breaking news
srikanth reddy deeksha
-
బాబు నిప్పయితే.. తోక ముడిచారెందుకు?
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అన్ని ఆధారాలతో దొరికేసిన చంద్రబాబు తాను నిప్పు అని చెప్పుకుంటూ బిల్డప్ ఇవ్వడం సిగ్గు చేటు అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మీ బాబు నిప్పు అయితే.. అసెంబ్లీలో చర్చకు తోక ముడిచారెందుకు’ అని టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీశారు. ‘స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో రూ.371 కోట్లను షెల్ కంపెనీలకు విడుదల చేసిన చంద్రబాబు తిరిగి వాటిని తన ఖాతాలోకి ఎలా జమ చేసుకున్నాడనే వాస్తవాల్ని పత్రికల్లో చదివాం. కానీ.. అసలు ఇందులో నిజాల్ని పూర్తిగా అందరికీ కళ్లకు కట్టినవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరిగింది. ఆ చర్చలో పాల్గొంటే వాస్తవాలు బయట పడతాయనే భయంతో సభ నుంచి పలాయనం చిత్తగించారు. టీడీపీ సభ్యులు ఎందుకు పారిపోవాల్సి వచి్చందో చెప్పాలి’ అని కోరారు. చంద్రబాబు స్కామ్లను అధికారులు బయటపెడితే అదేదో రాజకీయ కక్ష సాధింపు అనడం సరికాదన్నారు. చంద్రబాబు తప్పు చేయకపోతే రూ.కోట్లు వెచి్చంచి లాయర్లను ఎందుకు పెట్టుకుంటారని నిలదీశారు. అసెంబ్లీ సాక్షిగా స్కామ్లను ఎండగట్టాం అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అండ్ కో చేసిన స్కామ్లను ఎండగట్టామని గడికోట అన్నారు. అడ్డంగా బుక్కైన చంద్రబాబు, లోకేశ్ కుంభకోణాల ఆధారాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయన్నారు. అన్ని కుంభకోణాలకు సూత్రధారులు, పాత్రధారులు తండ్రీ కొడుకులే అన్నారు. మళ్లీ అధికారంలోకి రావాలని.. అందిన కాడికి దోచుకోవాలన్నదే టీడీపీ ఉద్దేశమని పేర్కొన్నారు. పచ్చ మీడియా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని.. ఎల్లో మీడియా చేస్తున్నది జర్నలిజమా? చంద్రబాబు ఇజమా? అని ప్రశ్నించారు. తన భర్త క్రూరత్వాన్ని, స్వార్థ రాజకీయాల్ని నారా భువనేశ్వరి గుర్తు తెచ్చుకోవాని కోరారు. అసెంబ్లీలో వైఎస్సార్సీపీ నేతలెవరూ ఆమెను అవమానించలేదని, నిజానిజాలేంటో ఆమె చంద్రబాబునే నిలదీయాలని పేర్కొన్నారు. ఒక మహిళగా భువనేశ్వరిని ఎప్పుడూ వైఎస్సార్సీపీ గౌరవిస్తుందన్నారు. టీడీపీ సభ్యుల తీరు జుగుప్సాకరం అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగితే.. మొదటి రెండ్రోజుల్లో టీడీపీ సభ్యుల జుగుప్సాకరమైన తీరును చూసి ప్రజలు అసహ్యించుకున్నారని శ్రీకాంత్రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్పై చర్చలో పాల్గొంటే అభాసు పాలవుతామనే భయంతో సమావేశాల మొదటి రోజు నుంచే గందరగోళం సృష్టించారన్నారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి.. కంప్యూటర్లను, ఇతర వస్తువుల్ని లాగిపడేశారని, పేపర్లు చించి స్పీకర్ మొహాన విసిరేశారని గుర్తు చేశారు. మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం, విజిల్స్తో సభలో గందరగోళం సృష్టించిన దృశ్యాలనూ ప్రజలంతా చూశారన్నారు. కేవలం ముగ్గుర్ని మాత్రమే సస్పెండ్ చేస్తే.. మిగిలిన సభ్యులు సమావేశాలకు హాజరుకాకుండా ఎందుకు బాయ్కాట్ చేయాల్సి వచ్చిందో సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. -
ప్రాణ త్యాగానికైనా సిద్ధం : శ్రీకాంత్ రెడ్డి
కడప : సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ కుయుక్తులు, టీడీపీ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ పోరాటం సాగించేందుకు వారు దీక్షకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే శ్రీకాంత్రెడ్డి, రవీంద్రనాథ్రెడ్డిలు కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తెలుగుతల్లి కడుపుకోతకు గురయ్యే పరిస్థితి కల్పించినా, విభజన పేరుతో సీమకు అన్యాయం జరగబోతోందని తెలిసినా అధికార పార్టీ నేతలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికే శ్రీకాంత్రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయినా ప్రభుత్వంలో చలనం రాకపోవండంతో ఆమరణదీక్ష చేపట్టారు. విభజనపై కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ దీక్ష కొనసాగుతుందని, ఈ ప్రక్రియలో తమ ప్రాణాలు పోయినా లెక్క చేయమని శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.