somisetty
-
కావలి చేరుకున్న మధుసూదన్ పార్థివ దేహం.. కుటుంబ సభ్యులు ఆవేదన
మధుసూదన్ అంత్యక్రియలు అప్డేట్స్.. మధుసూదన్ అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిసోమిశెట్టి మధుసూదన్ అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా అంత్య క్రియలకు హాజరుకానున్న మంత్రి ఆనంకావలి పట్టణంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల్లో ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొననున్న మంత్రి ఆనం.👉జమ్ము కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన సోమిశెట్టి మధుసూదన్ మృతదేహాం కావలి చేరుకుంది. మధుసూదన్ను చూసిన కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మధుసూదన్ ఇంటి వద్దకు భారీ సంఖ్యలో బంధువులు, స్థానికులు చేరుకున్నారు.👉వివరాల ప్రకారం.. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన సోమిశెట్టి మధుసూదన్ మృతదేహాం గురువారం ఉదయం స్వగ్రామం చేరుకుంది. తెల్లవారుజామున మూడు గంటలకు చెన్నై ఎయిర్పోర్టు చేరుకున్న మధుసూదన్ పార్థివ దేహాన్ని కావలికి తరలించారు. ఈ క్రమంలో ఇంటి వద్ద మధుసూదన్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాళి అర్పించారు. మరోవైపు.. ప్రభుత్వ లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.👉ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇలాంటి దుర్ఘటన జరగడం, అందులో కావలి వాసి మృతి చెందడం బాధాకరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. దేశం మొత్తం మృతుడి కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయం ఇది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా.. కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. మృతుని కుటుంబ సభ్యులను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు’ అని తెలిపారు.👉కశ్మీర్లో పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన మారణహోమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మరణించారు. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్ళగా ఈ ఘటన జరిగింది. సోమిశెట్టి మధుసూదన్ తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా ఉంది. మధుసూదన్ తండ్రి తిరుపాల్, తల్లి పద్మావతి పట్టణంలోని పెదపవని బస్టాండ్లో అరటిపళ్లు, టెంకాయల వ్యాపారం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెల తరువాత మధుసూదన్రావు పుట్టారు. స్థోమత లేకున్నా కష్టపడి చదివించారు. అన్నితరగతుల్లో మంచి మార్కులు తెచ్చుకున్న మధుసూదన్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఐబీఎం కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా చేరారు.👉వృత్తిరీత్యా బెంగళూరులో ఉంటున్న మధుసూదన్ అక్కడ సొంతింటిని కూడా కట్టుకున్నారు. వృత్తిలో ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఆశలు పండాయని వృద్ధ తల్లిదండ్రులు సంబరపడ్డారు. వేసవి విడిది కోసమని మధుసూదన్ సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న తన భార్య కామాక్షి, కుమార్తె మేధు (ఇంటర్) కుమారుడు దత్తు (8వతరగతి)తో కలసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదుల తూటాలకు మధుసూదన్రావు బలయ్యారు. తమ కుమారుడు మృతి చెందాడన్న విషయం తెలియని ఆ తండ్రి బుధవారం ఉదయం కూడా అరటిపళ్ల బండి వద్ద ఉండి వ్యాపారం చేసుకుంటున్నారు. మృతుడు మధుసూదన్కు భార్య మీనాక్షి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
అవకాశమా.. అవమానమా!
- జిల్లా అధ్యక్షుడిగా సోమిశెట్టి పేరు ప్రకటించని పార్టీ అధిస్ఠానం - మినీ మహానాడు నిర్వహణకు దూరం - ఆఖరి నిమిషయంలో చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో మహానాడు నిర్వహణ సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లును ఊరిస్తూ ఊసురుమనిపిస్తోంది. గతంలో జిల్లా పార్టీ మొత్తం సోమిశెట్టి పేరునే ప్రతిపాదించగా... అకస్మాత్తుగా శిల్పా చక్రపాణి రెడ్డిని అధిష్టానం నియమించింది. ఇప్పుడు సోమిశెట్టినే జిల్లా అధ్యక్షుడు అంటూ స్వయంగా పార్టీ ఇన్చార్జీలు పేర్కొన్నప్పటికీ చివరి నిమిషయంలో ఆయన పేరును ప్రకటించకపోవడం గమనార్హం. వాస్తవానికి మినీ మహానాడును అధ్యక్ష పదవి హోదాలో సోమిశెట్టినే నిర్వహించాలని మొదట్లో వర్తమానం వచ్చింది. ఇందుకోసం ఆయన కూడా అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే, కొన్ని గంటల్లో మినీ మహానాడు ప్రారంభం కాబోతుండగా... మొత్తం నిర్వహణ అంతా చక్రపాణి రెడ్డినే చేపట్టాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. దీంతో సోమిశెట్టి మిన్నకుండిపోయారు. తెరపైకి బీసీ, రెడ్డి వర్గీయులు వాస్తవానికి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న చక్రపాణి రెడ్డికి శాసన మండలి చైర్మన్ పదవిని ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో జిల్లా అధ్యక్షుడి మార్పు తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్ రెడ్డి, జయనాగేశ్వరరెడ్డిల పేర్లు తెరమీదకు వచ్చాయి. అయితే, ఇందుకు వారిద్దరూ సుముఖత వ్యక్తం చేయలేదు. అదేవిధంగా జిల్లాలోని నేతలందరూ సోమిశెట్టికే ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అదే సందర్భంలో అటు కర్నూలు పార్లమెంటు ఇన్చార్జ్ సుజనా చౌదరి కూడా సోమిశెట్టికే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తున్నట్టు వర్తమానం పంపారు. మినీ మహానాడును కూడా సోమిశెట్టి ఆధ్వర్యంలోనే చేపట్టాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా జిల్లా అధ్యక్ష హోదాలో సోమిశెట్టి అందరికీ మినీ మహానాడు వర్తమానం కూడా పంపారు. నగరం మొత్తం ఆయన పేరుతో ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. అయితే, చివరి నిమిషయంలో మళ్లీ చక్రపాణి రెడ్డినే నిర్వహించాలని కబురు రావడంతో అందరూ అవాక్కయ్యారు. అయితే, అన్ని జిల్లాలతో పాటు కర్నూలు జిల్లా అధ్యక్ష పదవి కూడా ప్రకటిస్తారని..అది సోమిశెట్టికే వస్తుందని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. అయితే, రెడ్డి లేదా బీసీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశం ఉందని మరో వర్గం వాదిస్తోంది. మొత్తం మీద గతంలో మాదిరిగానే ఆయనకు మొండిచేయి చూపిస్తారా? పట్టం కడతారో చూడాల్సి ఉంది.