breaking news
smart bikes
-
మెట్రో స్మార్ట్ బైక్స్ అదుర్స్
-
ఎంతో హాయి సైకిల్ సవారి
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రూట్లలో సైకిల్ సవారీ.. సిటీజన్లకు ఓపక్క ఆనందాన్ని పంచుతునే.. ఆరోగ్యాన్నీ అందించేలా అధికారులు చూస్తున్నారు. అందుకు అనుగుణంగా మూడు మార్గాల్లో 64 స్టేషన్ల వద్ద సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. తొలివిడతగా మియాపూర్, జేఎన్టీయూ, కేపీహెచ్బీ, ఫోరంమాల్, హైటెక్సిటీ కూడలి వద్ద వీటిని ఏర్పాటు చేస్తారు. సొంత వాహనాల అవసరం లేకుండా హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో వీటిని అందుబాటులోకి తేనున్నారు. తొలి అరగంటకైతే ఉచితంగానే సైకిల్ను తీసుకోవచ్చు. అంతకు మించితే అద్దె చెల్లించాలి. అయితే వీటి అద్దె ఎంతనేది ఇంకా నిర్ణయించలేదు. 400 స్టేషన్లు..10 వేల సైకిళ్లు.. నగరంలోని మెట్రో స్టేషన్లలో దశలవారీగా 400 సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు పదివేల సైకిళ్లను ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉంచేందుకు హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్, మెట్రోరైలు, యూఎన్ హ్యాబిటేట్ అనే సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం రూ.100 కోట్ల విలువైనది కావడం విశేషం. అంతా ‘స్మార్ట్’గా అద్దె సైకిల్ను అద్దెకు తీసుకోవాలంటే స్మార్ట్ఫోన్, స్వైప్కార్డు ఉండాల్సిందే. ఇందుకోసం ప్రత్యేకంగా స్మార్ట్ బైక్యాప్ను రూపొందించనున్నారు. మొబైల్ యాప్ డౌన్లోడ్ చేశాక.. సైకిల్పై ఉన్న క్యూఆర్కోడ్పై చూపిస్తే సైకిల్ తాళం తెరచుకుంటుంది. మరో సైకిల్ స్టేషన్లో దీన్ని అప్పగించగానే ప్రయాణించిన సమయాన్ని బట్టి అద్దె చెల్లించాలి. ఇందుకోసం మెట్రో స్టేషన్ల వద్ద స్వైప్ కార్డులను తీసుకోవాలి. ఆధార్, క్రెడిట్కార్డు వంటి వివరాలు పరిశీలించిన తరవాతనే సైక్లింగ్ క్లబ్లో సభ్యత్వం ఇస్తారు. మూడు, 6, ఏడాదిపాటు సైకిలింగ్ క్లబ్లో సభ్యత్వం తీసుకోవచ్చు. స్మార్ట్ సైకిల్ ప్రత్యేకతలు.. ♦ అంతర్జాతీయ ప్రమాణాలు గల ఈ స్మార్ట్ బైక్ సైకిళ్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. ♦ గేర్లు ఉండడం వల్ల తొక్కడం సులువు. శ్రమ అవసరం లేకుండా హాయిగా ప్రయాణించవచ్చు. ♦ ఆడ, మగ, చిన్నారుల ఎత్తును బట్టి సీటు ఎత్తును మార్చుకోవచ్చు. ♦ సామగ్రి పెట్టుకోవడానికి ముందుభాగంలో లగేజీ క్యారియర్ ఉంటుంది. ♦ ప్రతీ సైకిల్కూ క్యూఆర్ కోడ్, ప్రత్యేకంగా సంఖ్య కేటాయిస్తారు. ♦ ఒక్కో సైకిల్ ఖరీదు రూ.70 వేలు. ఇందులో 40 శాతం కస్టమ్స్ డ్యూటీయే. ♦ మౌలిక వసతులు, సాఫ్ట్వేర్ సిబ్బంది, నిర్వహణ కలిపితే ఒక్కో సైకిల్కు లక్ష వ్యయం అవుతుంది. ♦ ప్రతీ సైకిల్ను జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానిస్తారు. ♦ కంట్రోల్ రూమ్ నుంచి సైకిల్ సంఖ్య ఆధారంగా పర్యవేక్షిస్తారు. ♦ బేగంపేట్లో తాత్కాలికంగా సైకిల్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో సైకిల్ ఖరీదు రూ. 70 వేలు వసతులు, నిర్వహణ వ్యయం ఒక్కో సైకిల్కు రూ. లక్ష నగరానికి చేరిన స్మార్ట్ సైకిళ్లు -
టోటల్లీ ప్యాక్డ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ బైక్ కమింగ్ సూన్..!
బీజింగ్: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ లీ ఇకో మరో ఆవిష్కారానికి శ్రీకారం చుట్టింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారిత బైక్ లను త్వరలో ప్రవేశపెట్టనుంది. ఆండ్రాయిడ్ డివైస్తో అనుసంధానమై పనిచేసే ఈ బైక్ను చైనా సంస్థ లీఎకో రూపొందిస్తోంది. 2017 రెండో త్రైమాసికంలో ఈ టోటల్లీ ప్యాక్డ్ విత్ ఆండ్రాయిడ్ స్మార్ట్బైక్ను అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. ఇందులో స్మార్ట్ రోడ్ బైక్, స్మార్ట్ మౌంటెన్ బైక్ పేరుతో రెండు వేరియంట్స్ ను తీసుకొస్తోంది. మిగతా సూపర్ బైక్ ల ఫీచర్లతో పాటు 6000 ఎంఏహెచ్ సామర్ధ్యంతో పనిచేసే రిమూవబుల్ బ్యాటరీ , స్నాప్ డ్రాగన్ 410 పవర్డ్ టచ్ స్ర్కీన్ టర్న్ బై టర్న్ నావిగేషన్ , వాకీ టాకీ లాంటి అదనపు ఫీచర్లు ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే ధర ఎంత అనేది మాత్రం ప్రస్తుతానికి సప్పెన్సే. ఈ స్మార్ట్ బైక్ హ్యాండిల్స్ పై ఉండే నాలుగు అంగుళాల టచ్ ఆధారిత స్మార్ట్ స్క్రీన్ ద్వారా మనం ఏ దిశలో వెళ్లాలో తెలుసుకోవచ్చు. ఏయే ప్రాంతాల్లో తిరిగామో రికార్డు కూడా చేస్తుంది. ఒంటరి ప్రయాణంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ సంగీతాన్ని ఆస్వాదించొచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు ఈ బైక్ను ఎవరైనా చోరీ చేసేందుకు ప్రయత్నిస్తే.. ఆ బైక్ సంబంధిత యజమాని ఫోన్కి అలర్ట్ ఆటోమేటిక్గా అందే ఏర్పాటు ఉంది. సెన్సర్ల ద్వారా రైడర్ ఫిట్నెస్ వివరాలను కూడా ఈ స్మార్ట్ బైక్ ట్రాక్ చేసేలా రూపొందించారట. దీంతో ఆండ్రాయిడ్ ప్లాట్ఫాంపై స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ కార్లు, స్మార్ట్ టీవీలే కాదు స్మార్ట్ బైక్ లు కూడా ఇక మార్కెట్లను ముంచెత్తబోతున్నాయన్నమాట. అయితే ముందుగా అమెరికాలో హల్ చల్ చేయనున్న ఈ స్మార్ట్ బైక్ లకోసం దేశీయ బైక్ లవర్స్ మాత్రం మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.