-
దివికేగిన దిగ్గజం
టి20 క్రికెట్ మాయలో పడి, సత్తా ఉన్నా... ఐదు రోజుల ఆటకు బైబై చెప్పేసి... జస్ట్ నాలుగు ఓవర్లేసే లీగ్లకు జైకొట్టే బౌలర్లున్న ఈ రోజుల్లో సంప్రదాయ టెస్టులకే సర్వం ధారపోసిన స్పిన్నర్ బిషన్సింగ్ బేడీ. ఆయన మునివేళ్లతో బంతిని సంధిస్తే వికెట్. ఆయన స్పిన్ ఉచ్చు బిగిస్తే ప్రత్యర్థి ఆలౌట్. అంతలా... భారత క్రికెట్లో తన స్పిన్తో వికెట్లను దున్నేసిన దిగ్గజం బేడీ. ఎరాపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్లతో కలిసి దుర్బేధ్యమైన స్పిన్ త్రయంగా ప్రత్యర్థి జట్లను విలవిలలాడించాడు. ఈ త్రయానికి తర్వాత శ్రీనివాస్ వెంకటరాఘవన్ జతయ్యాక బ్యాటర్లకు చిక్కులు, చుక్కలే కనిపించేవంటే అతిశయోక్తి కాదు. క్రికెట్ జగాన్ని స్పిన్ మాయాజాలంతో ఊపేసిన బిషన్ సింగ్ ఆఖరి శ్వాస విడిచి దివికేగాడు. భారత క్రికెట్ను కన్నీట ముంచాడు. న్యూఢిల్లీ: భారత క్రికెట్లో స్పిన్కే వన్నెలద్దిన బౌలింగ్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ సోమవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. స్పిన్ శకాన్ని శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆయన వయస్సు 77 ఏళ్లు. గత రెండేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్నారు. పలు శస్త్రచికిత్సలు కూడా జరిగాయి. నెల క్రితం మోకాలు ఆపరేషన్ జరిగింది. అనారోగ్యంతో సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ఆయన సోమవారం ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. మోకాలు శస్త్రచికిత్స అనంతరం సోకిన ఇన్ఫెక్షన్ క్రమంగా పెరగడంతోనే మృతి చెందినట్లు ఆయన సన్నిహితుడొకరు వెల్లడించారు. ఈ పంజాబీ క్రికెట్ స్టార్ 1946లో సెపె్టంబర్ 25న అమృత్సర్లో జన్మించారు. తదనంతరం క్రికెట్లో చెరగని ముద్ర వేసి ఢిల్లీలో సెటిలయ్యారు. ఆయనకు భార్య అంజు, కుమారుడు అంగద్ బేడీ (సినీనటుడు) ఉన్నారు. అంగద్ భార్య నేహ ధూపియా బాలీవుడ్ హీరోయిన్. మొదటి భార్య గ్లెనిత్ మైల్స్ ద్వారా ఇద్దరు సంతానం కొడుకు గావసిందర్, కుమార్తె గిలిందర్ ఉన్నారు. స్పిన్నర్లు ఉపఖండానికే పరిమితమనే విమర్శల్ని తన స్పిన్ మంత్రతో విదేశీ గడ్డపై తిప్పిగొట్టిన ఘనత బిషన్ సింగ్ది. తన కెరీర్ అనంతరం కూడా క్రికెట్తో అనుబంధాన్ని కొనసాగించారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)కు విశేష సేవలందించారు. విరాట్ కోహ్లి సహా ఎంతో మంది కుర్రాళ్లకు ఫిట్నెస్ గురించి పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. కోహ్లి తను ఫిట్నెస్ను కాపాడుకోవడానికి బేడీనే కారణమని పలు సందర్భాల్లో చెప్పాడు. ఇదీ చరిత్ర... సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లి లాంటి బ్యాటర్లు అసలైన క్రికెట్ టెస్టు ఫార్మాటేనని ఘంటాపథంగా చెప్పే సంప్రదాయ క్రికెట్లో స్పిన్నర్గా బేడీ ఓ వెలుగు వెలిగాడు. ఈ తరం క్రికెటర్లు మెరుపుల టి20లకు అలవాటు పడి టెస్టు క్రికెట్ను పక్కన బెడుతున్నారు. మరి బిషన్ సింగ్ ఐదు రోజుల టెస్టుల్లో, నాలుగు రోజుల ఫస్ట్క్లాస్ క్రికెట్లో సుదీర్ఘకాలం దేశానికి, రాష్ట్రానికి సేవలందించాడు. 1967 నుంచి 1979 వరకు తన అంతర్జాతీయ కెరీర్లో 67 టెస్టులాడిన స్పిన్ లెజెండ్ 266 వికెట్లను పడగొట్టాడు. ఇన్నింగ్స్లో 5 వికెట్లు 14 సార్లు తీశాడు. ఉత్తమ ప్రదర్శన 7/98. ఇక 370 ఫస్ట్క్లాస్ క్రికెట్లో 1,560 వికెట్లను చేజిక్కించుకున్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా బిషన్ సింగ్ పేరిటే ఇంకా రికార్డు ఉండటం విశేషం. ఫస్ట్క్లాస్ ఫార్మాట్లో బిషన్ ఇన్నింగ్స్లో 5 వికెట్లను ఏకంగా 106 సార్లు పడగొట్టారు. మ్యాచ్లో 10 వికెట్లను 20 సార్లు తీశాడు. ఉత్తమ ప్రదర్శన 7/5. వన్డే ఫార్మాట్లో తక్కువగా 10 మ్యాచ్లే ఆడాడు. 7 వికెట్లు తీశాడు. 1975 తొలి వన్డే వరల్డ్కప్లో, 1979 రెండో వన్డే వరల్డ్కప్లో బేడీ భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. 1975 వరల్డ్కప్లో ఈస్ట్ ఆఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో బిషన్ 12 ఓవర్లు వేసి 8 మెయిడెన్లు తీసుకొని కేవలం 6 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. అంతేకాదు...‘బేడీ సాబ్’ విజయవంతమైన సారథి కూడా! 22 టెస్టులకు నాయకత్వం వహించి 6 మ్యాచ్ల్లో భారత్ను గెలిపించాడు. ఇందులో మూడైతే విదేశీ గడ్డపై సాధించిన ఘనవిజయాలున్నాయి. బేడీ కెప్టెన్సీలోనే భారత జట్టు 1976లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో 403 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ రికార్డు 27 ఏళ్ల పాటు (2003 వరకు) చరిత్ర పుటల్లో నిలిచింది. 1970లో కేంద్ర ప్రభుత్వంనుంచి ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న బిషన్ సింగ్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2004లో ‘సీకే నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్’ అవార్డుతో సత్కరించింది. ఇదీ ఘనత... ఈ భారత స్లో లెఫ్టార్మ్ స్పిన్నర్ అంటే అరివీర ఆజానుబాహులైన విండీస్ బ్యాటర్లకు వణుకే! ముఖ్యంగా 1970వ దశకంలో ప్రపంచ క్రికెట్ను తన స్పిన్ తో శాసించాడు. 1969–70 సీజన్లో భారత్, ఆ్రస్టేలియాల మధ్య జరిగిన ముఖాముఖి టెస్టు సిరీస్లో 20.57 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. 1972– 73 సీజన్లో ఇంగ్లండ్తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో 25.28 సగటుతో 25 వికెట్లు తీశాడు. ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహస్వప్నమయ్యే వెస్టిండీస్ బ్యాటర్లను వారి సొంతగడ్డపై గడగడలాడించిన బౌలర్ ఎవరైన ఉన్నారంటే అది బేడీనే! 1975–76 సీజన్లో 25.33 సగటుతో 18 వికెట్లు చేజిక్కించుకున్నాడు. ఆ మరుసటి సీజన్లో న్యూజిలాండ్ను తిప్పేసి 13.18 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. ఈ 1976–77 సీజన్లోనే ఇంగ్లండ్ మెడకు స్పిన్ ఉచ్చు బిగించి 25 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 1977–78 సీజన్లో ఈసారి ఆ్రస్టేలియా పనిపట్టాడు. 23.87 సగటులో 31 వికెట్లు తీశాడు. అరుణ్ జైట్లీ పేరుపెడితే నొచ్చుకున్నారు! ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలోని స్టాండ్కు బిషన్ సింగ్ బేడీ పేరు పెట్టారు. అయితే మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ మృతి అనంతరం ఆ స్టేడియానికి జైట్లీ పేరు పెట్టడాన్ని తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. క్రికెటేతరుడి పేరు పెట్టడాన్ని సహించలేక స్టాండ్కు తన పేరు తొలగించాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. భారత క్రికెట్పై చెరగని ముద్ర బిషన్ సింగ్ మరణ వార్తను తట్టుకోలేకపోయా. స్పిన్పై ఆయనకున్న పట్టు, ఆటపై కనబరిచే పట్టుదల అసాధారణం. భావి క్రికెటర్లకు, భవిష్యత్ తరాలకు అతని అంకితభావం స్ఫూర్తిదాయకం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి. –ప్రధాని నరేంద్ర మోదీ బేడీ మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. –ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అలర్డైస్ స్పిన్ బౌలింగ్తో క్రికెట్ పుటల్లోకెక్కారు. భారత క్రికెట్లో స్పిన్కు మూలస్తంభంలా ఉన్నారు. అలాంటి దిగ్గజం మనమధ్య లేకపోవడం బాధాకరం. –బీసీసీఐ కార్యదర్శి జై షా బేడీ మార్గదర్శనం వల్లే ఇంగ్లండ్లో నా తొలి శతకం సాకారమైంది. అలాంటి లెజెండ్ ఇప్పుడు లేకపోవడం బాధాకరం. –బ్యాటింగ్ దిగ్గజం సచిన్ స్పిన్నర్లందరికి ఆయనే స్ఫూర్తి. యువతరానికి దిక్సూచి. బిషన్సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి నా సానుభూతి. –మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే బిషన్ సింగ్ లేరన్న వార్త జీర్జించుకోలేనిది. భారత క్రికెట్కోసం ఎంతో చేశారు. ఆయన కుటుంబానికి దేవుడు స్థయిర్యాన్ని ఇవ్వాలి. –మాజీ ఓపెనర్ గంభీర్ చాలా బాధగా ఉంది. ముమ్మాటికీ బిషన్సింగ్ గ్రేటెస్ట్ క్రికెటర్. యువ క్రికెటర్లు ఎదిగేందుకు ఎంతో పాటుపడ్డారు. –సీనియర్ స్పిన్నర్ అశ్విన్ బేడీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నాను. –మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ అంత్యక్రియలకు హాజరైన కపిల్, సెహ్వాగ్ ‘సర్దార్ ఆఫ్ స్పిన్’ బిషన్ సింగ్ బేడీ పార్థివ దేహానికి 1983 ప్రపంచకప్ కెప్టెన్ , దిగ్గజ ఆల్రౌండర్ కపిల్ దేవ్, 2011 ప్రపంచకప్ విజేత సభ్యుడు సెహ్వాగ్ తదితర మేటి, మాజీ క్రికెటర్లు నివాళులర్పించారు. స్థానిక లోధి స్మశానవాటికలో మంగళవారం నిర్వహించిన అంత్యక్రియలకు కీర్తి ఆజాద్, మదన్లాల్, నెహ్రా, అజయ్ జడేజా, మురళీ కార్తీక్, జహీర్, అజహరుద్దీన్ తదితర క్రికెటర్లు హాజరయ్యారు. కడసారి వీడ్కోలు పలికేందుకు వచ్చిన అభిమానులు, జూనియర్ క్రికెటర్ల అశ్రునయనాల మధ్య పంజాబీ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. -
అక్టోబరులో 800
శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘800’. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించగా, ఆయన భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ కనిపిస్తారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో వివేక్ రంగాచారి ఈ బయోపిక్ను నిర్మించారు. ఈ సినిమా దేశవ్యాప్త థియేట్రికల్ రిలీజ్ హక్కులను నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు.ఈ సినిమాను అక్టోబరు 6న విడుదల చేస్తున్నట్లుగా గురువారం చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ‘800’ సినిమాను వచ్చే నెల 6న విడుదల చేస్తున్నాం. ముత్తయ్య మురళీధరన్ జీవితంలోని క్రికెట్ అంశాలను గురించి మాత్రమే కాదు.. ఆయన బాల్యంలో జరిగిన ఘటనలను కూడా ఈ చిత్రంలో చూపిస్తాం. కేవలం క్రికెట్ ప్రేమికులనే కాదు.. ప్రేక్షకులందరినీ ఆకట్టుకునే భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా పట్ల శ్రీపతి అంకితభావం, పట్టుదల చూసి ఈ సినిమాకు ఓకే చెప్పాను. ప్రజలంతా ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు ముత్తయ్య మురళీధరన్. ఈ చిత్రానికి సంగీతం: జీబ్రాన్. -
క్రికెట్కు గుడ్బై చెప్పిన న్యూజిలాండ్ స్పిన్నర్
న్యూజిలాండ్ లెగ్ స్పిన్నర్ టాడ్ ఆస్టిల్ అన్ని రకాల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్మీడియా వేదికగా ఆస్టిల్ వెల్లడించాడు. తన ఈ అద్భుత ప్రయాణంలో మద్దతుగా నిలిచిన న్యూజిలాండ్ క్రికెట్కు, అభిమానులకు అతడు ధన్యవాదాలు తెలిపాడు. అదే విధంగా కాంటర్బరీ క్రికెట్ క్లబ్ తనకు ఎన్నో జ్ణాపకాలను అందించిందని ఆస్టిల్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక న్యూజిలాండ్ తరపున అన్నిఫార్మాట్ల్లో కలిపి 19 మ్యాచ్లు ఆడిన ఆస్టిల్ 24 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆస్టిల్కు జాతీయ జట్టు తరపున కాకుండా దేశీవాశీ క్రికెట్లో ఘనమైన రికార్డు ఉంది.అతడు దేశీవాశీ క్రికెట్లో దాదాపు 300కి పైగా మ్యాచ్లు ఆడాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో కాంటర్బరీ తరపున అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు కూడా అతడి పేరిటే ఉంది. అతడు తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 334 వికెట్లు పడగొట్టాడు. ఇక 36 ఏళ్ల ఆస్టిల్ తన క్రికెట్ కెరీర్లో చివరి మ్యాచ్ ఈ ఏడాది జరిగిన సూపర్ స్మాష్ ఫైనల్లో కాంటర్బరీ తరపున ఆడాడు. ఈ ఏడాది సూపర్ స్మాష్ సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన అతడు 11 వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by Todd Astle (@todd.astle) చదవండి: Prithvi Shaw: పృథ్వీ షా 'సెల్ఫీ' వివాదంలో కొత్త ట్విస్ట్..! -
స్పిన్నర్గా మారిన పొలార్డ్.. ముంబై ఇండియన్స్కు ఇక.. వీడియో వైరల్
వెస్టిండీస్ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ సరికొత్త అవతారం ఎత్తాడు. సాదారణంగా మీడియం పేస్ బౌలింగ్ చేసే పొలార్డ్.. తొలి సారి స్పిన్నర్గా మారాడు. ట్రినిడాడ్ టీ10 బ్లాస్ట్లో భాగంగా స్కార్లెట్ ఐబిస్ స్కార్చర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోకా కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పొలార్డ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ అందరనీ ఆశ్చర్య పరిచాడు. సోకా కింగ్స్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన పొలార్డ్ స్పిన్ బౌలింగ్ చేయడమే కాకుండా.. బ్యాటర్ లియోనార్డో జూలియన్ను క్లీన్ బౌల్డ్ కూడా చేశాడు.ఈ మ్యాచ్లో కేవలం ఒకే ఓవర్ బౌలింగ్ చేసిన పొలార్డ్ 10 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. కాగా పొలార్డ్ బౌలింగ్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మంబైకు కొత్త స్పిన్నర్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సోకా కింగ్స్ నిర్ణీత 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. అయితే వర్షం కారణంగా టార్గెట్ను 8 ఓవర్లకు 122 పరుగులకు కుదించారు. ఇక 122 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కార్చర్స్ మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులకు మాత్రమే పరిమితమైంది. అయితే స్కార్చర్స్ కెప్టెన్ పొలార్డ్ మాత్రం కేవలం 8 పరుగుల మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్కు పొలార్డ్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. Kieron Pollard bowling off-spin in the Trinidad T10 Blast.pic.twitter.com/rN0mq04II8 — Johns. (@CricCrazyJohns) February 28, 2022 -
వహ్వా అజాజ్! ఏమా బౌలింగ్.. ధనాధన్గా ‘టెన్’ రికార్డు
ఒకటి, రెండు, మూడు, నాలుగు... భారత ఆటగాళ్లు పెవిలియన్ చేరుతున్నారు... న్యూజిలాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ వికెట్ల లెక్క కూడా మారుతోంది... తొలి రోజు ఆట ముగిసేసరికి పడిన నాలుగు వికెట్లూ అతని ఖాతాలోనే... ఎజాజ్ సంబరపడ్డాడు. తాను పుట్టిన ఊర్లో ఒక గుర్తుంచుకునే ప్రదర్శన వచ్చినందుకు అందరి ముందు సంతోషాన్ని ప్రదర్శించాడు. శనివారం ఉదయం సాహా అవుట్ కాగానే ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ఘనత... ఇదీ చెప్పుకోదగ్గ విశేషమే! తర్వాతి బంతికే ఆరో వికెట్. కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కూడా వచ్చేసింది. టెస్టుల్లో భారత జట్టు తొలి ఆరు వికెట్లు ఒక స్పిన్నర్కు కోల్పోవడం ఇదే తొలిసారి. అయినా సరే అద్భుతం జరగవచ్చని ఎవరూ ఊహించడం లేదు. ‘ఆ ఘనత’ సాధ్యమా అనే చర్చ కూడా వినిపించలేదు. దాదాపు 28 ఓవర్ల పాటు మరో వికెట్ పడకపోవడంతో ఎజాజ్ బౌలింగ్పై విశ్లేషణ కూడా దాదాపుగా ఆగిపోయింది. కానీ ఎజాజ్ మాత్రం యంత్రంలా అలుపెరుగకుండా బౌలింగ్ చేస్తూనే పోయాడు. మయాంక్ వికెట్తో ఒక్కసారిగా కదలిక... ఏదైనా సాధ్యమే అనిపించింది! కొద్ది సేపటి తర్వాత ఆ సమయం రానే వచ్చింది. 7 బంతుల వ్యవధిలో 3 వికెట్లు... అంతే! పదికి పది.. ఎజాజ్ యూనుస్ పటేల్ టెస్టు క్రికెట్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 144 ఏళ్లు... 2,438 టెస్టుల చరిత్రలో జిమ్ లేకర్, అనిల్ కుంబ్లేల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా నిలిచాడు. పాతికేళ్లు తిరిగే సరికి... శుక్రవారం తొలి రోజు 4 వికెట్లు తీసిన ఎజాజ్ పటేల్ ఆట ముగిసిన తర్వాత వాంఖెడే స్టేడియం నుంచి బయటకు వెళుతూ అక్కడి ‘ఆనర్స్ బోర్డ్’ వద్ద క్షణకాలం పాటు ఆగి బోర్డు వైపు చూస్తూ నిలబడ్డాడు. ఈ మైదానంలో సెంచరీలు సాధించిన, ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితా దానిపై ఉంది. రేపు మరో వికెట్ తీసి తన పేరు అక్కడ చేర్చాలని అతను అనుకున్నాడు. అయితే ఐదు వికెట్లే కాదు... మరికొన్ని గంటల్లో ఏకంగా 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టిస్తానని అతను ఊహించి ఉండకపోవచ్చు! ► ముంబైలోనే పుట్టిన ఎజాజ్ ఎనిమిదేళ్ల వయసులో ఉపాధి కోసం అతని కుటుంబం న్యూజిలాండ్కు తరలి వెళ్లింది. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకో, ఇక్కడే ఉండిపోయిన బంధుమిత్రులను కలిసేందుకో గతంలోనూ ఎజాజ్ చాలా సార్లు వచ్చాడు. కానీ ఈసారి మాత్రం పుట్టిన గడ్డపై ఒక అద్భుతాన్ని సృష్టించేందుకే వచ్చినట్లున్నాడు. బాంబేను వీడిన సరిగ్గా 25 ఏళ్ల తర్వాత మరో జట్టు తరఫున ఆడేందుకు వచ్చి భారత్పైనే అతను అత్యంత అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఈ పాతికేళ్ల ప్రస్థానం అతని కళ్ల ముందు కచ్చితంగా సినిమా రీళ్లలా కదలాడి ఉంటుంది! ► ముంబై టెస్టుకు ముందు మూడేళ్ల కెరీర్లో ఎజాజ్ పటేల్ ఆడినవి 10 మ్యాచ్లే! 32.48 పరుగుల సగటుతో 29 వికెట్లు తీసిన సాధారణ లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్. టీమ్ మేనేజ్మెంట్ లెక్కల్లో అతను ఆ జట్టు నంబర్వన్ స్పిన్నర్ కూడా కాదు. సాన్ట్నర్, ఇష్ సోధిల తర్వాతే అతనికి ప్రాధాన్యం. వీరిలో ఎవరైనా తప్పుకుంటేనే మ్యాచ్ దక్కే అవకాశం. కెరీర్ తొలి టెస్టులోనే ఐదు వికెట్ల ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచినా అది అతని కెరీర్ జోరుగా సాగేందుకు ఏమాత్రం పనికి రాలేదు. సరిగ్గా చెప్పాలంటే తాజా ప్రదర్శనకు ముందు 33 ఏళ్ల ఎజాజ్కు పెద్దగా గుర్తింపూ లేదు. కానీ ఇకపై ఎవరూ మరచిపోలేని విధంగా తన పేరును అతను చరిత్రలో చెక్కుకున్నాడు! ► న్యూజిలాండ్ వెళ్లిన తర్వాతే క్రికెట్పై ఎజాజ్కు ఆసక్తి కలిగింది. అయితే ఆటను అతను లెఫ్టార్మ్ పేస్ బౌలర్గా మొదలు పెట్టాడు. స్వింగ్ బౌలర్గా రాణించిన అతను ఆక్లాండ్ తరఫున అండర్–19 స్థాయిలో సౌతీతో సమానంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. అయినా సరే న్యూజిలాండ్ అండర్–19 టీమ్లో అతనికి చోటు దక్కలేదు. 5 అడుగుల 8 అంగుళాల తన ఎత్తు పదునైన పేస్ బౌలింగ్కు పనికి రాదని కూడా అతను గుర్తించాడు. భవిష్యత్తులో కివీస్ తరఫున ఆడాలంటే ఏదైనా ప్రత్యేకంగా చేయాలని అర్థమైంది. తన క్లబ్ తరఫున ఇంగ్లండ్లో మ్యాచ్లు ఆడేందుకు వెళ్లిన ఎజాజ్కు న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్ దీపక్ పటేల్ మార్గదర్శిగా నిలువగా... స్పిన్నర్గా ఎదిగేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని భావించి కఠోర సాధన చేశాడు. వరుసగా మూడేళ్ల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలవడంతో జాతీయ జట్టు పిలుపు లభించింది. 30 ఏళ్ల వయసులో న్యూజిలాండ్ తరఫున తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. ► ఈ పది వికెట్ల జాతరలో ఎజాజ్ ప్రయోగాలేమీ చేయలేదు. సాంప్రదాయ లెఫ్టార్మ్ స్పిన్నర్ వేసే బంతులతోనే సత్తా చాటాడు. ‘లెన్త్’ మాత్రం తప్పకుండా జాగ్రత్త పడ్డాడు. సహచర బౌలర్లు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వకపోవడం కూడా అతనికి మేలు చేసింది. చివరకు రచిన్ రవీంద్ర పట్టిన క్యాచ్తో చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. అయితే దురదృష్టవశాత్తూ గత రెండు సందర్భాలకు భిన్నంగా ఇంత గొప్ప ఆట తర్వాత కూడా ఎజాజ్ ఓటమి పక్షానే నిలవాల్సి వస్తుందేమో! నా క్రికెట్ కెరీర్లో ఇదే అత్యుత్తమ రోజు. ఇక ముందు కూడా ఇదే ఉంటుందేమో. అన్నీ కలిసి రావడంతోనే నేను ముంబైలో ఈ ఘనత సాధించగలిగాను. ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది. నాకు, నా కుటుంబానికి ఇదో ప్రత్యేక క్షణం. ఇంకా నేను ఆనందం నుంచి తేరుకోలేకపోయాను. ఇలాంటి ఘనతకు అందించిన దేవుడికి కృతజ్ఞతలు. ‘10’ వికెట్ల క్లబ్లో చేరడం గర్వకారణం. కుంబ్లే ఘనత నాకు బాగా గుర్తుంది. ఎన్నోసార్లు ఆ వీడియో చూశా. ఇలాంటి క్షణాలు కెరీర్లో ఎప్పుడో గానీ రావు కాబట్టి చివరి వికెట్కు ముందు చాలా ఒత్తిడిలో ఉన్నా. ఆఖరి వికెట్ సమయంలో బంతి గాల్లోకి లేచినప్పుడు అందరం ఎంతో ఉత్కంఠ అనుభవించాం. పదో వికెట్ కోసం ఇతర బౌలర్లు వైడ్ బంతులు వేయాలనే చర్చే మాలో జరగలేదు. తొమ్మిది వికెట్లతో కూడా నేను సంతృప్తి చెందేవాడిని. –ఎజాజ్ పటేల్ 10 వికెట్ల క్లబ్లోకి ఎజాజ్కు స్వాగతం. పర్ఫెక్ట్10. చాలా బాగా బౌలింగ్ చేశావు. టెస్టు తొలి, రెండో రోజు ఇలాంటి ఘనత సాధించడం ఎంతో ప్రత్యేకం. –అనిల్ కుంబ్లే , భారత మాజీ కెప్టెన్ మొత్తం టీమ్ను మన జేబులో వేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఇదో అసాధారణ ప్రదర్శన. –రవిశాస్త్రి, భారత మాజీ హెడ్ కోచ్ టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్ ఎజాజ్ పటేల్. గతంలో ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ జిమ్ లేకర్ (1956 జూలైలో ఆస్ట్రేలియాపై మాంచెస్టర్లో 10/53)... భారత లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (1999 ఫిబ్రవరిలో పాకిస్తాన్పై ఢిల్లీలో; 10/74) మాత్రమే ఈ ఘనత సాధించారు. న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కూడా ఇదే. రిచర్డ్ హ్యాడ్లీ (9/52) రికార్డును ఎజాజ్ బద్దలుకొట్టాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement