-
కుంగిన అవినీతి 'కట్ట'.. చర్యలకు ఆదేశించిన ఎమ్మెల్యే ఆర్కే రోజా
పుత్తూరు రూరల్ (చిత్తూరు జిల్లా): అడుగడుగునా అవినీతి మేటలు నింపి నిర్మించిన పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ (ఎస్ఎస్) ట్యాంక్ గట్టు మంగళవారం కుంగిపోయింది. రూ.55 కోట్ల వ్యయంతో మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ బినామీ కంపెనీ పేరుతో దీని నిర్మాణం చేపట్టారు. నాలుగేళ్లపాటు జరిగిన ఈ పనుల్లో నాణ్యత ఏమాత్రం లేదని అప్పట్లోనే పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నీరు నింపి ఏడాది కాకుండానే ట్యాంక్ గట్టు 10 అడుగుల లోతున, దాదాపు 200 మీటర్ల పొడవున కుంగిపోయింది. గండి పడితే పుత్తూరులోని భవానీ నగర్, ఈశ్వరాపురం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ట్యాంకు నిర్మాణం నాసిరకంగా జరుగుతోందని, పనుల్లో అవినీతి రాజ్యమేలుతోందని నిర్మాణ సమయంలో ఆరోపణలు వెల్లువెత్తినా పట్టించుకోలేదని.. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నామని పుత్తూరు వాసులు అంటున్నారు. కాసుల కక్కుర్తితో.. 2006లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సహకారంతో అప్పటి పుత్తూరు ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు పుత్తూరు చెరువును సమ్మర్ స్టోరేజీ ట్యాంకుగా మార్పు చేయించారు. నియోజకవర్గానికి రూ.55 కోట్లతో మంజూరైన అతి పెద్ద కాంట్రాక్ట్ కావడంతో తన కుమారుడు గాలి భానుప్రకాష్కు ఆ పనులు అప్పగించారు. జయ్గణేష్ అండ్ కన్స్ట్రక్షన్కు చెందిన గురు అనే బినామీ పేరిట గాలి భానుప్రకాష్ ఈ పనులు చేయించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం పాటించడం లేదంటూ అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వాటిని పెడచెవిన పెట్టిన ముద్దుకృష్ణమ నాయుడు 2010 నాటికి పని పూర్తయ్యిందనిపించారు. 2009 ఎన్నికల నాటికే టీడీపీలో చేరిన ఆయన నగరి ఎమ్మెల్యేగా గెలుపొందినా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడటంతో ట్యాంక్ను అధికారికంగా ప్రారంభించలేదు. ఏళ్ల తరబడి నిరుపయోగంగా.. ట్యాంక్ నిర్మాణం పూర్తయి 11 ఏళ్లు పూర్తవగా.. పదేళ్లుగా ట్యాంకులోకి చుక్కనీరు కూడా చేరలేదు. ఎమ్మెల్యే ఆర్కే రోజా చొరవతో గతేడాది నుంచి వృథాగా పోతున్న పుత్తూరు చెరువు నీటిని ట్యాంక్లోకి పంపింగ్ చేస్తున్నారు. ఇటీవల వర్షాలు విస్తారంగా కురవడంతో ట్యాంక్లోకి సుమారు 60 శాతం నీరు చేరింది. ఈ నేప«థ్యంలో ట్యాంక్ కట్ట లోపలే పగుళ్లు వచ్చి కుంగిపోయిందని అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్టర్పై చర్యలు చేపట్టండి: ఎమ్మెల్యే ఆర్కే రోజా రూ.కోట్లను దోచేసి అరకొర పనులతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించిన జయ్గణేష్ అండ్ కన్స్ట్రక్షన్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, తగిన చర్యలు చేపట్టాలని ఏపీఐఐసీ చైర్పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చిత్తూరు కలెక్టర్ హరినారాయణ్ను కోరారు. పుత్తూరు ఎస్ఎస్ ట్యాంకు కుంగిపోయిన వైనాన్ని, పొంచి ఉన్న ప్రమాద విషయాలను కలెక్టర్కు ఆమె ఫోన్ ద్వారా వివరించారు. అస్తవ్యస్తంగా, అవినీతిమయంగా నిర్మించిన సదరు కాంట్రాక్టర్ ద్వారానే కట్టను పునరుద్ధరించాలని కోరారు. అప్పటి క్వాలిటీ కంట్రోల్ అధికారులపైనా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రమాదం జరగకుండా తక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు. ట్యాంక్ను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి కుంగిపోయిన ఎస్ఎస్ ట్యాంక్ను ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి మంగళవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వందేళ్ల కిత్రం నిర్మించిన పిచ్చాటూరు ట్యాంకు నేటికీ చెక్కు చెదరలేదని, పదేళ్ల క్రితం నిర్మించిన కట్ట కుంగిపోవడం అవినీతిని బట్టబయలు చేస్తోందని అన్నారు. ప్రమాదం జరిగితే దిగువ గ్రామాలు దెబ్బతింటాయని, వెంటనే తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎస్ఎస్ ట్యాంకును కలెక్టర్ హరినారాయణన్ పరిశీలించి వెంటనే మరమ్మతు పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పుత్తూరు, ఈశ్వరాపురం గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయమని ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
వర్షం కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
కర్నూలు(ఎమ్మిగనూరు): రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని ముస్లిం సోదరులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గిడిచినా వర్షాలు కురవపోవడంతో జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కరువుఛాయలు అలుముకున్నాయి. సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో పనులు దొరకక వ్యవసాయ కూలీలు పట్టణాలకు వలస పోతున్నారు. ముస్లింలు రెండు రోజులుగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ అల్లాను వేడుకుంటున్నారు. శనివారం ఉదయం 7:30 గంటలకు ఎస్ఎస్ ట్యాంక్ సమీపంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
ఎస్ఎస్ ట్యాంకులో పడిన విద్యార్థి
ఒంగోలు క్రైం : ఒంగోలుకు రక్షిత మంచినీటిని అందించే ఎస్ఎస్ ట్యాంకు-2లో గురువారం సాయంత్రం 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రమాదవశాత్తు పడిపోయాడు. నగరంలోని సాయిబాబా సెంట్రల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న పిన్నిక సాయి అనుదీప్ ఎస్ఎస్ ట్యాంకు పక్కన తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకున్నాడు. ఒంగోలు అన్నవరప్పాడుకి చెందిన అనుదీప్ ముగ్గురు స్నేహితులతో కలిసి ఎస్ఎస్ ట్యాంకు కట్టపైకి ఎక్కి చూస్తుండగా చేతులో ఉన్న సెల్ కిందపడిపోయింది. అది జారుకుంటూ ఎస్ఎస్ ట్యాంకు నీళ్ల అంచువద్దకు వెళ్లింది. ఆ సెల్ఫోన్ తీసుకునేందుకు కట్టపై నుంచి నీళ్ళ వద్దకు ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో దిగాడు. ప్రమాదవశాత్తు కాలుజారి నీళ్ళలో పడ్డాడు. ఈత రాకపోవడంతో అనుదీప్ నీళ్ళలో నీట మునిగిపోయాడు. కట్ట మీద ఉన్న అతని స్నేహితులు పెద్దగా కేకలు వేశారు. కట్ట పక్కనే క్రికెట్ ఆడుతున్న మిగతా స్నేహితులు కూడా పరిగెత్తుకుంటూ కట్టపైకి ఎక్కారు. ఎవరికీ ఈత రాకపోవడంతో చేసేది లేక కేకలు వేయడంతోనే సరిపెట్టారు. సాయిబాబా సెంట్రల్ స్కూలు విద్యార్థులకు వెంగముక్కలపాలెం రోడ్డులోని క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం సైన్స్ఫేర్ ఏర్పాటు చేశారు. ఈ సైన్స్ ఫేర్ కోసం క్విస్ కాలేజీకి వచ్చిన విద్యార్థులు సాయంత్రం ఎస్ఎస్ ట్యాంకు-2 పక్కనే ఉన్న క్రికెట్ గ్రౌండుకి ఆడుకోవడానికి వచ్చారు. క్రికెట్ ఆడిన తరువాత కట్టపైకి ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న తాలూకా సిఐ ఎస్ ఆంటోని రాజ్ తన సిబ్బందితో ఎస్ఎస్ ట్యాంకు వద్దకు చేరుకున్నారు. హుటాహుటిన గజ ఈతగాళ్ళను పిలిపించి గాలింపు చేపట్టారు. రాత్రి పొద్దుపోయే వరకు వెతికినా మృతదేహం లభ్యం కాలేదు. ఈ సమాచారాన్ని అనుదీప్ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఘటనా స్థలంలో మృతుడి తల్లిదండ్రులు, సహ విద్యార్థుల రోదనలతో విషాదం చోటుచేసుకుంది
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
తప్పక చదవండి
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement