-
క్రికెటర్లకు వెరీ వెరీ స్పెషల్
మారేడ్పల్లి, న్యూస్లైన్: క్రికెట్ క్రేజీ నగరంలో అకాడమీలకు లెక్కేలేదు. ఆసక్తిని క్యాష్ చేసుకునే సెంటర్లు ఎన్నో ఉంటే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అకాడమీలు కొన్నే! సరిగ్గా ఈ కోవలోకే చెందిన నాణ్యమైన కోచింగ్ అకాడమీ... ‘సెయింట్ జాన్స్’. ఈస్ట్మారేడుపల్లిలో ఉన్న ఈ క్రికెట్ అకాడమీలో ఓనమాలు నేర్చుకున్న పలువురు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో మెరిశారు. హైదరాబాద్ క్రికెట్ దిగ్గజం, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఇక్కడ శిక్షణ తీసుకునే అంతర్జాతీయ క్రికెట్లో ‘వెరీ వెరీ స్పెషల్’గా అవతరించాడు. అనుభవజ్ఞలైన కోచ్ల నేతృత్వంలో రెండున్నర దశాబ్దాలుగా నడుస్తున్న ఈ అకాడమీలో నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు ఆట నేర్చుకుంటున్నారు. వేసవిలోనైతే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఇద్దరు కలిసి... మన నగరంలోనూ చక్కటి శిక్షణనిచ్చే అకాడమీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మాజీ రంజీ క్రికెటర్లు ఎం.వి. నరసింహారావు, జాన్ మనోజ్లు కలిసి దీన్ని ప్రారంభించారు. 1987 మార్చి 11న ‘సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ’ పేరిట క్రికెట్ కోచింగ్కు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం హైదరాబాద్లో కొనసాగుతున్న క్రికెట్ అకాడమీలన్నీ దీని తర్వాతే పుట్టుకొచ్చాయి. వీవీఎస్ లక్ష్మణ్ మొదలుకొని తాజాగా హనుమ విహారి వరకు ఎందరో క్రీడాకారులు ఇక్కడే ఓనమాలు దిద్దారు. అలా 26 ఏళ్లుగా ఔత్సాహిక క్రికెటర్లెందరికో ఇక్కడ పాఠాలు నేర్పుతున్నారు జాన్ మనోజ్. ప్రతి విభాగంలోనూ ప్రత్యేక శిక్షణ ఆరేళ్ల పిల్లల నుంచి వర్ధమాన క్రికెటర్ల వరకు వివిధ స్థాయిల్లో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం, సాయంత్రం సెషన్ల వారిగా విద్యార్థుల చదువులకు ఆటంకం కలగని రీతిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమారు 22 మంది సుశిక్షితులైన కోచ్లు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, కీపింగ్ తదితర విభాగాల్లో క్రీడాకారుల ప్రతిభకు పదును పెడుతున్నారు. జాన్ మనోజ్తో పాటు పి. ప్రసన్న కుమార్ (1979-89 రంజీ ప్లేయర్) వంటి కోచ్లు నిరంతరం ఆటగాళ్లకు అందుబాటులో ఉంటున్నారు. భిన్నమైన పిచ్లపై ప్రాక్టీసు, శిక్షణ ఇస్తుండడం ఈ అకాడమీ ప్రత్యేకత. క్రీడాకారులను శారీరకంగా, మానసికంగా తీర్చిదిద్దుతున్నారు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేవిధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వసతులు... పిచ్లు... ఆధునిక సదుపాయాలన్నీ ఈ అకాడమీలో ఉన్నాయి. ఆరు మ్యాటింగ్ వికెట్లు, మూడు టర్ఫ్ వికెట్లు, 2 ఆస్ట్రోటర్ఫ్ వికెట్లతో పాటు ఒక సిమెంట్ పిచ్ ఈ సెంటర్లో అందుబాటులో ఉన్నాయి. ఆటకు ముందు శారీరక కసరత్తుల కోసం ప్రత్యేక జిమ్ సౌకర్యం కూడా ఉంది. అప్పటి హుడా (ఇప్పుడు జీహెచ్ఎంసీ) సహకారంతో మైదానాన్ని తీర్చిదిద్దారు. ఇక్కడ కేవలం క్రికెట్ కోచ్లే కాదు... ఫిజియోలు, డాక్టర్లు సైతం శిక్షణార్థులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ట్రెయినింగ్ మధ్యలో సీనియర్ క్రికెటర్లు, కోచ్లు అకాడమీని సందర్శించి వర్ధమాన క్రీడాకారులతో తమ అనుభవాల్ని పంచుకుంటారు. అమూల్యమైన సూచనలు అందిస్తారు. వేసవిలో ప్రత్యేక శిబిరాలు ఏడాది పొడవునా ఉదయం 5.45 గంటల నుంచి 8.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు సెషన్లలో 170 మంది చొప్పున 340 మంది క్రికెటర్లు శిక్షణ తీసుకుంటున్నారు. వేసవిలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. విజేతలెందరో.... హైదరాబాద్ క్రికెట్ బ్రాండ్ వీవీఎస్ లక్ష్మణ్... సచిన్ సారథ్యంలో భారత్కు ఆడిన నోయల్ డేవిడ్, ఎమ్మెస్కే ప్రసాద్లు ఆట నేర్చుకుంది ఇక్కడే. 2012 అండర్-19 భారత క్రికెట్ టీమ్ సభ్యుడు, దేవధర్ ట్రోఫీలో సౌత్జోన్ ప్లేయర్ హనుమ విహారీ సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ విద్యార్థే. వీరే కాకుండా పదుల సంఖ్యలో క్రీడాకారులు దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నారు. -
అండర్-16 విజేత సెయింట్ జాన్స్ రెడ్
ఎఫ్సీఏ క్రికెట్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ క్రికెట్ అకాడమీస్ (ఎఫ్సీఏ) నిర్వహించిన ఇంటర్ అకాడమీ అండర్-16 టోర్నమెంట్లో సెయింట్ జాన్స్ (రెడ్) జట్టు విజేతగా నిలిచింది. గురువారం బేగంపేట పబ్లిక్ స్కూల్ గ్రౌండ్లో జరిగిన ఫైనల్లో రెడ్ 7 వికెట్ల తేడాతో సెయింట్ జాన్స్ ‘బ్లూ’ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బ్లూ 29.1 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. అజయ్ దేవ్ గౌడ్ 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా...అభిషేక్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెడ్ 24.3 ఓవర్లలో 3 వికెట్లకు 143 పరుగులు చేసింది. నిఖిల్ 46, భగత్ 40 పరుగులు చేయగా మోనుల్ 25 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆఫ్ స్పిన్నర్ అభిషేక్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
విండీస్ కెప్టెన్గా స్యామీ
సెయింట్ జాన్స్: వచ్చే నెలలో జరగనున్న భారత్ పర్యటన కోసం వెస్టిండీస్ టెస్టు జట్టును ఎంపిక చేశారు. మొత్తం 15 మంది సభ్యుల బృందాన్ని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. పేసర్ డారెన్ స్యామీకి మరోసారి జట్టు పగ్గాలు అప్పగించారు. భారత్, వెస్టిండీస్ల మధ్య రెండు టెస్టులు (నవంబర్ 6 నుంచి 10; 14 నుంచి 18 వరకు) జరుగుతాయి. ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న వెస్టిండీస్ ‘ఎ’ జట్టులోని ఏడుగురు ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు దక్కింది. జట్టు: స్యామీ (కెప్టెన్), బెస్ట్, డారెన్ బ్రేవో, చందర్పాల్, కొట్రీల్, డియోనరైన్, ఎడ్వర్డ్స్, గేల్, పెరుమాల్, పావెల్, రామ్దిన్, రోచ్, శామ్యూల్స్, షిల్లాంగ్ఫోర్డ్, వాల్టన్. -
సెయింట్ జాన్స్కు టైటిల్
జింఖానా, న్యూస్లైన్: కోకాకోలా క్రికెట్ కప్ను సెయింట్ జాన్స్ చర్చ్ జూనియర్ కాలేజి కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సెయింట్ జాన్స్ 9 వికెట్ల తేడాతో వెస్లీ బాయ్స్ కాలేజిపై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్లీ బాయ్స్ జూనియర్ కాలేజ్ జట్టు 160 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులో శ్రీనాథ్ (51), వినీత్ రెడ్డి (61) అర్ధ సెంచరీలు సాధించి చక్కని ప్రదర్శన కనబరిచారు. సెయింట్ జాన్స్ బౌలర్స్ మిఖిల్ జైస్వాల్ 3 వికెట్లు, రిత్విక్ 4 వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన సెయింట్ జాన్స్ కేవలం ఒక్క వికెట్ నష్టానికి 161 పరుగులు చేసి విజయం సాధించింది. మిఖిల్ జైస్వాల్ 58 పరుగులు చేయగా, భగత్ వర్మ 82 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. టోర్నీ అంతటా ఉత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీ చైతన్య స్కూల్ జట్టు ఆటగాడు యష్ కపాడియా బెస్ట్ బ్యాట్స్మెన్ ట్రోఫీ అందుకోగా, బెస్ట్ బౌలర్ అవార్డు సెయింట్ జాన్స్ ఆటగాడు సీహెచ్ రిత్విక్ దక్కించుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ టైటిల్స్ను సెయింట్ జాన్స్ చర్చ్ ఆటగాడు మిఖిల్ జైస్వాల్ సొంతం చేసుకున్నాడు. టైటిల్ విన్నర్కు హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు జి. వినోద్ బహుమతిని అందించారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఎన్నికల వేళ.. చేపల చెరువు తవ్వకం
108 వాహనంలో ప్రసవం
15 నుంచి భీమవరంలో అతిరాత్ర మహాయాగం
Lok Sabha Election 2024: నాలుగో దశలో 67.70% పోలింగ్
పచ్చ ముఠాల విధ్వంస కాండ
ఓట్ల పండగకు సొంతూళ్లకు..
ఓటర్లూ.. ఈ నిబంధనలు పాటించండి
నేత్రపర్వం.. చాత్మార్ ఉత్సవం
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ఓటు హక్కు.. వినియోగిద్దాం ఇలా..
తప్పక చదవండి
- గన్నవరంలో టీడీపీ గలాటా
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- Lok Sabha Election 2024: మహిళలకు ‘మహాలక్ష్మి’ గ్యారెంటీ: సోనియా
- నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
- పల్నాట పచ్చ మూక బీభత్సకాండ
- వెచ్చని హృదయ రాగ సందేశం
- Lok Sabha Election 2024: రాయ్బరేలీ కోసం మేము.. అదానీ, అంబానీ కోసం మోదీ
- Lok Sabha Election 2024: నాలుగో దశలో 67.70% పోలింగ్
- Lok Sabha Election 2024: ఓటేస్తే ఉచిత బైక్ రైడ్
- Lok Sabha Election 2024: ఇండోర్లో ఉచిత పోహా, జిలేబీ..
Advertisement