breaking news
srinivas kalyanbabu
-
పదిమందికి సాయపడితే...
శ్రీనివాస కళ్యాణ్, ఖుష్బూ పోద్దార్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘వెల్కం జిందగీ’. శాలు–లక్ష్మణ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం పిల్లర్ 9 ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందింది. ఈ సినిమా టీజర్ని డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘వెల్కం జిందగీ’ టీజర్ చూశాక సినిమాలో మంచి కంటెంట్ ఉందనిపిస్తోంది. ఈ సినిమా బాగా ఆడాలి’’ అన్నారు. దర్శకులు శాలు, లక్ష్మణ్ మాట్లాడుతూ– ‘‘మన చుట్టూ ఉన్న పదిమందికి మనం చేసే చిన్న సాయం వారి జీవితాల్లో ఎలాంటి ఆనందాన్ని, వెలుగును నింపుతుందో చెబుతూ సాయం ప్రాముఖ్యతను వివరించే చిత్రం ఇది. ఫ్యామిలీ డ్రామాతో పాటు ప్రేమకథ ఆకట్టుకుంటుంది. మధుమణి, కమల్ల నటన సినిమాకే హైలైట్గా నిలుస్తుంది. ‘జబర్దస్త్’ ఫేం కొమురం కామెడీ ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. శ్రీసాయి ప్రతి ఫ్రేమ్ను అందంగా తెరకెక్కించారు. గౌతమ్ రవిరామ్ సంగీతం చక్కగా కుదిరింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు చివరి దశలో ఉన్నాయి’’ అని తెలిపారు. -
సీబీఐ మాజీ చీఫ్ కేవీఆర్ కుమారుడిపై సీబీఐ కేసు
తప్పుడు పత్రాలతో రుణం సీబీఐకి బ్యాంకు అధికారుల ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: సీబీఐ మాజీ డెరైక్టర్ కె.విజయరామారావు కుమారుడు శ్రీనివాస్ కళ్యాణ్రావుపై సీబీఐ కేసు నమోదు చేసింది. తప్పుడు పత్రాలతో బ్యాంకు ను మోసం చేసి రూ.304 కోట్ల రుణం పొందారన్న ఆరోపణలపై బెంగళూరులోని సీబీఐ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం ఈ కేసు నమోదు చేసి శ్రీనివాస్ కార్యాలయంతోపాటు చెన్నై, హైదరాబాద్లోని ఆయన నివాసాలపై దాడులు నిర్వహించింది. శనివా రం రాత్రి జరిపిన ఈ సోదాల్లో అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై కేంద్రంగా శ్రీనివాస్ తమిళనాడు బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థకు ఎండీగా ఉన్నారు. సంస్థ పేరుతో కార్పొరేషన్ బ్యాంకు నుంచి రూ.120 కోట్లు, సెంట్రల్ బ్యాంకు నుంచి రూ.124 కోట్లు, ఆంధ్రాబ్యాంకు నుంచి రూ.60 కోట్లు రుణం తీసుకున్నారు. యంత్రాలతోపాటు వివిధ పరికరాలు కొనుగోలు కోసం ఈ రుణం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తప్పుడు బిల్లులు సమర్పించారని, ఈ విషయం అంతర్గత ఆడిటింగ్లో తేలిందని బ్యాంకు అధికారులకు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో రం గంలోకి దిగిన సీబీఐ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం అధికారులు ఐపీసీలోని 120(బీ) నేర పూరిత కుట్ర, 420 (మోసం), 471 (మోసం చేయాలనే ఉద్దేశంతో ఫోర్జరీ పత్రాలు సృష్టించడం), 471 (తప్పుడు పత్రాలను నిజమైనవిగా నమ్మించడం) తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన విజయరామారావు 1993 నుంచి 1996 వరకు సీబీఐ డెరైక్టర్గా విధులు నిర్వహిం చారు. ఈ కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, దర్యా ప్తు ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.