-
దళిత, గిరిజనులకు భారీ ‘నిధి’
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) చట్టానికి తాజా బడ్జెట్లో ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. 2023–24 బడ్జెట్లో దళిత, గిరిజనులకు ఏకంగా రూ. 51,983.09 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ. 36,750.48 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ. 15,232.61 కోట్ల చొప్పున నిధుల కేటాయింపులు చేసింది. గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి ఎస్డీఎఫ్ కేటాయింపులు రూ. 4,632.72 కోట్లు పెరిగాయి. ఇందులో ఎస్సీఎస్డీఎఫ్ కేటగిరీలో రూ. 2,182.73 కోట్లు పెరగగా... ఎస్టీఎస్డీఎఫ్ కేటగిరీలో రూ. 1,819.99 కోట్లు పెరిగాయి. దళిత, గిరిజనులకు భారీ స్థాయిలో నిధులివ్వడంతో ఆయా వర్గాల సమగ్ర అభివృద్ధి ముందుకు సాగనుంది. దళితబంధుకు 17,700 కోట్లు.. తాజా బడ్జెట్లో దళితబంధు వాటా అగ్రభాగాన నిలిచింది. 2023–24 బడ్జెట్లో దళితబంధు పథకానికి ప్రభుత్వం రూ. 17,700 కోట్లు కేటాయించింది. హుజూరాబాద్ మినహా మిగతా 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2023–24 వార్షిక సంవత్సరంలో ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. ఒక్కో నియోజకవర్గానికి 1500 యూనిట్ల చొప్పున లబ్ధిదారుల ఎంపిక చేయనుంది. -
రాబందూ... చూశావా ఈ విందు
క్షమించు రాబందూ... మన్నించండి గద్దల్లారా ... అక్రమార్కులు ఎక్కడ అవినీతి చేసినా గద్దల్లా తన్నుకుపోయారు... గద్దల్లా పొడుచుకుతిన్నారు ... రాబందుల్లా మెక్కేశారని ఏ పాపం ఎరుగని మీతో ఈ అవినీతి నేతలను సరిపోల్చుతున్నాం. పొట్ట నింపుకోడానికి చేస్తున్న మీ పనిని కూడా మేం తప్పుపడుతున్నాం. మీ ఆకలి తీరాక ఆ జోలికే పోరు...రేపటి కోసం సంపాదించుకోవాలనే ఆత్రమే మీకు ఉండదు. కానీ గతంలో దండిగా సంపాదించినా... ఇంకా...ఇంకా అంటూ జిల్లాలోని టీడీపీ నేతలు ఆత్యాశతో అభివృద్ధి పనుల పేరిట అక్రమాలకు పాల్ప డ్డారు. తినడంలో మీతో పోటీ పడుతున్నారు. సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి) : స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) పేరుతో జిల్లాకు మంజూరైన నిధులతో టీడీపీ నేతలు పండగ చేసుకున్నారు. రూ.229 కోట్ల నిధుల్లో రూ.111 కోట్ల మేరకు ఖర్చు చేసేసి ప్రజాధనాన్ని లూటీ చేసేశారు. ఇంకో ఏడాది ఎన్నికలు రాకుండా ఉండి ఉంటే ఆ నిధులను కూడా గుటకాయ స్వాహా చేసేసేవారే. ఈ తంతును పసిగట్టిన సీఎం జగన్మోహన్రెడ్డి ‘చెక్’ పెట్టడంతో కోట్ల రూపాయలకుపైగా నిధులు దుర్వినియోగం కాకుండా ఆగిపోయాయి. ఎక్కడ ఆ అవినీతి బయటపడుతుందోనని ‘అభివృద్ధిని అడ్డుకుంటున్నార’ంటూ తెలుగు తమ్ముళ్లు కొంగొత్త గోల చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఆయన అనుచరులు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసిన వైనాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పెద్ద మొత్తాలను టెండర్లుగా పిలిస్తే పోటీ ఏర్పడుతుందనే ఉద్దేశంతో నామినేటెడ్ పద్ధతిలో పనులను దక్కించుకొని భారీగా నిధులు దోచుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న పనులనే ముక్కలు ముక్కలుగా చేసి, విలువను తగ్గించి అప్పనంగా కట్టబెట్టేయడంతో పనులు చేయకుండానే నిధులు కొట్టేసే వ్యూహ రచన చేసి కొంతమేర సఫలీకృతులయ్యారు. ఇంతలో ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఈ దోపిడీకి బ్రేక్ పడింది. కేవలం టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రమే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలున్నచోట ఓడిపోయిన టీడీపీ నేతల పేరున కూడా నిధులు విడుదల చేశారు. నిధులు మంజూరు చేయించుకోండి...నచ్చినంత దోచుకోండి అన్నట్టుగా ప్రజాధనాన్ని గంపగుత్తగా ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ధారాదత్తం చేశారు. ఇలా గత ఐదేళ్లలో తన పార్టీ ఎమ్మెల్యేలకు రూ. 242.60 కోట్ల మేర కేటాయించారు. అంతటితో ఆగకుండా తమ ఎమ్మెల్యేలు సూచనల మేరకు పనులు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇంకేముంది టీడీపీ నేతలు చెలరేగిపోయి నచ్చినట్టుగా పనుల ప్రతిపాదనలు తయారు చేయించి, వాటికి మంజూరు చేయించుకుని, నిధులు ఇష్టారీతిన వాడుకున్నారు. నిబంధనల మేరకైతే రూ.5 లక్షల విలువ దాటితే సంబంధిత పనులకు విధిగా టెండర్లు పిలవాలి. ఓపెన్ టెండర్ల ద్వారా ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి కాంట్రాక్ట్ అప్పగించాలి. ఇలా చేస్తే అన్ని పార్టీలకు చెందిన వారు టెండర్లలో పోటీ పడతారని, ఏకపక్షంగా తమ వారికి పనులు దక్కవనే ఉద్దేశంతో వర్క్ విలువను రూ.5 లక్షలు దాటకుండా ఇంజినీరింగ్ అధికారుల ద్వారా డిజైన్ చేయించారు. సంవత్సరాల వారీగా ఎస్డీఎఫ్ వినియోగ అధికారిక వివరాలివి ( సంవత్సరం మంజూరైననిధులు (కోట్లలో) పూర్తయిన పనులు ఖర్చు చేసిననిధులు (కోట్లలో) 2015–16 28.00 641 25.30 2016–17 43.29 729 27.93 2017–18 88.94 1594 46.16 2018–19 69.18 343 11.99 229.41 3307 111.38 వాస్తవానికి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు విలువున్న పనులు అనేకం ఉన్నాయి. అయితే, వాటికి టెండరు పిలవాల్సి వస్తుందని ఒకే వర్క్ను ఆరేడు భాగాలు (ముక్కలు ముక్కలు)గా చేసి పనుల ప్రతిపదనలు తయారు చేయించి, వాటిని మంజూరు చేసేలా అధికారులపై ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఎక్కడే వర్క్ జరిగిందో తెలియని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల ఒకే వర్క్ను చూపించి రెండు మూడు బిల్లులు చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక వర్క్ను తూర్పు నుంచి పడమరకు వైపునకు, అదే వర్క్ను పడమర వైపు నుంచి తూర్పునకు చూపించి రెండేసి బిల్లులు చేసుకున్నారన్న వాదనలున్నాయి. ఇలా పంచి పెట్టిన పనులను నామేకే వాస్తేగా చేసి, కొన్ని పనులకు పైపై మెరుగులు దిద్ది పెద్ద ఎత్తున నిధులు దోచేశారు. ఎన్నికలకు ముందు హడావుడి ఎన్నికల ముందు నాయకులకు తాయిలాలుగా మరింత ఎరవేసే యత్నం ఎమ్మెల్యేలు చేశారు. అంతకుముందు సంవత్సరాల్లో బేరం కుదరక ఆగిన పనులను, మరికొన్ని ఎన్నికలకు ముందు సీఎం చేత మంజూరు చేయించుకున్న పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించేందుకు హడావుడి చేశారు. అయితే, ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో కొందరు సానుకూలంగా వ్యవహరించగా, మరికొందరు ఎన్నికలప్పుడు ఎందుకింత హడావుడి అని సహకరించలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా 1935 పనులు ప్రారంభ దశలో ఉండగా, రూ.52.02 కోట్ల విలువైన పనులు ప్రారంభం కాకుండా ఉండిపోయాయి. ప్రారంభ దశలో ఉన్న పనులకు దాదాపు రూ.60 కోట్ల వరకు చెల్లింపులు జరిగిపోవడం గమనార్హం. కొత్త ప్రభుత్వ ఆదేశాలతోవందల కోట్ల దోపిడీకి బ్రేక్ గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా ఇంజినీరింగ్ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, టెండర్లు పిలవకుండా నామినేటేడ్ పద్ధతిలో వందల కోట్ల రూపాయల పనులను ఏకపక్షంగా కట్టబెట్టి దోచిపెట్టారని అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదిలోనే గుర్తించారు. అధికారుల ద్వారా రప్పించుకున్న నివేదికల ఆధారంగా చేసుకుని ఇంజినీరింగ్ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో 25 శాతంలోపు జరిగిన పనులకు బిల్లులు చెల్లింపులు చేయకుండా ఆపాలని, ప్రారంభం కాని పనులను పూర్తిగా రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో జిల్లాలో ప్రారంభ దశలో ఉన్న 1935 పనులు దోపిడీకి గురికాకుండా ఆగాయి. అలాగే, ప్రారంభం కాని 1268 పనులకు సంబంధించిన రూ.52.02 కోట్ల నిధులు మంజూరు కాకుండా నిలిపివేశారు. ప్రభుత్వం అప్రమత్తం కాకపోయి ఉంటే సందట్లో సడేమియాలా వీటిని కూడా ఊదేసేవారు. -
ఐదంచెల పర్యవేక్షణలో ‘ఎస్డీఎఫ్’
ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి మార్గదర్శకాలు విడుదల సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఎస్టీ, ఎస్టీ అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్ల) మార్గదర్శకాలు విడుదల య్యాయి. దాదాపు ఆర్నెళ్ల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. గతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కంటే కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... పక్కా పర్యవేక్షణకు మార్గదర్శకాలిచ్చింది. ప్రత్యేక అభివృద్ధి నిధి కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కొత్తగా ఐదంచెల విధానాన్ని తీసుకొచ్చింది. నిధుల వినియోగంలో రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయికి చేరే క్రమంలో పర్యవేక్షణ, నిర్వహణ, నిఘాకు ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసింది. ఎస్సీ/ఎస్టీ ఎస్డీఎఫ్ల అమలులో ప్రధానంగా రాష్ట్ర కౌన్సిల్ కీలకపాత్ర పోషించనుంది. దీనికి ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరి స్తారు. ఇందులో కేబినెట్ మంత్రులు, ఎంపిక చేసిన ఎస్సీ/ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి ఎస్సీ అభివృద్ధి/ గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మెంబర్ కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయిలో నోడల్ ఏజెన్సీలు...: ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ల అమలులో రాష్ట్ర స్థాయిలో రెండు నోడల్ ఏజెన్సీలతో కమిటీలుంటాయి. ఆయా శాఖల మంత్రులు ఈ నోడల్ కమిటీలకు చైర్మన్లుగా.., మెంబర్ కన్వీనర్లుగా ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వ్యవహరిస్తారు. ఇందులో వివిధ శాఖలకు చెందిన 14 మంది ముఖ్య కార్యదర్శులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల కమిషనర్లు, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సంబంధిత కార్యదర్శులు సభ్యులుగా, ఉంటారు. వీటితో పాటు రాష్ట్ర స్థాయి కమిటీలుంటాయి. వీటికి ప్రభుత్వం నియమించే ఎస్సీ/ఎస్టీ నామినేటెడ్ వ్యక్తులు చైర్మన్లుగా, ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి మెంబర్ కన్వీనర్గా ఉంటారు. ఆర్థిక శాఖ కార్యదర్శి, మరో నామినేటెడ్ పర్సన్, సంబంధిత శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో...: ప్రత్యేక అభివృద్ధి నిధి పర్యవేక్షణ కమిటీలకు కలెక్టర్ చైర్మన్గా, ఎస్సీ,/ఎస్టీ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఐటీడీఏ పరిధిలో ప్రాజెక్టు అధికారులు, నాన్ ఐటీడీఏ పరిధిలో జేసీ, డీటీడబ్ల్యూఓ, డీఎస్డీవోలు మెంబర్ కన్వీనర్లుగా, మరో 15శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో నిఘా కమిటీలకు ఎస్సీ/ఎస్టీ వ్యక్తులను చైర్మన్లుగా ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీటికి జిల్లా కలెక్టర్ కన్వీనర్గా, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి, గిరిజన సంక్షేమాధికారి, సంబంధిత అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు ఏటా కనీసం రెండు సార్లు సమావేశమై పరిస్థితిని సమీక్షించాలి. ప్రత్యేక అభివృద్ధి నిధి ద్వారా చేపట్టే కార్యక్రమాలు, నిధుల వినియోగం, పనుల నాణ్యత తదితర అంశాలపై పరిశీలించాలి. కమిటీల నిర్ణయాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. -
ప్రత్యేక అభివృద్ధి నిధులేవీ?
- అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అయోమయం - రూ.2 కోట్ల స్పెషల్ ఫండ్ కోసం ఎదురు చూపులు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అయోమయంలో ఉన్నారు. నిధులు అందుతాయన్న ఆశాభావంతో ఎక్కడికక్కడ పనుల కోసం పచ్చ జెండా ఊపడం వీరికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం ఏసీడీఎఫ్ (అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధి) ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఏసీడీఎఫ్ కోసం ఏటా రూ.3 కోట్ల నిధులిస్తున్నారు. కాగా, నియో జకవర్గాల్లో మరిన్ని అభివృద్ధి పనుల కోస మంటూ గతేడాది సీఎం కె.చంద్రశేఖర్రావు ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్)ని ప్రకటించారు. ఏసీడీఎఫ్తో సంబంధం లేకుండా ఏటా మరో రూ.2కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ నిధి అతీగతీ లేకపో వడంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. రూ.4వేల కోట్ల ప్రత్యేక నిధి ముఖ్యమంత్రి ఆధీనంలో రూ.4వేల కోట్ల నిధులు ఉంటాయని గత ఏడాది ప్రకటించారు. గత వార్షిక బడ్జెట్లోనే ఈ మేరకు కేటాయింపులు కూడా జరిగాయి. నియోజకవర్గాల పరిస్థితి, అక్కడి సమస్యలు, తక్షణం దృష్టిసారించాల్సిన అంశాలు, శాశ్వత నిర్మాణాల కోసం వెచ్చించాల్సిన అవసరం తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు నేరుగా సీఎం నిధులు కేటాయించే వెసులుబాటును ఎస్డీఎఫ్ కల్పించింది. గత ఏడాది రెండు మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందనగా ఎమ్మెల్యేలకు ఈ నిధులు అందాయి. వాటితో పనులు కూడా జరిగాయి. తొలి ఏడాది నిధులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు కాబట్టి, రెండో ఏటా ఆశ పెట్టుకున్నారు. ఎలాగూ వచ్చే నిధులే కదా అన్న అతి విశ్వాసంతో కొందరు ఎమ్మెల్యేలు తమకు కావాల్సిన వారికి పనులు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. వీరిలో కొందరు పనులు కూడా పూర్తి చేశారు. అయితే, ఎస్డీఎఫ్ కింద బడ్జెట్ అందక బిల్లులు పెండింగ్లో పడ్డాయి. అభ్యంతరాలే అసలు సమస్య బడ్జెట్లో అనామతు పద్దుకింద ఏకంగా రూ.4వేల కోట్లు కేటాయించడం కుదరదని, కాగ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ సారి వార్షిక బడ్జెట్లో ఎస్డీఎఫ్ ఎత్తేశారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ప్రాంభమైన ఏప్రిల్ నుంచి జూన్ నాటికి అంటే తొలి క్వార్టర్ వరకు రూ.36 కోట్లు వివిధ పథకాల్లో భాగంగా మంజూరు చేశారు. ఆయా ప్రభుత్వ పథకాల్లో ఈ నిధులను విలీనం చేసి పాత జిల్లాల వారీగానే నిధులు కేటాయించారని, ఇవికూడా పూర్తిస్థాయిలో అందలేదని తెలుస్తోంది. ఇక వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలకు నేరుగా రూ.2కోట్ల చొప్పున ఇవ్వడం కుదరకనే దానిని ఎత్తివేశారని సమాచారం. -
రెండు రోజులు.. రూ.9కోట్లు
పోతూపోతూ.. మా పనులు చేయండి! – కలెక్టర్కు అధికారపార్టీ నేతల ప్రతిపాదనలు – ప్రత్యేక అభివృద్ధి నిధి కింద మంజూరు ఇవ్వాలని వినతులు – సంతకం చేస్తారా.. చేయరా అని అధికారుల్లో చర్చ – బదిలీ ఉత్తర్వుల తర్వాత గ్రీన్సిగ్నల్ ఇవ్వడం తప్పంటున్న అధికారులు – పనుల కోసం పర్సెంటేజీలు వసూలు చేస్తున్న అధికార పార్టీ నేతలు అవును.. కలెక్టర్ బదిలీ చుట్టూ వ్యాపారం జరుగుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.9కోట్ల వ్యవహారం ఇది. ఆయనకు బదిలీ తప్పదనే చర్చ నేపథ్యంలో గత రెండు రోజుల్లో అధికార పార్టీ నేతలు ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడ్డారు. ప్రతిపాదనలు.. వినతులతో ఒత్తిళ్లకు తెగబడ్డారు. మరి.. అందుకు ఆయన తలొగ్గుతారా? నైతికతకు కట్టుబడతారా? వేచి చూడాల్సిందే. సాక్షి ప్రతినిధి, కర్నూలు: పోతూ పోతూ తమ పనులు చేసి పోవాలంటూ జిల్లా కలెక్టర్గా ఉన్న విజయమోహన్పై అధికారపార్టీ నేతలు ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం. ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీపీ) పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏటా మంజూరు చేసే రూ.50 కోట్ల నిధుల్లో నుంచి తమకు పనులు ఇవ్వాలని భారీగా ప్రతిపాదనలు సమర్పిస్తున్నారు. వాస్తవానికి గత వారం రోజుల నుంచి జిల్లా కలెక్టర్గా ఉన్న విజయమోహన్ బదిలీ అవుతారనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కేవలం గత రెండు రోజుల్లోనే భారీగా ప్రతిపాదనలు రావడం ఇప్పుడు చర్చనీయాంశమయింది. బదిలీ ఉత్తర్వులు 17వ తేదీ అర్ధరాత్రి విడుదలయ్యాయి. అంటే 18వ తేదీ నుంచి నిబంధనల మేరకు కొత్తగా ఎలాంటి పనులకు గ్రీన్సిగ్నల్ ఇవ్వకపోవడం నైతికంగా సరైనదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు భిన్నంగా కలెక్టర్ చేత ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీపీ) కింద భారీగా పనులకు ఆమోదం తీసుకోవడం కోసం అధికార పార్టీ నేతలు ఎగబడ్డారు. కేవలం 17, 18 తేదీల్లో మాత్రమే రూ.9 కోట్లకు పైగా పనులకు ప్రతిపాదనలు సమర్పించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా వచ్చిన ప్రతిపాదనలను ఆగమేఘాల మీద కన్వర్జెన్సీ కమిటీలో ఉన్న జెడ్పీ సీఈఓ, పీఆర్ ఎస్ఈ, డీపీఓలు ఆమోదం తెలపాలంటూ అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తెచ్చినట్టు సమాచారం. ఇందుకు అనుగుణంగా అధికారులు కూడా ఈ ప్రతిపాదనలను సీపీఓ ద్వారా కలెక్టర్కు పంపించేందుకు రంగం సిద్ధమయింది. ఈ నేపథ్యంలో బదిలీ ఉత్తర్వులు విడుదలైన తర్వాత అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి.. కలెక్టర్ సంతకం చేస్తారా? లేదా అన్నది వేచిచూడాల్సి ఉంది. భారీగా ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ప్రతి ఏటా రూ.50 కోట్ల నిధులను మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా గత మూడేళ్ల నుంచి రూ.150 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల ఖర్చుపై పూర్తిగా కలెక్టర్కే అధికారాలు అప్పగించారు. వాస్తవానికి కలెక్టర్ బదిలీ అవుతారనే ప్రచారం గత వారం రోజుల నుంచి జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి 18వ తేదీ వరకు ఎస్డీపీ కింద పనులు మంజూరు చేయాలంటూ రూ.16.59 కోట్ల మేర విలువైన 142 పనుల ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, కేవలం ఈ రెండు రోజుల్లోనే అంటే 17, 18 తేదీల్లోనే ఏకంగా రూ.9 కోట్ల విలువైన ప్రతిపాదనలు రావడం గమనార్హం. 17వ తేదీన రూ.5.69 కోట్ల విలువైన 43 పనులు, 18వ తేదీన 3.43 కోట్ల విలువైన 22 పనుల కోసం ముగ్గురు సభ్యుల అధికారుల కమిటీకి ప్రతిపాదనలు చేరాయి. ఈ పనులను ఓకే చేస్తూ తాజాగా సీపీఓ ద్వారా కలెక్టర్కు ప్రతిపాదనలు చేరినట్టు సమాచారం. పర్సెంటేజీల పర్వానికి తెర కలెక్టర్ బదిలీ నేపథ్యంలో వస్తున్న ఈ ఎస్డీపీ నిధుల పనుల ప్రతిపాదనల వెనుక పర్సెంటేజీల పర్వం నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పనులను మంజూరు చేయిస్తామని అధికార పార్టీ నేతలు వసూళ్లకు తెగబడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పనుల మంజూరు కోసం 6 నుంచి 10 శాతం వరకూ కమీషన్ వసూలు చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఇది కేవలం పనుల మంజూరు కోసం మాత్రమేనని పేర్కొంటున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ అనుమతిస్తారా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement