-
ఆంగ్లంతో పాటు తెలుగులోనూ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక విభాగపు పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలను ఆంగ్లంతో పాటు తెలుగులోనూ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్ణయించింది. దీనివల్ల అభ్యర్థులందరికీ మేలు జరుగుతోందని కమిషన్ భావిస్తోంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్ కుమార్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని సాంకేతిక, ప్రత్యేక అర్హతలతో కూడిన పోస్టుల నియామకాలకు ఏపీపీఎస్సీ ఇప్పటివరకు ఆంగ్లంలోనే పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. వీటిని తెలుగు మాధ్యమంలో కూడా నిర్వహించాలని గత కొంతకాలంగా గ్రామీణ, తెలుగు మాధ్యమం అభ్యర్థులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఈ పరీక్షలకు సంబంధించిన పేపర్–1ను ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. పేపర్–1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలుంటాయి. ఆంగ్లం ప్రశ్నలను తెలుగులో అనువదించి ఇస్తారు. అయితే ఈ రెండు మాధ్యమాల్లో ఆంగ్లంలోని ప్రశ్నలను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇక పేపర్–2లో సబ్జెక్టు పేపర్లను మాత్రం ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహించనున్నారు. (చదవండి: డిస్కంలకు కాస్త ఊరట..విద్యుత్ అమ్మకం ధరలు తగ్గింపు!) -
ఏపీలో ఆర్థికంగా వెనుకబడినవారి కోసం కొత్త సంక్షేమ శాఖ
-
అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖ
-
AP: అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖ
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఈడబ్ల్యూఎస్ సంక్షేమ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఈ శాఖ పరిధిలోకి కమ్మ,రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్య వైశ్య కార్పొరేషన్లు రానున్నాయి. అలాగే జైన్ల సంక్షేమానికి, సిక్కుల సంక్షేమానికి వేర్వేరు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ రెండు జీవోలను జారీ చేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. (చదవండి: Rain Alert: ఏపీలో భారీ వర్షాలు) -
బేవరేజెస్ కార్పొరేషన్ స్థానంలో ప్రత్యేక శాఖ
- ఎక్సైజ్కు అనుబంధంగా కార్యకలాపాలు - ఉద్యోగులను ప్రభుత్వశాఖలో విలీనం చేసేందుకే సీఎం మొగ్గు? - నిబంధనలు ఒప్పుకోకపోతే మరో రెండు ఆప్షన్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్బీసీఎల్)ను రద్దు చేయడంతో పాటు మద్యం అమ్మకాల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలను ఎక్సైజ్ శాఖ సిద్ధం చేస్తోంది. రాష్ట్ర విభజన తరువాత మద్యం అమ్మకాలు, డిపోల నిర్వహణ కోసం బేవరేజెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాలపై ఆదాయపన్ను రూపంలో ఐటీ శాఖ రూ. 1,247 కోట్లను తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి అటాచ్ చేసుకుంది. సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలంటూ సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బేవరేజెస్ కార్పొరేషన్ను రద్దు చే సి, ప్రత్యేక శాఖగా కొనసాగించాలని నిర్ణయించింది. సీఎం ఆదేశాలమేరకు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ విధివిధానాలపై నివేదిక రూపొందించారు. ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా ఏర్పాటయ్యే ప్రత్యేక శాఖ ద్వారా మద్యం డిపోల నిర్వహణ, రిటైల్ దుకాణాలకు సరఫరా తదితర పనులను కొనసాగిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులుగానే కొనసాగించే ఆలోచన బేవరేజెస్ కార్పొరేషన్లో ప్రస్తుతం 143 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు కాకుండా 200 మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. కార్పొరేషన్ రద్దయినా కొత్తగా ఏర్పాటయ్యే శాఖలో ఉద్యోగులు అవే విధులు నిర్వహిస్తారు. వీరిని ఏపీ తరహాలో కాంట్రాక్టు ఉద్యోగులుగా తీసుకోవాలని భావించినప్పటికీ, ప్రభుత్వంలోకి తీసుకునేందుకే ముఖ్యమంత్రి మొగ్గు చూపినట్లు సమాచారం. కాంట్రాక్టు ఉద్యోగులుగా తీసుకున్నా, వేతనాలు పాతవే చెల్లించాల్సి వచ్చినప్పుడు కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చడం ఎందుకని కేసీఆర్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఉద్యోగ విరమణ తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు, కార్పొరేషన్లో పనిచేసే వారికి పెన్షన్ విధానంలో తేడాలు ఉండడం ఒక్కటే ఇబ్బందిగా ఉన్నట్లు సమాచారం. అవసరమైతే చట్టంలో సవరణలు చేసైనా ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగించాలని భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఆర్థిక శాఖ అడ్డుచెబితే మాత్రం వేరే కార్పొరేషన్కు బదిలీ చేసి డిప్యూటేషన్ మీద ఎక్సైజ్ అనుబంధ శాఖలో కొనసాగించడమా... కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చడమా అనే ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement