంటి పారిశ్రామిక విధానం ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషిచేస్తూ ఎంతో మేలు చేసే పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఫ్యాప్సియా మాజీ అధ్యక్షుడు హనుమంతరావు మాట్లాడుతూ సమైక్య రాష్ట్ర సీఎం రోశయ్య హయాంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం జీఓ బయటకు రావడానికే ఆరు నెలలు పట్టిందని గుర్తు చేశారు. ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా కేసీఆర్ నాలుగు రోజుల్లోనే నాలుగు జీవోలను వెలువరించారని కొనియాడారు. చైనా, గుజరాత్లను మించిన గొప్ప పారిశ్రామిక విధానం తెలంగాణ రాష్ట్రంలో అమలులోకి వచ్చిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీలకు నూతన పారిశ్రామిక విధానంలో ప్రోత్సాహకాలు ఉన్నాయన్నారు. పారిశ్రామిక వాడల్లో ఎస్సీ, ఎస్టీలకు ఎకరా భూమికి రూ. 100 చొప్పున ఏడాదికి లీజు కింద భూ కేటాయింపులు జరుగుతాయన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు రూ. 10 లక్షల సబ్సిడీ ఇస్తున్నారన్నారు. సర్వీసు టాక్స్, వ్యాట్, పవర్ రిబేటు తదితర రాయితీలన్నీ గొప్పగా ఉన్నాయన్నారు. గత పాలసీ కింద రాయితీలు పొందిన వారికి కూడా ప్రస్తుత ప్రభుత్వ పాలసీలో లబ్ధి చేకూర్చే అవకాశం కల్పించారన్నారు. బ్యాంకు రుణాల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారన్నారు. నిరుద్యోగుల సమస్యకు నూతన పారిశ్రామిక విధానం పరిష్కారం చూపుతుందన్నారు. పారిశ్రామికవేత్తలు అడగని వాటికి కూడా రాయితీలు కల్పించాన్నారు. చిన్న పరిశ్రమల సంఘం అధ్యక్షుడు నర్సింగ్రావు మాట్లాడుతూ గొప్ప పారిశ్రామిక విధానం తెచ్చారని కొనియాడారు. పారిశ్రామిక వేత్త చంద్రమౌళి మాట్లాడుతూ చెరువుల అభివృద్ధి పథకంతో విద్యుత్ వాడకం తగ్గుతుందన్నారు. ఆ విద్యుత్ను పరిశ్రమలకు అందించేందుకు సీఎం కేసీఆర్ దూర దృష్టితో పనిచేస్తున్నారన్నారు. పటాన్చెరు ఐలా అధ్యక్షుడు జనార్దన్రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తల సమస్యలను సీఎం క్షుణ్ణంగా పరిశీలించి మంచి పాలసీ రూపొందించారన్నారు. కార్యక్రమంలో లఘుపరిశ్రమల సంఘం అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement