breaking news
sound engineer Rasul Pookutty
-
కంగువా చూసిన ప్రేక్షకులకు తలనొప్పి.. స్పందించిన సౌండ్ ఇంజనీర్
హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువా. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. కొన్ని సన్నివేశాల్లో సౌండ్ ఎక్కువగా ఉందని విమర్శలు వచ్చాయి. భరించలేనంత సౌండ్ వాడటంతో సినిమా చూసేటప్పుడు చిరాకు వచ్చిందని పలువురూ అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజనీర్ రసూల్ స్పందించాడు.చివరి క్షణాల్లోనే ఈ సమస్యలుకంగువాలో సౌండ్ బాలేదన్న రివ్యూలు చూస్తుంటే బాధగా ఉంది. ఈ విషయంలో ఎవర్నీ నిందించలేము. సినిమా కంప్లీట్ అయిన చివరి క్షణాల్లోనే ఇలాంటి సమస్యలే వస్తాయి. సినిమా రూపొందించే క్రమంలో జరిగే చిన్న తప్పుల వల్ల దాని మొత్తం విలువే మారిపోతుంది. మూవీ చూశాక ప్రేక్షకులు తలనొప్పితో బయటకు వెళ్తే రిపీటెడ్ ఆడియన్స్ ఉండరు అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు.కంగువా..ఈ పోస్ట్ చూసిన పలువురూ నిజంగానే తమకు సినిమా చూస్తుంటే ఆ సౌండ్కు తలనొప్పి వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. కంగువా విషయానికి వస్తే.. సూర్య.. కంగువ, ఫ్రాన్సిస్ అనే రెండు పాత్రల్లో కనిపిస్తాడు. దిశా పటానీ హీరోయిన్గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు.చదవండి: పొలం పనుల్లో హీరోయిన్ శ్రియ.. వీడియో వైరల్ -
మెగాఫోన్ పట్టనున్న రసూల్!
ఆస్కార్లు గెలుచుకున్న భారతీయ సౌండ్ ఇంజనీర్ రసూల్ పుకుట్టి. ఆ తర్వాత ఆయన పేరు దేశవిదేశాల్లో మార్మోగిపోయి, ఫుల్ బిజీ అయిపోయారు. తనకు దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉన్నట్లు ఆయన త్వరలో మెగాఫోన్ పట్టనున్నారు. ఇటీవలే తన సొంత సినీ నిర్మాణ సంస్థ లీ పెంటా ఎంటర్టైన్మెంట్ను స్థాపించారు. దీని గురించి ఆయన చెబుతూ-‘‘ అన్నీ అనుకున్నట్టు జరిగితే నా మొదటి సినిమానే బాలీవుడ్లో చేయబోతున్నాను. ఇక నా మాతృభాష మలయాళంలో మమ్ముట్టి హీరోగా ఓ సినిమా చేస్తాను. దర్శకునిగా, నిర్మాతగా, సౌండ్ ఇంజనీర్గా ఇక నుంచి మూడు పాత్రలు పోషించనున్నాను’’ అన్నారు.